కామారెడ్డి పట్టణ ప్రథమ పౌరురాలు ఇప్ప ఉమారాణి మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నిక చెల్లదంటూ ఆమె రాజకీయ ప్రత్యర్థి రంగ మాధవి కామారెడ్డి జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కామారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఇప్ప ఉమారాణి మునిసిపల్ చైర్మన్గా భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.ఎన్నికల నియమావలికి వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా కేవలం మూడు ఓట్ల తేడాతో ఎన్నికయ్యారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా మంగళవారం కామారెడ్డి జిల్లా న్యాయస్థానంలో దాఖలు చేసిన కేసు నంబర్ ELEC. OP 1 OF 2026 ఎలక్షన్ పిటిషన్ కోర్టులో అడ్మిట్ అయింది. ఈ నేపథ్యంలో ఈ కేసుని జిల్లా న్యాయమూర్తి CHVRR Prasad విచారణకు స్వీకరించారు.
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
జమాల్పూర్ గణేష్.... ✍︎
పదేళ్ల తర్వాత మరోసారి కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పాలనా పగ్గాలు చేపట్టబోతోంది. దీనికోసం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు.
ఫలితాలు వెలువడిన తరువాత శుక్రవారం రాత్రి జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు నగేష్ రెడ్డి నివాసంలో ముఖ్య నాయకులు,కార్పిరేటర్లతో భేటీ అయి సుదీర్ఘంగా మంతనాలు జరిపారు.
గత పదేళ్లు BRS అనుసరించిన పొలిటికల్ ఫార్ములనే అనుసరించి MIM తో జాతకట్టాలని సూత్ర ప్రాయంగా నిర్ణయానికి వచ్చారు.. ఇంతకు మించి వేరే ప్రత్యామ్నాయ మార్గమేమి లేదనే అంచనాకు వచ్చారు మహేష్ గౌడ్.
మజ్లీస్ తో జతకటితే మేయర్ పీఠాన్ని హస్తగతం చేసుకునేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 31ను చేరుకునే తప్పని పరిస్థితి నెలకొంది.
నిజామాబాద్ మునిసిపల్ లో గతంలో కంటే 15 సీట్లు ఎక్కువగా సాధించింది.17 సీట్లు చేజిక్కించుకున్న కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ ను పొందాలంటే ఇంకా 14 మంది సంఖ్యా బలం అవసరముంది. కరెక్టుగా..కాకతాలియంగా MIM ఈ సారి 14 సీట్లు గెలుచుకోవడం కాంగ్రెస్ కు కలిసి వచ్చింది..ఇక ఎక్సఫీపియో ఓట్లతో పనిలేకుండా MIM తో జతకట్టి మేయర్ పదవిని సొంతం చేసుకోబోతోంది కాంగ్రెస్. ఈ నేపథ్యంలో
ఇంకేముంది MIM తో దోస్తానకే జై కొట్టింది మహేష్ గౌడ్ తో భేటీ అయిన ముఖ్య నాయకత్వ గణం. దీన్ని ఆచరణంలో పెట్టేందుకే మొగ్గు చూపిన మహేష్ గౌడ్ ఇక్కడి రాజకీయ సమీకరణాలు, సంఖ్యా సమికరణాలను CM రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారు.. ఈ విషయాలన్నీ వివరంగా చెప్పి CM సమ్మతిని సాధించేందుకు శనివారం భేటీ అయ్యేందుకు హుటాహుటిన హైదరాబాద్ వెళ్లనున్నారు.
మజ్లీస్ తో జతకడతారా..ముందుగా ప్రకటించినట్లు బీజేపీకి ఎంత దూరమో MIM కి అంత దూరమేనన్న మాటకు కట్టుబడి ఉంటారా అని శుక్రవారంనాడు నిజామాబాద్ లో విలేకరులు అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పక పోవడం గమనార్హం.
