Posts

Showing posts with the label congress party

నిజామాబాద్‌లో కిసాన్ న్యాయ్ సత్యాగ్రహం – కాంగ్రెస్ నేతల పిలుపు

Image
నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ కార్యక్రమం జరిగింది.ముఖ్య అతిథిగా పాల్గొన్న నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఊర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్ , రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీ సభ్యులు రామకృష్ణ , నగర మేయర్ ఉమారాణి , నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ , నూడా చైర్మన్ కేశ వేణు ,జిల్లా కాంగ్రెస్ పార్టీ కోశాధికారి భక్తవత్సలం , జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శరత్ , గాదారి గోపి జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గౌడ్ ,కార్పొరేటర్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పరిశీలకుడిగా మధు యాష్కీ గౌడ్ నియామకం

Image
హైదరాబాద్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడిగా పీసీసీ ప్రచారకమిటి చైర్మన్,నిజమా బాద్ మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ నియామకం అయ్యారు. ఆయనను AICC పరిశీలకుడిగా జాతీయ అధ్యక్షుడి ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్ నియమించారు. గతంలోనూ తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ వ్యవహారాలను మధు యాష్కీ గౌడ్ పర్యవేక్షించారు. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel

షబ్బీర్ భాయ్ కళ్ళు చెమ్మగిల్లిన వేళా...

Image
కామారెడ్డి, ముగ్గురు చిన్నారుల హత్య ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి గురైనారు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ. కామారెడ్డి పట్టణంలో జరిగిన హృదయ విదారక ఘటన అందరినీ కలచివేసింది. కన్నతండ్రే కాలయముడై అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులు షిఫత్, ఆయాత్, మరియం లను చెరువులో పడేసి హత్య చేసిన ఘటన పట్టణ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.  ఈ అమానుష ఘటన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీని తీవ్రంగా కలిచివేసింది. ఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే షబ్బీర్ అలీ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తన ముగ్గురు బిడ్డలను కోల్పోయి విలపిస్తున్న తల్లిని చూసి ఆయన కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఆమెను ఓదార్చుతూ ధైర్యం చెప్పే సమయంలో ఆయన కళ్లు చెమ్మగిల్లాయి. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఒక మనిషి ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తిస్తాడు? కన్నబిడ్డలను చంపుకోవడానికి మనసెలా ఒప్పింది? ఇది కేవలం ఒక కుటుంబానికి జరిగిన అన్యాయం కాదు, మానవత్వానికే తలవంపులు అని ఆవేదన వ్యక్తం చేశారు.  మన చుట్టుపక్కల ఎవరైనా ఆకలితో అలమటిస్తుంటే ,ఆర్థిక ఇబ్బందులు ఉంటే మనకు తోచినంత సహాయం చేస్తే ఇలాంట...

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

Image
(జమాల్పూర్ గణేష్, రాజేంద్ర బాబు) పీసీసీ చీ ఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రాంగం ఫలించింది. మజ్లీస్ పార్టీతో జతకట్టి మేయర్ పీఠాన్ని చేజిక్కించుకుంది.ఆ పీఠంపై అతి సాధారణ మహిళ కూరగాయల ఉమా రాణిని కూర్చోబెట్టింది కాంగ్రెస్ పార్టీ.నలభై ఏళ్లుగ మహేష్ కుమార్ గౌడ్ కు అత్యంత నమ్మిన బంటుగా కొనసాగుతూ వస్తున్న కసాబ్ గల్లీ కరాటే రమేష్ సతీమణిని అసాధారణ రాజకీయ సమీకరణాలు మేయర్ పదవికి  దరిచేర్చింది. మహేష్ కుమార్ గౌడ్ కు ఆత్మగా వ్యాపార దిగ్గజంగా ఉన్న కాటిపల్లి నరేందర్ రెడ్డి సతీమణి ని మేయర్ పీఠంపై కూర్చోబెట్టేందుకు పడరాని పాట్లు పడ్డారు.. అయితే ఆమె కార్పొరేటర్ గా గెలవలేక పోయింది.20 కోట్లు ఖర్చు చేసిన ఫలితం లేకపోవడంతో సాధారణ మహిళ కార్పొరేటర్లు ఉమారాణి,పంచ రెడ్డి లలిత, పూజిత గౌడ్ మేయర్ పదవి కోసం పోటీపడ్డారు.  NSUI,యూత్ కాంగ్రెస్ లో చురుకైన పాత్ర పోషించడంతో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పంచ రెడ్డి చరణ్ సతీమణి లలిత కు దాదాపుగా పదవి ఖాయం అయ్యిందని ప్రచారం జరిగింది.. వరుసగా మేయర్ పదవిని మూడు సార్లు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే అనుభవించడం లలిత అవకాశాలను నీరు గార్చింది.. ...

