Posts

Showing posts with the label shabbir ali

నిజామాబాద్‌లో అన్నా బాహు సాఠే విగ్రహావిష్కరణ.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ఘన స్వాగతం

Image
నిజామాబాద్ నగర పర్యటనకు ఆదివారం సాయంత్రం విచ్చేసిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. చంద్రశేఖర్ కాలనీలో నూతనంగా నెలకొల్పిన అన్నా బాహు సాఠే విగ్రహాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇంచార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. మంత్రి వెంట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, నగర మేయర్ ఉమారాణి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel

కామారెడ్డి కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామాలు – బండ్లు ఓడలు, ఓడలు బండ్లు?

Image
కాంగ్రెస్ లో బండ్లు ఓడలైతాయ్..ఓడలు బండ్లు ఐతాయ్ అనడంలో అతిశయోక్తి లేదు.. కాంగ్రెస్ లో ఏదైనా సాధ్యమే.. అచ్చం పచ్చి పులుసు అన్నట్లుగానే.. కామారెడ్డి కాంగ్రెస్ లో అలాంటి పరిణామాలే ఆసక్తికరంగా మారుతున్నాయి.. ప్రధాన స్రవంతి మీడియా ఈ పరిణామాలను పట్టించుకోకపోయినా... రాష్ట్ర రాజకీయా యవనికపై ప్రత్యేక పరిణామాలపై "మన నిజామాబాద్"అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది..ఎవ్వరినో తక్కువ చేయాలని..ఇంకెవరినో ఆకాశానికెత్తాలనే ఉద్దేశం కాదు. వివరాల్లోకి వెళితే..... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో ఉద్దండులైన మాజీ ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి,YS రాజశేఖర్ రెడ్డి లాంటి మహా మహులతో కలిసి పనిచేశారు ఆయన.. తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి PCC చీఫ్ గా నియా మకమైనపుడు సీనియర్లు రేవంత్ రెడ్డిని వ్యతిరేకించారు.. ఏ ఒక్క బడా నేత PCC చీఫ్ ను తమ జిల్లాలకు రమ్మనలేదు.. ఆ టైమ్ లో రేవంత్ రెడ్డిని మొదటిసారి తన ఇలాఖ కు వెంట పెట్టుకుని తీసికెళ్లారు ఆ ముఖ్యనేత... ఆయనెవరో కాదు ..ఉమ్మడి రాష్ట్రాలలో మోస్ట్ సీనియర్ బడా నేత షబ్బీర్ అలీ.. అంత వరకు బాగానే ఉంది. కానీ...రేవంత్ రె...

అభివృద్ధికి కేరాఫ్ కాంగ్రెస్ -దోమకొండలో షబ్బీర్ అలీ

Image
కామారెడ్డి , దోమకొండలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభలో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక గురించి షబ్బీర్ అలీ వివరంగా ప్రజలకు తెలియజేశారు. ఈ ప్రణాళిక ద్వారా గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ఆరోగ్య సేవల మెరుగుదల, రహదారుల నిర్మాణం వంటి పలు రంగాల్లో వేగంగా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. మండల అభివృద్ధిలో భాగంగా రూ.75 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు మరియు ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఈ పనులు పూర్తయితే దోమకొండలో మౌలిక వసతులు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు. గ్రామసభలో భాగంగా గ్రామస్తులు పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేయగా, కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, 99 రోజుల ప్రణాళిక ద్వారా ప్రతి గ్రామంలో అభివృద్ధి ఫలితాలు కనిపిస్తాయని అన్నారు. దోమకొండ మండల...

మహిళలను కోటీశ్వరులను చేస్తాం: కామారెడ్డిలో షబ్బీర్ అలీ హామీ

Image
📍 కామారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గంలోని బిక్నూర్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ అలీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మొత్తం రూ.52 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. 👉 డ్వాక్రా మహిళల కోసం రూ.10 లక్షలతో మహిళా భవనం నిర్మాణానికి, 👉 పిల్లల సంక్షేమం కోసం రూ.12 లక్షలతో అంగన్వాడి భవనం, 👉 గ్రామ అభివృద్ధి కోసం రూ.30 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 💬 ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సాధికారతపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలను ఆర్థికంగా బలపరచి కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని, సంక్షేమం మరియు అభివృద్ధి సమాంతరంగా కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి జనరల్ సెక్రటరీ ఇంద్రకరణ్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, మండల అధ్యక్షులు సుతారి రమేష్, భీమ్ రెడ్డి, అనంతరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, డీసీసీ ఉపాధ్యక్షులు గం...