నిజామాబాద్ వాసిగా నా స్వార్థ మ్ నాకు ఉంటది..నిజామాబాద్ అభివృద్ధి కోసం మేయర్ పదవి అవసరం అంటూనే..పొలిటికల్ ఎఫైర్స్ కమిటితో చర్చించి MIM తో పొత్తు విషయంలో నిర్ణయం తీసుకుంటామని PCC చీఫ్ చెప్పారు. కానీ MIM తో పొత్తు ఉండదని ఖరాఖండిగా చెప్పకపోవడంతో పొత్తు ఖాయమనే అన్యోపదేశంగా తేల్చిచెప్పారు మహేష్ కుమార్ గౌడ్..
బీజేపీ మళ్ళీ 28 స్థానాలకే పరిమితం కావడం వల్ల కాంగ్రెస్, మజ్లీస్ పొత్తుకు మార్గం సుగమం అయ్యింది. మరో 3 సీట్లు గనక వస్తే అవుట్ రైట్ గా నిజామాబాద్ కార్పొరేషన్ పాలన పగ్గాలు ఎంపీ అర్వింద్ నాయకత్వంలో బీజేపీ చేతికి చిక్కేది..
జమాల్పూర్ గణేష్...✍️ ఎంపీ అర్వింద్ ఏది మాట్లాడినా ట్రిండింగే..మౌనంగా ఉన్నా రాజకీయ ప్రత్యర్థులకు తొండను మింగిన అనుమానమే అంటే అతిశయోక్తి కాదేమో... మన ఇందూరు-మన మేయర్ ట్యాగ్ లైన్ తో పాటు హిందూత్వ ఎజెండాను గల్లీ గల్లీల్లో విస్తృతంగా ప్రచారం చేసి సింగిల్ హ్యాండ్ తో 28 సీట్లను సంపాదించిన అర్వింద్ నడవడిక ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.. నిజామాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఫలితాల మరుసటిరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేస్తారని ఎదురు చూశాయి అనేక వర్గాలు.. ఈ అంచనకు భిన్నంగా గంభీరంగా, రెండు మూడు అంశాలకే పరిమితము అయ్యారు.28 సీట్లు తక్కువేమీ కాదంటూనే ప్రతిపక్షంలో కూర్చుంటామని సాదా సీదాగా చెప్పి ,మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక వ్యవహారంపై ప్రస్తావనకే పరిమితం అవ్వడంపై కూడా చర్చ సాగుతోంది. సహజమైన నైజానికి భిన్నంగా అర్వింద్ కూల్ గా ,గుంభనంగా, శాంతంగా కనబడడం కూడా ప్రత్యర్థి పార్టీల్లో చర్చకు తావిచ్చినట్లు స్పష్టమైతోంది.ఇది ఎంతదాక పోయిందంటే ఆయనతో తిరిగే కమలం ముఖ్య కార్యకర్తలు సైతం సోమవారంనాడు మేయర్ ఎన్నికలో ఏమి జారుగుతాదో చూడండి అనేదాక పోయింది అర్వింద్ ...
