Posts

Showing posts with the label congress

ఏనుగు దంతాలు ఊడినయ్.. శ్రేణులు ఆగం అయ్యినయ్

Image
(జమాల్పూర్ గణేష్ /మూల్పూరు రాజేంద్ర బాబు)   ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో వెలిగిన ఏనుగు రవీందర్ రెడ్డి ప్రస్తుతం గంజిలో పడ్డ ఈగ చందంగా మారింది. "ఏనుగు దంతాలు ఊడినయ్-శ్రేణులు అయోమయంలో పడినయ్" అంటూ రాజకీయ ప్రత్యర్ధులు రాగాలు తీస్తున్నారు.. ఈ విచిత్ర అరుదైన రాజకీయ పరిస్థితులపై మన నిజామాబాద్ అందిస్తున్న స్పెషల్ ఫోకస్ ఇది.. ఏనుగు రవీందర్ రెడ్డి TRS రాజకీయ ప్రస్థానంలో ఒక వెలుగు వెలిగారు. ఆ పార్టీ నుంచి ఎల్లారెడ్డి సీనియర్ MLA గా తిరుగు లేని ఆధిపత్యం చెలాయించారు..ఆ ఊపుతోనే ఈటెల రాజేందర్ తో బీజేపీలో చేరి హల్చల్ చేశారు.. అక్కడ వర్కవుట్ కాక కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని బాన్సువాడ బాద్షా కావాలని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అప్పటి BRS సిట్టింగ్ MLA పోచారం శ్రీనివాస్ రెడ్డికి చుక్కలు చూపించారు.. తానోడినా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పోచారం కు చెక్ పెట్టారు.. బాన్సువాడ సెగ్మెంట్ లో ఇసుక పోయింట్స్ కంట్రోల్ లోకి తెచ్చుకుని కల్లం లో కుప్పలుగా ఎగబోసుకున్నారు.. పోలీస్, రెవెన్యూ తో పాటు అధికారులను చెప్పుచేతల్లో పెట్టుకుని పోచారం శ్రీనివాసరెడ్డి కి ఊపిరి ఆడనీయలేదు ఏనుగు రవీందర్ రెడ్డి.. ఈ పరిస్థ...

మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ బిగ్ ఫైట్.. పూజల్లో తరిచిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Image
(జమాల్పూర్ గణేష్ /మూల్పూరు రాజేంద్ర బాబు) హైదరాబాద్, జులై 2; తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్లు ఉంది రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారం.. అచ్చం ఈ సామెతకు సరిపోయే రాజకీయ సన్నివేశాలు హైదరాబాద్ గడ్డ మీద ఆవిష్కృతం అయ్యాయి. వివరాల్లోకి వెళితే... ప్రభుత్వం ,ప్రధాన ప్రతిపక్షమైన BRS నడుమ గురువారం హైదరాబాద్ లో బిగ్ ఫైట్ జరిగింది.. రేవంత్ రెడ్డి ఘన కార్యాలను తెలంగాణ భవన్ కు వచ్చి చెబుతా అని మంత్రి జూపల్లి సవాల్ విసిరారు. దానికి స్పందించిన కేటీఆర్, హరీష్ రావు ఇన్ టైంలో వచ్చి కూర్చున్నారు.అదే టైంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి బస్తీమే సవాల్ అంటూ గన్ పార్క్ అమర వీరులస్తూపం వద్ద బహిరంగ చర్చ కోసం మకాం వేశారు.. అక్కడికి చేరుకునేందుకు మొదట హరీష్ రావు తెలంగాణ భవన్ బయట పోలీసులతో పెద్ద యుద్ధమే చేశారు. తోపులాట,పోలీసుల బల ప్రయోగంతో హరీష్ కింద పడి పోయారు.. ఈ నాటకీయ రాజకీయ పరిణామాలు గురువారం రాష్ట్ర వ్యాపితంగా హల్చల్ రేపాయి. సీన్ కట్ చేస్తే.. ఈ మొత్తం వ్యవహారంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆంటీ ముట్టనట్లు ఉన్నారు. ఎక్కడా కనపడలేదు.. పల్లెత్తు మాట్లాడలేదు..రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో మం...