ఆశా వర్కర్లకు పరిష్కారం లేకపోతే చలో అసెంబ్లీ

Image
కామారెడ్డి, ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 28న చలో అసెంబ్లీ నిర్వహిస్తామని అంగన్వాడీ లు సర్కార్ కు అల్టిమేటం ఇచ్చారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ నాయకత్వంలో వారు శుక్రవారం కామారెడ్డిలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కలిశారు. షబ్బీర్ అలీ ఆశా వర్కర్లతో సుమారు గంటకు పైగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా CITU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కే చంద్రశేఖర్ ముదం అరుణ్ లు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు కనీస వేతనం 18000 లు అమలు చేస్తామనిఇచ్చిన హామీ నెరవేరలేదన్నారు. పని భద్రత హామీ కూడా ఇప్పటికే అమలు కాలేదన్నారు.ఎన్నికల్లో మాతో పని చేయించుకుని పారితోషికం ఇవ్వలేదని వెంటనే వాటిని విడుదల చేయాలని అన్నారు .అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పెంచిన 1500 ల పారితోషికాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. 2021 జులై నుండి డిసెంబర్ వరకు ఆరు నెలల పిఆర్సి బకాయిల విడుదల చేయాలని అన్నారు. పి ఎఫ్ ఎస్ ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సమయం ఇచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సుదీర్ఘంగా మాట్లాడిన షబ్బీర్ ఆలీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర...

ప్రజల ముంగిట్లోకి అభివృద్ధి ఫలాలు - షబ్బీర్ అలీ వెల్లడి

Image
కామారెడ్డి , ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడంతో పాటు గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి కోసం “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” కింద 99 రోజుల కార్యచరణ ప్రణాళికను అమలు చేస్తోందని ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అవగాహన సదస్సులో షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, వివిధ విభాగాల జిల్లా అధికారులు, నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు ఈ సందర్భంగా ప్రభుత్వ 99 రోజుల కార్యచరణ ప్రణాళికపై ప్రజాప్రతినిధులకు, అధికారులకు విస్తృత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు ఈ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను తీసుకువచ్చిందని చెప్పారు. ప్రభుత్వ పథకాలు నిజంగా ప్రజలకు చేరాలంటే గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద...

జర్నలిస్టులకు పక్కాగా ఇండ్ల స్థలాలు.. Pcc చీఫ్ మహేష్,షబ్బీర్ అలీ

Image
తెలంగాణ వ్యాప్తంగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని pcc చీఫ్ మహేష్ కుమార్ గౌడ్,ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హామీ ఇచ్చారు. సోమవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేయించన తరువాత వారు మాట్లాడుతూ ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడుతామని మహేష్ కుమార్ గౌడ్,షబ్బీర్ అలీ చెప్పారు.ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారానికి సీఎం సానుకూలంగా ఉన్నారని వారు గుర్తు చేశారు. నిజామాబాద్ నగర జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కోసం ఇవ్వాళ సాయంత్రం కలెక్టర్ ను పిలిచి మాట్లాడుతామని వారు మాట ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పని చేసిన జర్నలిస్టులకు ప్రజా పాలనలో మేలు జరుగుతుందని చెప్పారు. వచ్చే ఐదేళ్లు సైతం కాంగ్రెస్ అధికారమని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. దీనిలో భాగంగానే నిజామాబాద్ లో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేశామన్నారు.380 కోట్లతో టెంపుల్ కారిడార్ నిర్మాణం చేపడుతున్నట్లు మహేష్ చెప్పారు. తన నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలను గుర్తించి నగర జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కోసం కృషి చేస్తా...