(జమాల్పూర్ గణేష్, రాజేంద్ర బాబు) పీసీసీ చీ ఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రాంగం ఫలించింది. మజ్లీస్ పార్టీతో జతకట్టి మేయర్ పీఠాన్ని చేజిక్కించుకుంది.ఆ పీఠంపై అతి సాధారణ మహిళ కూరగాయల ఉమా రాణిని కూర్చోబెట్టింది కాంగ్రెస్ పార్టీ.నలభై ఏళ్లుగ మహేష్ కుమార్ గౌడ్ కు అత్యంత నమ్మిన బంటుగా కొనసాగుతూ వస్తున్న కసాబ్ గల్లీ కరాటే రమేష్ సతీమణిని అసాధారణ రాజకీయ సమీకరణాలు మేయర్ పదవికి దరిచేర్చింది. మహేష్ కుమార్ గౌడ్ కు ఆత్మగా వ్యాపార దిగ్గజంగా ఉన్న కాటిపల్లి నరేందర్ రెడ్డి సతీమణి ని మేయర్ పీఠంపై కూర్చోబెట్టేందుకు పడరాని పాట్లు పడ్డారు.. అయితే ఆమె కార్పొరేటర్ గా గెలవలేక పోయింది.20 కోట్లు ఖర్చు చేసిన ఫలితం లేకపోవడంతో సాధారణ మహిళ కార్పొరేటర్లు ఉమారాణి,పంచ రెడ్డి లలిత, పూజిత గౌడ్ మేయర్ పదవి కోసం పోటీపడ్డారు. NSUI,యూత్ కాంగ్రెస్ లో చురుకైన పాత్ర పోషించడంతో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పంచ రెడ్డి చరణ్ సతీమణి లలిత కు దాదాపుగా పదవి ఖాయం అయ్యిందని ప్రచారం జరిగింది.. వరుసగా మేయర్ పదవిని మూడు సార్లు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే అనుభవించడం లలిత అవకాశాలను నీరు గార్చింది.. ...
✍︎... జమాల్పూర్ గణేష్ :- కాంగ్రెసు పార్టీకి జవసత్వాలు పోస్తున్న క్యాడర్,లీడర్ల మనోభావాలను మందు పాతర పెట్టి ఖతం చేస్తున్న బడా నేత ఎవరనే చర్చ చక్కర్లు కొడుతోంది. కాసు బ్రహ్మానంద రెడ్డి జమానాలో అప్పటి ఆర్థిక మంత్రి అర్గుల్ రాజారాం నుంచి మొదలుకుని YS రాజశేఖర్ రెడ్డి హయాంలో డి. శ్రీనివాస్(DS) వరకు కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణంలో పార్టీ సీనియర్లకు రాజకీయ అవకాశాలు దక్కాయి. పార్టీలోనూ..రాజ్యాంగ బద్ధ పదవుల్లోనూ పార్టీకి పునాదిగా పనిచేయడం ద్వారా పైకి వచ్చిన వారికే అవకాశాలు దక్కాయి. ఇప్పుడా పరిస్థితి రివర్స్ అయింది.పార్టీ కోసం భుజాలు అరిగే దాకా జెండాలు మోసి..రాస్తారోఖో..రైల్ రోఖో.. బంద్ కరో బంద్ కరో అంటూ నోర్లు బొంగురు పోయే దాకా అరిచి నెత్తి నోరు కొట్టుకున్న నిఖార్సయిన ,నిజమైన కాంగ్రెస్ క్యాడర్ కు లాస్ట్ బెంచే దిక్కయ్యింది.. ఖరీదైన ఖద్దరు బట్టలేసుకుని తెలుగుదేశం ప్రభుత్వం హయాం లో మండవ వెంకటేశ్వర రావుతో రాసుకు పూసుకు తిరిగిండు..BRS ఏలుబడిలో అప్పటి మంత్రి ప్రశాంత్ రెడ్డి,కల్వకుంట్ల కవితతో చనువుగా ఉంటుండే..ఇప్పుడు PCC చీఫ్ మహేష్ తో పాటు సర్కార్ సలహదారులు సుదర్శన్ రెడ్డ...