కాంగ్రెస్ లో బడా నేత ప్రతిష్టకు ముడుపుల మరక.

Image
జమాల్పూర్ గణేష్.... ✍︎ బడా నేత నిర్వాకం కాంగ్రెస్ లో కలవరం రేకెత్తిస్తోంది. పార్టీతో ఏమాత్రం సంబంధం లేని కాటిపల్లి నరేందర్ రెడ్డి సతీమణిని ప్రతిష్టాత్మక నిజామాబాద్ మేయర్ పీఠంపై కూర్చోపెట్టడానికి బడా నేత వేసిన స్కెచ్చు బెడిసి కొడుతుందనే భయం పార్టీ శ్రేణుల్లో కనపడుతోంది.. రాజకీయ సంకట స్థితికి దారితీస్తుందని ఆందోళన చెందుతున్నారు..10కోట్లు నజరానా తీసుకుని నరేందర్ రెడ్డి కి మేయర్ సీటును కట్టబెడుతున్నారని ఎంపీ అర్వింద్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ను కడిగి పారేశారు.దీనివల్ల బడా నేతకే కాకుండా పార్టీ ప్రతిష్ట మసక పారడం ఎన్నికల్లో ప్రభావం చూపే ప్రమాదం పొంచి ఉందని క్యాడర్ టెన్షన్ పడుతోంది.డబ్బు సంచులు చేతులు మారడం వల్లనే పార్టీకి సంబంధం లేని వ్యాపార దిగ్గజం తెర మీదికి వచ్చిందనే ప్రచారం క్షేత్ర స్థాయిలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనితో పార్టీ శ్రేణులు డిఫెన్స్ లో పడ్డాయి..అందుకే  బడా నేత నిర్ణయాన్ని బహిరంగంగా సమర్ధించనూ లేదు.. వ్యతిరేకుంచనూ లేదు నాయకత్వ గణం.. చివరకు పార్టీ జిల్లా నాయకత్వం కూడా పెదవి విప్పే సాహసం చేయ లేదు..కోట్లు తీసుకుని కాటిపల్లికి భరోసా ఇచ్చారని అర్వింద్ సోషల్...

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

Image
  ✍︎... జమాల్పూర్ గణేష్ :- కాంగ్రెసు పార్టీకి జవసత్వాలు పోస్తున్న క్యాడర్,లీడర్ల మనోభావాలను మందు పాతర పెట్టి ఖతం చేస్తున్న బడా నేత ఎవరనే చర్చ  చక్కర్లు కొడుతోంది.     కాసు బ్రహ్మానంద రెడ్డి జమానాలో అప్పటి ఆర్థిక మంత్రి అర్గుల్ రాజారాం నుంచి మొదలుకుని YS రాజశేఖర్ రెడ్డి హయాంలో డి. శ్రీనివాస్(DS) వరకు కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణంలో పార్టీ సీనియర్లకు రాజకీయ అవకాశాలు దక్కాయి. పార్టీలోనూ..రాజ్యాంగ బద్ధ పదవుల్లోనూ పార్టీకి పునాదిగా పనిచేయడం ద్వారా పైకి వచ్చిన వారికే అవకాశాలు దక్కాయి. ఇప్పుడా పరిస్థితి రివర్స్ అయింది.పార్టీ కోసం భుజాలు అరిగే దాకా జెండాలు మోసి..రాస్తారోఖో..రైల్ రోఖో.. బంద్ కరో బంద్ కరో అంటూ నోర్లు బొంగురు పోయే దాకా అరిచి నెత్తి నోరు కొట్టుకున్న నిఖార్సయిన ,నిజమైన కాంగ్రెస్ క్యాడర్ కు లాస్ట్ బెంచే దిక్కయ్యింది..   ఖరీదైన ఖద్దరు బట్టలేసుకుని తెలుగుదేశం ప్రభుత్వం హయాం లో మండవ వెంకటేశ్వర రావుతో రాసుకు పూసుకు తిరిగిండు..BRS ఏలుబడిలో అప్పటి మంత్రి ప్రశాంత్ రెడ్డి,కల్వకుంట్ల కవితతో చనువుగా ఉంటుండే..ఇప్పుడు PCC చీఫ్ మహేష్ తో పాటు సర్కార్ సలహదారులు సుదర్శన్ రెడ్డ...