Posts

కాంగ్రెస్ జెండాకు ఎస్‌ఐ సెల్యూట్.. డీజీపీకి బీఆర్ఎస్ ఫిర్యాదు

Image
కాంగ్రెస్ జెండాకి SI షెల్యూట్ DGP కి BRS ఫిర్యాదు ....... నిజామాబాద్, జూన్ 29; రాజకీయాలకు అతీతంగా విధులు నిర్వహించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులను అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించే పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించిన కార్యక్రమానికి హాజరైన ఎస్‌ఐ మహేందర్ ఆ కాంగ్రెస్ జెండాకు సెల్యూట్ చేయడం తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు. రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన పోలీసు అధికారి ఒక రాజకీయ పార్టీ జెండాకు సెల్యూట్ చేయడం కాంగ్రెస్ పార్టీ పోలీస్ వ్యవస్థను వారికీ అనుకూలంగా మలచుకొని ఎంతగా నిర్వీర్యం చేసిందో స్పష్టం అయింది అన్నారు.ఇటువంటి చర్యలు పోలీసు వ్యవస్థ నిష్పాక్షికతపై ప్రజల్లో అనుమానాలు కలిగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన నాటి నుండి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులపై,ఇతరులపై అధికార పార్టీ ఆదేశాల మేరకు అక్రమ కేసులు పెడుతూ పోలీసులు వ్యవహరిస్తున్న తీ...

మైనార్టీ మహిళలకు అండగా ఉంటాం.. నిజామాబాద్‌లో 500 మందికి కుట్టు మిషన్ల పంపిణీ: షబ్బీర్ అలీ

Image
మైనార్టీ మహిళలకు అండగా ఉంటాం.. -- ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ నిజామాబాద్, జూన్30; నిజామాబాద్ పట్టణంలోని న్యాక్ సెంటర్‌లో మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో, తెలంగాణ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. స్వయం ఉపాధి ద్వారా మహిళలు తమ కుటుంబాలకు అండగా నిలిచి, గౌరవప్రదమైన జీవనం సాగించాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. నిజామాబాద్ జిల్లాలో రూ.1.02 కోట్ల వ్యయంతో మొత్తం 1,700 కుట్టు మిషన్లను పంపిణీ చేస్తున్నామని, అందులో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చెందిన 500 మంది మహిళలకు కుట్టు మిషన్లు అందించడం సంతోషకరమని తెలిపారు. ఈ పథకం ద్వారా అనేక కుటుంబాలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య...

సౌమ్య కేసులో సంచలన ట్విస్ట్..! గంజాయి స్మగ్లర్లను తప్పించారనే ఆరోపణలు.. లీకైన వీడియోలో కొత్త విషయాలు

Image
( జమాల్పూర్ గణేష్, మూల్పూరు రాజేంద్ర బాబు) ... గంజాయి స్మగ్లింగ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే ప్రయత్నంలో ఆబ్కారీ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందిన సంఘటనకు సంబంధించిన సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చే వీడియో మన నిజామాబాద్ చేతికి చిక్కింది.. జనవరిలో నిజామాబాద్ సమీపంలోని మాధవనగరం ప్రధాన రహదారి మీద గంజాయి స్మగ్లర్ లను పట్టుకునే ప్రయత్నంలో సౌమ్య మృతి చెందిన విషయం తెలిసిందే.. స్పాట్లో స్మగ్లర్లు ఉపయోగించిన కారు గుద్దిన సంఘటనలో ఆమె మృతి చెందింది.. ఆరు నెలల కిందట జరిగిన ఈ సంఘటనలో అసలు దోషులను తప్పించారనే ఆరోపణలు ఉన్నాయి.. నిర్మల్,నిజామాబాద్ కు చెందిన గంజాయి స్మగ్లర్లు ఆ రోజు స్పాట్ లో ఉన్నా.. కొందరిని ఆబ్కారీ అధికారులు తప్పించారని ఇద్దరు నిందితులు ఆక్రోశం వెళ్లగక్కిన వీడియో సౌమ్య కేసు వెనుక దాగివున్న డొల్లతనాన్ని బహిర్గతం చేసింది. ఆబ్కారీ SHO స్వప్న ఆఫీసు బ్యారక్ లో నిందితులు అధికారులతో వాదనకు దిగిన సందర్భంగా లేవనెత్తిన ప్రశ్నలు నిజామాబాద్ నిందితులను సౌమ్య కేసునుంచి తప్పించిన తీరును తేటతెల్లం చేస్తోంది.. నిందితుల్లో ఒకరు గాజు సీసాను పగులగొట్టి కొడుపును చీల్చుకునే ప్రయత్నం వల్ల నిందితు...

