Posts

Showing posts with the label Nizamabad politics

గల్ఫ్ కార్మికుల ఓట్లు తొలగిస్తే ఊరుకోం.. ఉమ్మడి నిజామాబాద్ నేతలతో KTR

Image
గల్ఫ్ కార్మికుల ఓట్లు తొలగిస్తే ఊరుకోం --ఉమ్మడి నిజామాబాద్ నేతలతో KTR ........ జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళిన తెలంగాణ బిడ్డల ఓటు హక్కును కాపాడేందుకు పార్టీ తరఫున ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. త్వరలో రాష్ట్రంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఓటర్ల ఓట్ల జాబితా సవరణ కోసం ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న SIR కార్యక్రమానికి సంబంధించిన విషయంలో లక్షలాది మంది తెలంగాణ ఎన్ఆర్ఐల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నదని కేటీఆర్ అన్నారు. ఈ విషయంలో గల్ఫ్ బాట పట్టిన తెలంగాణ బిడ్డల ఓటు హక్కులు తొలగించకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని పార్టీ తరఫున కలుస్తామని తెలిపారు. శుక్రవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నివాసంలో జరిగిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జీల సమావేశంలో సీనియర్ నేతలతో కూడిన సమీక్షా సమావేశంలో కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఇప్పటికే వందలాది మంది ఎన్ఆర్ఐలు తమ స్థానిక శాసన సభ్యులకు, మాజీ శాసన సభ్యులకు ఫోన్లు చేసి ఆందోళన చెందుతున్న విషయాన్ని కేటీఆర...

నిజామాబాద్‌లో సంజయ్ అనుచరుల ఫ్లెక్సీ వార్ – ‘జస్టిస్ ఫర్ DSR’ డిమాండ్

Image
నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఉదయం ‘జస్టిస్ ఫర్​ డి ఎస్ ఆర్ ’​ పేరుతో ఫ్లెక్సీలు నగరవ్యాప్తంగా ఎక్కడ చూసినా దర్శనమిచ్చాయి. నిజామాబాద్​ తొలి మేయర్​ ధర్మపురి సంజయ్​కి న్యాయం చేయాలంటూ పోస్టర్లు ఏర్పాటు చేశారు. మొన్నటివరకు జరిగిన అసెంబ్లీ, మున్సిపల్​ ఎన్నికల్లో పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడి పార్టీ అభ్యర్థుల గెలుపునకు మాజీ మేయర్​ ధర్మపురి సంజయ్​ కృషి చేశారని అయినా ఆయనకు పార్టీలో గుర్తింపు ఇవ్వట్లేదంటూ ఫ్లెక్సీల్లో రాసి ఉంది. ఒకప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు వైఎస్​తో కలిసి డీఎస్​ ఎంతో కృషి చేసినప్పటికీ ఆయన కుమారుడికి పార్టీలో ఎందుకు గుర్తింపు ఇవ్వట్లేదని ఫ్లెక్సీల్లో ఆయన అభిమానులు ప్రశ్నించారు. నిజామాబాద్​ యువత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరుల పేర్లతో కూడిన ఈ ఫ్లెక్సీల్లో డి.సంజయ్​ వెంటే తాము ఉంటాయని.. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోనే తాముంటాని పేర్కొన్నారు. అలాగే నగరంలోని ధర్నాచౌక్​ వద్ద ధర్మపురి సంజయ్​ అభిమానుల పేరుతో శనివారం ఉదయం నిరాహార దీక్ష సైతం చేపట్టారు. డీఎస్​కుసంజయ్​కి పదవి ఇచ్చి గౌరవించాలని వారు కోరారు. అయితే తాజాగా వెలిసిన ఫ్లెక్సీల అంశం న...