మాట ఇచ్చారు.. గూడునిచ్చారు! నాడు పాదయాత్రలో హామీ.. నేడు షబ్బీర్ అలీ గారి సమక్షంలో గృహప్రవేశం. 🏠❤️

మాట ఇచ్చారు.. గూడునిచ్చారు! నాడు పాదయాత్రలో హామీ.. నేడు షబ్బీర్ అలీ గారి సమక్షంలో గృహప్రవేశం. 🏠❤️ ​కళ్లలో కన్నీళ్లు.. కూలిపోతున్న గోడలు.. నాడు చిన్న మల్లారెడ్డిలో బిక్నూర్ లక్ష్మి, రాజమణి గారి దుస్థితిని చూసి చలించిపోయిన రేవంత్ అన్న, "నేనున్నాను" అని భరోసా ఇచ్చారు. అన్న చెప్పినట్టే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది.. పేదోడి ఇంటి కల నిజమైంది. ​నాడు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, నేడు ప్రభుత్వ సలహాదారులు శ్రీ మహమ్మద్ షబ్బీర్ అలీ గారి ఆధ్వర్యంలో వారి కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేయించడం మనందరికీ గర్వకారణం. పేదల ముఖంలో చిరునవ్వు చూడటమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం! ✋

మాట తప్పని ముఖ్యమంత్రి.. పేదవాడి ఇంటి కల సాకారం

Image
  రాజకీయాల్లో ఇచ్చిన మాట గాలికి కొట్టుకుపోయే కాలమిది. కానీ, తాను ఇచ్చిన హామీని ప్రాణం ఉన్నంతవరకు మర్చిపోనని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నిరూపించారు. మూడేళ్ల క్రితం ఒక సామాన్య పేద కుటుంబానికి ఇచ్చిన మాటను నెరవేరుస్తూ.. శనివారం కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి గ్రామంలో నూతన 'ఇంద్రమ్మ ఇల్లు' గృహప్రవేశం అత్యంత వైభవంగా జరిగింది.  రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు ఇంటి తాళాలు అప్పగించారు. 2023 మార్చి 18న పిసిసి అధ్యక్షుని హోదాలో పాదయాత్ర చేస్తున్న సమయంలో, భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయి నిరాశ్రయులైన బాధితులను రేవంత్ రెడ్డి పరామర్శించారు.  ఆ రోజు వారి కన్నీళ్లు చూసి చలించిపోయిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మీకు ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత నాది అని మాటిచ్చారు. నేడు ఆ మాట అక్షర సత్యమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఇది కేవలం ఒక ఇల్లు కాదు, ఇది రేవంత్ రెడ్డి నైతికతకు నిదర్శనం అన్నారు.  రాజకీయ నాయకులు ఎన్నికలప్పుడు ఎన్నో చెబుతారు, కానీ అధికారంలోకి వ...

కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ - బద్నాం షబ్బీర్ కు - KVR సేఫ్ సైడ్

Image
కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ బద్నాం షబ్బీర్ కు KVR సేఫ్ సైడ్ (జమాల్పూర్ గణేష్ ములుపురు రాజేంద్ర బాబు) కామారెడ్డి కాలేజీ భూముల వివాదంలో కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టారు MLA కాటిపల్లి వెంకట రమణ రెడ్డి.దూకుడు,దుందుడుకు స్వభావిగా ముద్ర పడిన రమణ రెడ్డి చాణక్య నీతితో తాపీగా బాల్ ను కాంగ్రెస్ గ్రౌండ్ లోకే తోసి తమాషా చూస్తున్నారు.. ఇక రమణ రెడ్డి మీద విమర్శలు,ఆరోపణలతో చీటికి మాటికి చికాకు కల్పిస్తున్న కాంగ్రెస్ పార్టీనే నిర్దిష్ట,రికార్డుల ప్రాతిపదికన తేల్చాల్సిన అనివార్య పరిస్థితుల్లోకి నెట్టివేయ బడింది. కాంగ్రెస్ పార్టీకి కామారెడ్డిలో పెద్ద దిక్కుగా ఉన్న రాజకీయ ప్రత్యర్థి షబ్బీర్ అలీ నోటికి తాళం వేసే వ్యూహంలో భాగంగానే రమణ రెడ్డి అనూహ్యంగా యూ టర్న్ తీసుకున్నారు. తన పైన కాలేజీ భూముల వ్యవహారంలో వస్తున్న విమర్శల నిగ్గు తేల్చాలని కలెక్టర్ను కలిసి లేఖ ఇవ్వడం సంచలనం అయ్యింది. ఇప్పుడు ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న కలెక్టరుకు కాలేజీ భూముల్లో  MLA ప్రమేయాన్ని గుర్తించడం,అక్రమాలను గుర్తించడం,దీనిలోనూ రమణ రెడ్డి జోక్యాన్ని నిర్దారించడం అనేది కత్తిమీద సామే. భూములను ఏయే సంస్థలకు ఎన్ని ఎకరాలు కేట...