ఆబ్కారీలో అంతా అవినీతే..? అక్రమ బదిలీలు, ముడుపుల ఆరోపణలు.. ACB నజర్‌లో నిజామాబాద్ ఆబ్కారీ శాఖ!

Image
నిజామాబాద్ ఆబ్కారీ శాఖను అవినీతి జబ్బు పట్టుకుంది. చట్టాలను అమలు చేయాల్సిన అధికారులే పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయి అంచావతారులుగా మారారు.ఫలితమే సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కటకటాలు లెక్కపెడుతున్నారు.. జిల్లా వ్యాపితంగా ప్రాణాOతక రసాయనాలు క్లోరోఫామ్,డైజోఫామ్ తదితర రసాయనిక పదార్థాలను కలిపిన కల్తీ కల్లు ఏరులై పారుతోంది..లైసెన్సులు లేని కల్లుదుకాణాలు నడుస్తున్నా చర్యలు లేవు.బెల్టుషాపులు గల్లీ గల్లీల్లో వెలిసాయి. వైన్ షాపులు,బారు షాపుల్లో తెల్లవారు జామున మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.. అయినా ఆబ్కారీ శాఖ అధికారులు లంచాలకు మరిగి చర్యలు తీసుకోవడం లేదు..నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న మద్యం వ్యాపారానికి కొమ్ముకాయడం ద్వారా ప్రతినెలా కోటి రూపాయలు ముడుపులు అందుతున్నాయని అంచనా ఉంది.. వీటిని పంచుకోవడం లోనూ అవినీతి అధికారులు దర్జాగా వ్యవహరిస్తున్నారు. ప్రతినెలా సమీక్షల పేరిట ఏదో ఒక గెస్ట్ హౌస్ లో జరుపుకునే దావత్ లోనే.. అధికారుల పొజిషన్ లెక్కన కట్టిపెట్టిన నోట్ల ముల్లెలు చేతులు మారుతున్నాయని ఆబ్కారీ శాఖలోనే ప్రచారం జరుగుతోంది.మూటల పంపిణీలో నిజామాబాద్ కేంద్రంగా పనిచేస్తున...

వర్షపు నీటి ప్రతి బొట్టు అమూల్యం.. భూగర్భ జలాల పరిరక్షణకు ఇంకుడు గుంటలే పరిష్కారం: జిల్లా భూగర్భ జల శాఖ అధికారి

Image
కన్నీరు ఓ బావోద్వాగల సర్వజనాలకు అది మనిషి అయిన, జంతువైన, పక్షి అయిన శ్వాస నిశ్వాస గల ఏ ప్రాణి అయినా సరే.., ఇది ఓ ప్రక్రియ ఇదో ప్రాముఖ్యత గల అంశం దీనికి సమాంతరం ఏదో కాదు అని గత కొన్ని దశాబ్దాలుగా అనుకునేవాళ్లం కానీ ఇప్పుడు ఈ కన్నీటి చుక్కల కంటే కొన్ని బిలియన్, బ్రిలియన్ అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత అంశం ఏమిటో తెలుసా అది వర్షపు నీటి బొట్టు అదే మేఘావృతమై ఆకాశం నుంచి కురిచే వర్షం ఎన్నో మధురానుభూతుల్ని ఇస్తుంది. అలాగే నష్టానుసారాన్ని అనుసరిస్తుంది ప్రకృతిని ప్రేమిస్తే ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తారు. అది ప్రకృతి పగబడితే ద్వేషిస్తుంది. ఈ నీటి దార సాగునీరుకు అనే అంశాన్ని ముమ్మాటికి మరిచారు మూర్ఖపు ప్రజానికం. దీనికి ప్రత్యామ్నాయం ఇంటింటికి ఇంకు ఇంకుడు గుంటలే అంటున్నారు. భూగర్భ జల శాఖ అధికారులు.... ఇంతకీ ప్రజల ఆలోచనలు మార్పు రాకపోతే భవిష్యత్తు అధోగతే అంటున్నారు జిల్లా అధికారి బాబు గారు వారి మాటల్లోనే భూగర్భ జలాలపై భూమిలో ఇంకిపోతున్న నీటిపై మన నిజామాబాద్ తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడిన ఆయన మాటలు చూద్దాం మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అ...