డీఎస్ సమాధి సాక్షిగా ఇచ్చిన మాట నిలబెట్టాలి – సంజయ్‌కు పదవి ఇవ్వాలని డిమాండ్

Image
మాజీ మంత్రి డీఎస్ తనయుడు, నిజామాబాద్ నగర తొలి మేయర్, మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులు ధర్మపురి సంజయ్​కు రాష్ట్ర ప్రభుత్వంలో ఆయనకు తగ్గ పదవి ఏదైనా రాష్ట్రవ్యాప్తంగా ఇవ్వాలని ఆయన అభిమానులు డిమాండ్​ చేశారు. జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్ లో ఆయన అభిమానులు శనివారం నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ కాంగ్రెస్​ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అభివృద్ధికి ఎనలేని కృషిచేస్తున్న డి.సంజయ్​కు గుర్తింపు ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ, మున్సిపల్​ ఎన్నికల్లో ఆయన అభ్యర్థుల గెలుపు కోసం ఎంతగానో సేవలు అందించారని వారు గుర్తు చేశారు. ఒక విధంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడంలో సంజయ్ పాత్ర కూడా ఉందంటంలో ఏమాత్రం అతిశయోక్తి కాదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు డిఎస్ మరణం తర్వాత ఆయన సమాధి వద్ద ఇచ్చిన ప్రమాణం నిలబెట్టుకోవాలన్నారు. ఆయన సేవలను గుర్తించి పదవి ఇవ్వాలని వారు కోరారు. ధర్మపురి సంజయ్ ఏ పార్టీలో ఉన్నా తాము ఆయన వెన్నంటే ఉంటామన్నారు. కార్యక్రమంలో సంజయ్ అభిమానులు కాంగ్రెస్ పార్టీ సీనియర...

ఏమి తక్కువ చేసాము? జీవన్ రెడ్డి ఆరోపణలపై మానాల మోహన్ రెడ్డి కౌంటర్

Image
📍 నిజామాబాద్: మాజీ మంత్రి జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పై చేసిన ఆరోపణలను రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మెన్ మానాల మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. జీవన్ రెడ్డి పార్టీని విడిచిపోతుండటం బాధాకరమని పేర్కొన్న ఆయన, స్వార్థ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేయడం సరికాదని విమర్శించారు. 👉 రాష్ట్రంలో రాక్షస పాలనకు తెరదింపిన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అని ఆయన కొనియాడారు. జీవన్ రెడ్డి తన వయసుకు, విజ్ఞతకు తగిన విధంగా మాట్లాడాలని సూచించారు. పార్టీ అధిష్టానం నిర్ణయాల మేరకే చేరికలు జరుగుతాయని స్పష్టం చేశారు. 💬 “మీ పోరాటం సీఎం పై కాకుండా ప్రజా సమస్యలపై ఉండాలి” అని మోహన్ రెడ్డి అన్నారు. వేం నరేందర్ రెడ్డి క్లిష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీకి విశేష సేవలు అందించారని, గత తొమ్మిదేళ్లుగా పార్టీ అభివృద్ధికి కృషి చేశారని గుర్తుచేశారు. జీవన్ రెడ్డి ప్రతి సారి ఓడిపోయినా కూడా పార్టీ ఆయనకు ప్రాధాన్యత ఇచ్చిందని మానాల మోహన్ రెడ్డి పేర్కొన్నారు. Follow Our WhatsApp Channel

ఆదానీకి అమ్మేసి సుద్దపూస మాటలా?

Image
ఎంపీ అరవింద్‌పై కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి విమర్శలు Nizamabad: జిల్లాకు గత పది సంవత్సరాల్లో ఏమి అభివృద్ధి సాధించారో చెప్పకుండా ఈనెల 21న “చలో కలెక్టరేట్” కార్యక్రమం చేపడుతున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి ఎంపీ Dharmapuri Arvind పై విమర్శలు గుప్పించారు. బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీ అరవింద్‌కు జిల్లా అభివృద్ధిపై, ముఖ్యంగా రైతాంగంపై ఎలాంటి శ్రద్ధ లేదని ఆరోపించారు. రైతుల పేరుతో రాజకీయాలు చేస్తున్నారే తప్ప అభివృద్ధిలో మాత్రం శూన్యం అని విమర్శించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేశామని చెప్పుకుంటున్నా, పసుపు రైతులకు కనీస మద్దతు ధర కూడా లభించడం లేదని, మార్కెట్ యార్డుల్లో రైతులు ధర పెంపు కోసం ఆందోళనలు చేస్తున్నప్పటికీ ఎంపీ స్పందించడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మొక్కజొన్నకు మద్దతు ధర ఇవ్వాలంటూ కలెక్టరేట్ ముట్టడి చేపడతామని చెప్పడం హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో పసుపు రైతుల గురించి పెద్ద ఎత్తున మాట్లాడిన అరవింద్ ఇప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టారని ప్రశ్నించారు. జిల్లాలో ఎప్పుడూ రాజకీయ...