తెలంగాణ రాజకీయాల్లో బలమైన క్రేజీ లీడర్లు ఇద్దరు భేటీ కావడం రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించనుందా అంటే అవుననే సమాధానం వస్తోంది.. నిజామాబాద్ లో RTO గా పని చేసిన కోమటిరెడ్డి మోహన్రెడ్డి మనుమరాలి వివాహ కార్యక్రమం దీనికి వేదిక అయ్యింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధపడుతూ, దక్షిణ తెలంగాణలో బలమైన నేతగా ఎదిగిన మునుగోడు MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,BRS ట్రబుల్ షూటర్ హరీష్ రావు భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. ఫంక్షన్ లో ఈ ఇద్దరు నేతలు సిరియస్గా చర్చించుకుంటున్న వీడియో షోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. రాజగోపాల్ రెడ్డి సీరియస్ ప్రజెంటేషన్ ఇస్తుంటే..అంతే సీరియస్ గా వింటూ హరీష్ రావు ఏమి చేద్దాం అంటూ నెత్తి కొట్టుకుంటున్న వీడియో పొలిటికల్ పార్టీల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముందు ఇచ్చిన మాట ప్రకారం ఇస్తే మంత్రి పదవి ఇవ్వండి..లేకుంటే ముఖ్యమంత్రి సీటే టార్గెట్ అంటూ ఇటీవలి కాలంలో బహిరంగంగా ధమ్కీ ఇచ్చారు రాజ గోపాల్ రెడ్డి.. వీళ్ళు మాట తప్పితే మునుగోడును మీరు చూసుకోండి..తెలంగాణలో జెండా పాతే పనిలో నేనుంటా నంటూ కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి చేసిన ప...
జమాల్పూర్ గణేష్.... ✍︎ తెలంగాణ రాజకీయాల్లో ఇద్దరు ఉద్దండుల మధ్య జరిగిన బల్దియా పోరు టగ్ ఆఫ్ వార్ ను తలపించింది. అభ్యర్థులు ,పార్టీల బలాబలాలు పక్కకు జరిగిపోయాయి.. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,MP అర్వింద్ ల మధ్య ఆధిపత్య పోరు గా నిలిచింది నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నిక.. ఈ ఇద్దరు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు.. నరేందర్ రెడ్డి సతీమణిని శమంత ను మేయర్ పీఠం పై కూర్చోపెట్టడానికి మహేష్ గౌడ్... స్రవంతికి పట్టాభిషేకం చేయడానికి అర్వింద్ పట్టు బిగించి పనిచేశారు.. అంతటితో ఆగలేదు ఈ ఇద్దరి ఫైట్.. మేయర్ అభ్యర్థులను ఓడించేందుకు ఆరో డివిజన్లో మహేష్ గౌడ్,19 వ డివిజన్ లో అర్వింద్ ప్రత్యర్థి అభ్యర్థులను ఓడించేందుకు అనేక పాచికలు వేశారు.. ఈ రాజకీయ ఆధిపత్య పోరు పోలింగ్ ప్రక్రియను సైతం ప్రభావితం చేసింది.. ఫైనల్గా కాంగ్రెస్,బీజేపీ మధ్య ఓట్ల యుద్ధం సైతం గంభీర్యంగా నిలిచింది.. కమలం పార్టీని,అర్వింద్ కు ముగుతాడు వేసేందుకు మహేష్ గౌడ్ మంత్రాంగం చేసినా ఫలితం కనపడే పరిస్థితి లేదనే అంశం పోలింగ్ ప్రక్రియతో తేటతెల్లమైంది.. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లోనూ కమల వికాసం స్పష్టంగా ...
ఎప్పుడూ సీరియస్గా కనపడే ప్రదేశ్ కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ సైతం మ్యూజిక్ కు మైమరచిపోయిన అరుదైన సందర్భం ఆవిష్కతం అయ్యింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమం సోమవారం హైదరాబాద్ శివారులోని రిసార్ట్ లో జరిగింది. శిక్షణ పూర్తయిన వారికి సర్టిఫికెట్ ప్రధానం సందర్భంగా ఒక నాయకుడు హిందీ పాటకు అనుగుణంగా స్టెప్పులు వేస్తూ వేదిక పైకి ఎక్కారు.. మేడం నటరాజన్ పక్కనే నిలబడి ఉన్న నాయకుడు ఫుల్ జోష్ తో స్టెప్పులు వేస్తుండగా.. వేదిక పైకి ఎక్కిన నాయకుడు శృతి కలిపారు. ఇద్దరు నేతలు స్టెప్పులు వేయడంతో పక్కనే ఉన్న ఆలిండియా కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ సైతం కాళ్లతో తప్పెట్లు వేశారు..మ్యూజిక్ కు తగ్గట్టు మేడం అటూ ఇటూ కదలగా.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చప్పట్లు కొడుతూ జోష్ ను మరింత పెంచారు..