తెలంగాణపై విద్వేషం చరిత్రను ఏమార్చే కుట్ర

Image
తెలంగాణ ఉనికిపై TDP వ్యాఖ్యలు.. చారిత్రక ఆధారాలతో తెలంగాణ వాదుల కౌంటర్ ఎప్పటిలాగే తెలంగాణ మీద విషం చిమ్మింది తెలుగుదేశం పార్టీ.TDP ఆవిర్భావ పండుగ వేళా ఆంధ్ర రాజధాని మంగళగిరి వేదికగా తెలంగాణను అవమానిస్తూ మాట్లాడారు పొలిట్బ్యూరో సభ్యుడు నర్సింహులు. తెలంగాణ ఉనికిని ప్రశ్నిస్తు డిక్షనరిలో తెలంగాణ లేనే లేదు అని అన్నారు. ఈ మాటలు నిమిషాల్లోనే సోషల్ మీడియాలో రాకెట్ స్పీడ్ లో వైరల్ అయ్యింది.తెలంగాణ వాదులు కౌంటర్లతో విరుచుకుపడ్డారు.. చరిత్రలో తెలంగాణ ఉనికికి సంబంధించిన సమాచారం మన నిజామాబాద్ పాఠకుల కోసం... *తెల్లాపూర్ శాసనం (క్రీ.శ. 1417). తెలంగాణ అనే పదం స్పష్టంగా చెక్కబడింది! *వెలిచర్ల శాసనం (క్రీ.శ. 1510) తెలంగాణ ముఖభూమి అని ప్రస్తావన ఉంది! * తిరుమల శాసనాల్లో శ్రీకృష్ణదేవరాయలు ‘తెలంగాణ దుర్గాలు’ జయించినట్లు రాయబడింది! *అమీర్ ఖుస్రో… క్రీ.శ. 1318లోనే “తిలంగి” అనే పదంతో తెలంగాణ భాషను ప్రస్తావించాడు! *పాల్కురికి సోమనాథుడు తన రచనల్లో తెలంగాణ నేల వైభవాన్ని పలికించాడు! * విద్యానాథుడి “ప్రతాపరుద్ర యశోభూషణం”లో… త్రిలింగ దేశ గౌరవం వెలుగొందింది! * అబుల్ ఫజల్ “అయి...

నక్సల్బరీ తొలి అమరులు మహిళలే..! చరిత్రలో నిలిచిన మే 25 ఘటన

Image
నక్సల్బరీ తొలి అమరులు మహిళలే..! (వ్యాసకర్త ;S A. డేవిడ్) ........ మే 25, 1967. మధ్యాహ్నం 2 గంటలు. నక్సల్బరీ సమీపంలోని బెంగాయ్ జోట్ గ్రామం. ధనేశ్వరి దేవి నాయకత్వంలో వందలాది మంది మహిళలు గుమిగూడి ఉన్నారు. స్ధానిక భూస్వామికి వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించడానికి మహిళలంతా గుమిగూడి వున్నారక్కడ. పరిస్థితి ఉద్రిక్తంగా వుంది. ఏ క్షణంతో ఏం జరుగుతోంది తెలియని స్థితి. అంతకు రెండు రోజుల నుండి ఆ ప్రాంతంలో స్థానిక రైతు కూలీలకూ,పోలీసులకూ మధ్య చెదురుమదుర సంఘటనలు జరుగుతూనే వున్నాయి. మే 24 వ తేదీన 'బిగుల్ కిషన్' అనే గిరిజన రైతు తాను సాగు చేసుకుంటున్న భూమిపై కోర్టు తీర్పు అతనికి అనుకూలంగా వచ్చింది. బిగుల్ కిసాన్ అప్పటికే సీపిఎం పార్టీ అనుబంధ రైతు సంఘమైన ’కృషక్ సభ‘లో సభ్యుడిగా ఉండేవాడు. ఆ సంవత్సరం మార్చిలో జరిగిన ఒక సమావేశంలో కృషక్ సభ కౌలు రైతులుగా వున్న వాళ్ళు తమ భూములను స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమైన తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని దృష్టిలో వుంచుకున్న కిషన్, తనకు అనుకూలంగా ఇచ్చిన కోర్టు తీర్పును చేతబట్టుకొని మే 21న కిసాన్ తన పంటను కోయడానికి వెళ్ళాడు. ఇదే అదునుగా భావించిన భూస్వామి ట...

