Dilip Kumar,Encroachment,Government Lands,Nizamabad Municipal,nizamabad news,Sanitation,మున్సిపల్ జాగాలు,
గురువారం నగరంలోని నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ పలు డివిజన్లో ఆకస్మికంగా పర్యటించారు. డివిజన్ నంబర్ 41 డివిజన్ నంబర్ 12లో తనిఖీలు నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా శానిటేషన్ కార్యక్రమాలు తాగునీటి సరఫరాపై పరిశీలన చేశారు. అదేవిధంగా మున్సిపల్ ప్రభుత్వ భూముల రక్షణలో భాగంగా ప్రభుత్వ ఖాళీ స్థలాలను కూడా పరిశీలించారు. మున్సిపల్ ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా చూడాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై సంబంధిత అధికారులపై ఉందని ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ, డీ డీ ఈలు, ఏఈలు, శానిటేషన్ సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Click here to 👆 Follow Our WhatsApp Channel