గోపాల్ బాగ్ శివాలయంలో విగ్రహాల ధ్వంసం ఘటనపై ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా ఆగ్రహం

Image
ఇందూర్ (నిజామాబాద్) అర్బన్: నగరంలోని గోపాల్ బాగ్ ప్రాంతంలో ఉన్న పురాతన శివాలయంలో ఇటీవల జరిగిన విగ్రహాల ధ్వంసం ఘటనపై నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా హిందూ దేవాలయాలు, దేవతా విగ్రహాలపై జరుగుతున్న దాడులు హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆయన అన్నారు. హిందువులు ఇప్పటివరకు శాంతియుతంగా ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు కొనసాగితే పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని ఎమ్మెల్యే హెచ్చరించారు. “ఒక్కసారి కాషాయ దళం రెచ్చిపోతే జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది” అని ఆయన పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో పోలీసుల వైఫల్యం గోపాల్ బాగ్‌లోని పురాతన శివాలయంలో మూడు రోజుల క్రితం జరిగిన విగ్రహాల ధ్వంసం ఘటనపై ఇప్పటివరకు నిందితులను గుర్తించలేకపోవడం విచారకరమని ఎమ్మెల్యే విమర్శించారు. పోలీసులు ఇప్పటికీ ఎవరు చేశారు అనే విషయం కనుగొనలేకపోయామని చెప్పడం ఆశ్చర్యకరమని ఆయన అన్నారు. ఆలయ స్థలాలపై కబ్జాల ఆరోపణలు ఈ ప్రాంతంలో ఉన్న సుమారు 80 ఎకరాల శివాలయ భూమిపై కొందరు కబ్జాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే ఆరో...

అన్నదమ్ముల సవాల్ - ధర్మపురి బ్రదర్స్ వార్

Image
(జమాల్పూర్ గణేష్ మూల్పూర్ రాజేంద్ర బాబు) వాళ్లిద్దరూ రాజకీయ ఉద్దండి బిడ్డలు..వైరి పక్షాల్లో కీలక నేతలే వారు..మాట వారుసకైనా ఆ అన్నదమ్ముల మధ్య మాట్లాడుకోవడాలు లేదు.. గత కొంతకాలంగా వారిద్దరి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు బహిరంగ మయ్యింది.. వారెవరో కాదు.ఒకరు ఎంపీ ధర్మపురి ఆరవింద్.. మరొకరు నిజామాబాద్ నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్. మునిసిపల్ ఎన్నికల ముందు సంజయ్ యాక్టివ్ అయ్యారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మేయర్ ఎన్నికల కోసం అప్పటికే పార్టీ శిక్షణ లో ఉన్న సంజయ్ని హుటాహుటిన నిజామాబాద్ రప్పించారు. తనదైన స్టయిల్ లో సంజయ్ ఎన్నికల సమరంలో దిగారు.. అంతర్గత సమావేశాల్లో,ప్రెస్ మీట్స్ సైతం తమ్ముడు అర్వింద్ పేరు ప్రస్తావించకుండానే సుతి మెత్తగా మత రాజకీయాలతో లబ్ది కోసం తపించడం సరికాదని హిత బోధ చేశారు. నిజామాబాద్ సమగ్ర అభివృద్ధికి ఆటంకం అని వ్యాఖ్యానించారు. శనివారం నిర్వహించిన పీస్ ర్యాలీలోనూ అర్వింద్ పేరు తీసుకోకుండానే పరోక్ష ప్రస్తావనకే పరిమితం అయ్యారు సంజయ్.. కానీ ఆదివారంనాడు సంజయ్ నిర్వహించిన మున్నూరు కాపు కార్పొరేటర్లు,కౌన్సిలర్ల సన్మానానికి బీజేపీ ప్ర...