మహా పండితులు సిరివెన్నెల సీతారామ శాస్త్రి కలం నుంచి జాలువారిన పాటకు నిలువు టద్దంగా నిలిచాయి ఓట్ల బేరసారాలు... మొన్నటి వరకు నీతి నిజాయితీ,ప్రజా సేవ,సమస్యల పరిష్కారం కోసం కట్టుబడి పనిచేస్తామని గప్పాలు కొట్టి..పోలింగ్ సమీస్తున్న వేళ బరితెగించారు.. ప్రజా స్వామ్యాన్ని నిలువునా పాతర వేస్తున్నారు..పైసలు పంచితేనే ఓటర్లు కనికరిస్తారని కాబోలు..ఇండిపెండెంట్లు సైతం పచ్చ నోట్ల పందేరానికి తెర తీశారు.ఇండిపెండెంట్లే ఇట్లా బరితెగిస్తుంటే.. ఇక ప్రధాన పార్టీ అభ్యర్థులైతే నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ప్రచార పర్వానికి తెరపడిందో లేదో నోట్ల కట్టలతో ఓటర్ల ముంగిట్లో వాలారు గద్దల్లా..ఓటుకు వెయ్యి నుంచి మొదలుకొని రెండు వేల వరకు పంచి పెట్టారు..నిజామాబాద్ నగరంలో అయితే సందేట్లో సడెమియ్య అన్నట్లు కొన్ని ప్రాంతాల్లో కొద్దిసేపు విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందంటే ఏ మేరకు ఓట్ల కొనుగోలు వ్యవస్తీకృతము అయ్యిందో అర్థము అవుతోంది.. జనరల్ ఎన్నికలను తలదన్నే స్థాయిలో ఓట్ల కోసం బేరసారాలు జరిగాయి. అన్ని పార్టీలు ఒకే తానులో గుడ్డలే అనే సామెత సరిపోయింది.. అన్ని పార్టీలు అక్రమంగా ఓట్లను కొనుగోలు కోసం బరిలో నిల...
బీజేపీ శాసనసభ పక్ష సమావేశనికి కామారెడ్డి వేదిక అయ్యింది. రానున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బిజెపి శాసనసభా పక్ష సమావేశం కామారెడ్డి ఎమ్మెల్యే, బిజెపి శాసనసభాపక్ష ఉపనేత కాటిపల్లి వెంకటరమణారెడ్డి నివాసంలో నిర్వహించారు.ఈ కీలక భేటీలో.. ఎమ్మెల్సీ సీ.అంజిరెడ్డి,బిజెపి శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి , శాసనసభాపక్ష ఉపనేత, అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు , ముధోల్ ఎమ్మెల్యే రామారావు పవార్ , నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడదానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కారణమని బీజేపీ శాసనసభ పక్ష సమావేశం ఆరోపించింది.రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ పక్షం అసెంబ్లీలో గొంతు విప్పుతుందని సమావేశం ప్రకటించింది. దీని కోసం మార్చి 7 తేదీన బీజేఎల్పీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ నుంచి పర్యటన ప్రారంభిస్తామని బీజేపీ పక్ష నేత యేలేటి మహేశ్వర రెడ్డి ప్రకటించారు.అన్ని జిల్లాల్లో పర్యటించిన తరువాత అసెంబ్లీ సమావేశాలలో అవలంభించ వలసిన వ్యూహాన్...