PCC చీఫ్ పై ' బిగ్' కుట్ర -- మహేష్ ఇమేజ్ డ్యామేజ్

Image
(జమాల్పూర్ గణేష్, మూల్పూరు రాజేంద్ర బాబు)✍︎ తెలంగాణ కాంగ్రెస్ లో ఎదిగి వచ్చిన బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ మీద 'బిగ్' కుట్ర జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడి నేతృత్వంలో నడుస్తున్న ఒక టీవీ చానల్ లో శుక్రవారం అన్ని బులెటిన్లలో మహేష్ గౌడ్ ను విఫల పీసీసీ చీఫ్ గా నమ్మించడానికి వార్తలను వండి వార్చారు. 20 ఏళ్లుగా ఇలాంటి కుక్డ్ బులెటిన్స్ ఏ పీసీసీ అధ్యక్షుడి మీద..ఏ ఛానల్ లోనూ ప్రసారం కాకపోవడం విశేషం. తెలంగాణ రాజకీయాల్లో బీసీ రాజ్యాధికారం కాంక్ష ఇటీవలి కాలంలో తారా స్థాయికి చేరుకుంది. సమీప భవిష్యత్తులో వచ్చే ఏ ఎన్నికల్లో అయినా బీసీ లకు రాజకీయ ప్రాధాన్యం పెంచక తప్పని సరి పరిస్థితిని అన్ని పార్టీలు ఎదుర్కోబోతున్నాయి.. ఈ నేపథ్యంలో మహేష్ గౌడ్ ను రేవంత్ కొలువులో చేర్చి..అవసరమైతే బీసీ కోటలో డిప్యూటీ సీఎం పదవిని అప్పచెబుతారని ఇటీవలి కాలంలో బలమైన ప్రచారం జరుగుతోంది. మహేష్ స్థానంలో మరో బీసీ కి పీసీసీ పగ్గాలు అప్పచెబుతారని... ఇలా బీసీ సంతుష్ట వైఖరితో తెలంగాణలో సోషల్ ఇంజనీరింగ్ చేయాలని జనపథ్ 10 వర్గాలు ఆలోచిస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాల్లో వినబడుతోంది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా మహేష్ ...

64 ట్రాన్స్ ఫార్మర్లను ధ్వంసం చేసిన అంతర్జిల్లా దొంగల ముఠా అరెస్ట్.. 80 కిలోల కాపర్ కాయిల్స్ స్వాధీనం

Image
జిల్లాల్లో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను ధ్వంసం చేస్తూ, వాటిలోని రాగి (కాపర్) కాయిల్స్ ను అపహరిస్తున్న ఐదుగురు సభ్యుల అంతర్జిల్లా దొంగల మురాను రెంజల్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. లక్షల విలువైన 80 కిలోల కాపర్ కాయిల్స్, దొంగతనాలకు ఉపయోగించిన 3 మోటార్ సైకిళ్లు, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా వెనుక ఉన్న నలుగురు స్క్రాప్ (పాత ఇనుప సామాను) వ్యాపారులపై కూడా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి సాయి చైతన్య వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. గురువారం (మే 21) సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రెంజల్ సట్- ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో కలిసి సాటాపూర్ బైపాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో మూడు మోటార్ సైకిళ్లపై అనుమానాస్పదంగా వస్తున్న ఐదుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది వారిని వెంబడించి పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న గన్నీ బ్యాగును తనిఖీ చేయగా, అందులో భారీ మొత్తంలో ట్రాన్స్ ఫార్మర్ కాపర్ కాయిల్స్ లభ్యమయ్యాయి. ప...