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

Image
జమాల్పూర్ గణేష్...✍️  ఎంపీ అర్వింద్ ఏది మాట్లాడినా ట్రిండింగే..మౌనంగా ఉన్నా రాజకీయ ప్రత్యర్థులకు తొండను మింగిన అనుమానమే అంటే అతిశయోక్తి కాదేమో... మన ఇందూరు-మన మేయర్ ట్యాగ్ లైన్ తో పాటు హిందూత్వ ఎజెండాను గల్లీ గల్లీల్లో విస్తృతంగా ప్రచారం చేసి సింగిల్ హ్యాండ్ తో 28 సీట్లను సంపాదించిన అర్వింద్ నడవడిక ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది..  నిజామాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఫలితాల మరుసటిరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేస్తారని ఎదురు చూశాయి అనేక వర్గాలు.. ఈ అంచనకు భిన్నంగా గంభీరంగా, రెండు మూడు అంశాలకే పరిమితము అయ్యారు.28 సీట్లు తక్కువేమీ కాదంటూనే ప్రతిపక్షంలో కూర్చుంటామని సాదా సీదాగా చెప్పి ,మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక వ్యవహారంపై ప్రస్తావనకే పరిమితం అవ్వడంపై కూడా చర్చ సాగుతోంది. సహజమైన నైజానికి భిన్నంగా అర్వింద్ కూల్ గా ,గుంభనంగా, శాంతంగా కనబడడం కూడా ప్రత్యర్థి పార్టీల్లో చర్చకు తావిచ్చినట్లు స్పష్టమైతోంది.ఇది ఎంతదాక పోయిందంటే ఆయనతో తిరిగే కమలం ముఖ్య కార్యకర్తలు సైతం సోమవారంనాడు మేయర్ ఎన్నికలో ఏమి జారుగుతాదో చూడండి అనేదాక పోయింది అర్వింద్ ...

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

Image
జమాల్పూర్ గణేష్.... ✍︎ పదేళ్ల తర్వాత మరోసారి కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పాలనా పగ్గాలు చేపట్టబోతోంది. దీనికోసం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. ఫలితాలు వెలువడిన తరువాత శుక్రవారం రాత్రి జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు నగేష్ రెడ్డి నివాసంలో ముఖ్య నాయకులు,కార్పిరేటర్లతో భేటీ అయి సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. గత పదేళ్లు BRS అనుసరించిన పొలిటికల్ ఫార్ములనే అనుసరించి MIM తో జాతకట్టాలని సూత్ర ప్రాయంగా నిర్ణయానికి వచ్చారు.. ఇంతకు మించి వేరే ప్రత్యామ్నాయ మార్గమేమి లేదనే అంచనాకు వచ్చారు మహేష్ గౌడ్. మజ్లీస్ తో జతకటితే మేయర్ పీఠాన్ని హస్తగతం చేసుకునేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 31ను చేరుకునే తప్పని పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ మునిసిపల్ లో గతంలో కంటే 15 సీట్లు ఎక్కువగా సాధించింది.17 సీట్లు చేజిక్కించుకున్న కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ ను పొందాలంటే ఇంకా 14 మంది సంఖ్యా బలం అవసరముంది. కరెక్టుగా..కాకతాలియంగా MIM ఈ సారి 14 సీట్లు గెలుచుకోవడం కాంగ్రెస్ కు కలిసి వచ్చింది..ఇక ఎక్సఫీపియో ఓట్లతో పనిలేకుండా MIM తో జతకట్టి మేయర్ పదవిని సొంతం చేసుకోబోతోంది కాంగ్ర...

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

Image
జమాల్పూర్ గణేష్.... ✍︎ తెలంగాణ రాజకీయాల్లో ఇద్దరు ఉద్దండుల మధ్య జరిగిన బల్దియా పోరు టగ్ ఆఫ్ వార్ ను తలపించింది. అభ్యర్థులు ,పార్టీల బలాబలాలు పక్కకు జరిగిపోయాయి.. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,MP అర్వింద్ ల మధ్య ఆధిపత్య పోరు గా నిలిచింది నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నిక.. ఈ ఇద్దరు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు.. నరేందర్ రెడ్డి సతీమణిని శమంత ను మేయర్ పీఠం పై కూర్చోపెట్టడానికి మహేష్ గౌడ్... స్రవంతికి పట్టాభిషేకం చేయడానికి అర్వింద్ పట్టు బిగించి పనిచేశారు.. అంతటితో ఆగలేదు ఈ ఇద్దరి ఫైట్.. మేయర్ అభ్యర్థులను ఓడించేందుకు ఆరో డివిజన్లో మహేష్ గౌడ్,19 వ డివిజన్ లో అర్వింద్ ప్రత్యర్థి అభ్యర్థులను    ఓడించేందుకు  అనేక పాచికలు వేశారు.. ఈ రాజకీయ ఆధిపత్య పోరు పోలింగ్ ప్రక్రియను సైతం ప్రభావితం చేసింది.. ఫైనల్గా కాంగ్రెస్,బీజేపీ మధ్య ఓట్ల యుద్ధం సైతం గంభీర్యంగా నిలిచింది.. కమలం పార్టీని,అర్వింద్ కు ముగుతాడు వేసేందుకు మహేష్ గౌడ్ మంత్రాంగం చేసినా ఫలితం కనపడే పరిస్థితి లేదనే అంశం పోలింగ్ ప్రక్రియతో తేటతెల్లమైంది.. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లోనూ కమల వికాసం స్పష్టంగా ...