Posts

Showing posts with the label nizamabad news

సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు సత్కారం.. ప్రశంసా పత్రాలు అందజేసిన జిల్లా యంత్రాంగం

Image
*సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు సత్కారం ............ నిజామాబాద్, మే 22 : వివిధ వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు చేరేలా సామాజిక మాధ్యమాల ద్వారా కృషి చేసిన సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రశంసా పత్రాలు బహూకరించి సత్కరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం జరిగిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి వేడుకలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ భూపతి రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నగర మేయర్ ఉమారాణి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ తదితరుల చేతుల మీదుగా సామాజిక మాధ్యమ కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్డు భద్రతా చర్యల గురించి విశేషంగా కృషి చేసిన దృష్ట్యా సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లను సత్కరించడం జరిగిందని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతి...

Information Commission, Nizamabad News, Right to Information, RTI Act, RTI Seminar, Telangana Government, సమాచార హక్కు చట్టం

Image
*సమాచార హక్కు చట్టంతో జవాబుదారీతనం* నిజామాబాద్, మే 15 : ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజలకు విశ్వాసాన్ని కల్పిస్తూ, పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడమే సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశ్యమని రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ డాక్టర్ జి.చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం సమాచార హక్కు చట్టం - 2005 పై పీఐఓలకు, ఏపీఐఓలకు, అన్ని శాఖల అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయగా, సమాచార కమిషనర్లు పీ.వీ.శ్రీనివాస్ రావు, దేశాల భూపాల్ లు హాజరయ్యారు. జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీఫ్ కమిషనర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో సమాచారం అందుబాటులో ఉంటేనే ప్రజలకు ఉపయోగమని, ప్రజలు కోరిన సమాచారాన్ని వారికి తెలియజేసే బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును సమాచార హక్కు చట్టం ద్వారా కల్పించబడిందని గుర్తు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలల...

Dilip Kumar,Encroachment,Government Lands,Nizamabad Municipal,nizamabad news,Sanitation,మున్సిపల్ జాగాలు,

Image
గురువారం నగరంలోని నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ పలు డివిజన్లో ఆకస్మికంగా పర్యటించారు. డివిజన్ నంబర్ 41 డివిజన్ నంబర్ 12లో తనిఖీలు నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా శానిటేషన్ కార్యక్రమాలు తాగునీటి సరఫరాపై పరిశీలన చేశారు. అదేవిధంగా మున్సిపల్ ప్రభుత్వ భూముల రక్షణలో భాగంగా ప్రభుత్వ ఖాళీ స్థలాలను కూడా పరిశీలించారు. మున్సిపల్ ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా చూడాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై సంబంధిత అధికారులపై ఉందని ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ, డీ డీ ఈ...

ట్రాన్స్ జెండర్ల బహిష్కరణ.. ఇందూరు గడ్డపై VDCల ఆగడాలు

Image
నగరంలోని కలెక్టరేట్​ ఎదుట ట్రాన్స్​జెండర్లు ధర్నాకు దిగారు. తమను గ్రామాల్లోకి రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రజావాణి లో అధికారులకు ఫిర్యాదు చేశారు. ట్రాన్స్​జెండర్స్ సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఓరుగంటి గంగ, జరీనా బేగం మాట్లాడుతూ.. గ్రామాల్లోకి ట్రాన్స్​జెండర్లు వీడీసీలు ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నాయని ఆరోపించారు. ఇటీవల సిరికొండ మండలం మైలారం గ్రామంలో చిన్న పిల్లల్ని అపహరిస్తున్నారంటూ భౌతికదారులకు దిగారన్నారు. అలాగే నందిపేట మండలం హుస్నాపూర్​లో హిజ్రాలను గ్రామపంచాయతీలో అక్రమంగా నిర్బంధించారని పేర్కొన్నారు. మోపాల్ మండలంలో హిజ్రాలు రావొద్దంటూ పోస్టర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్నారు. తమను పూర్తిగా సామాజిక బహిష్కరణ చేయడం ఎంతవరకు సబబని ట్రాన్స్​జెండర్లు ప్రశ్నించారు. ఎక్కడైనా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరిగితే వెళ్లి వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వారి జీవితం, వారి వ్యాపార లావాదేవాలు సుభిక్షంగా ఉండాలని తాము నిండు మనసుతో ఆశీర్వదిస్తామే తప్ప తమలో ఎలాంటి కల్మషం ఉండదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఇచ్చినంత తీసుకొని వస్తామని.. అలాంటి తమపై దుష్ప్రచారం చేయ...

మాక్లూర్ IKP కేంద్రంలో రైతుల అవస్థలు.. 20 రోజులైనా వడ్లు కొనని అధికారులు

Image
వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతుల గోస అంతా ఇంతా కాదు.. పండిన ప్రతీ గింజను కొంటున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటల డొల్లతనం బయట పడింది..20 రోజులుగా వడ్లు తెచ్చిన రైతులు IKP కొనుగోలు కేంద్రంలో నిరీక్షిస్తున్నా కొనే దిక్కు లేకుండా పోయింది. ఈ దుస్థిపై మన నిజామాబాద్ ప్రతినిధి ప్రీతం రెడ్డి నిర్వహించిన గ్రౌండ్ రిపోర్ట్ లో కండ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగు చూశాయి.. వివరాల్లోకి వెళితే... మాక్లూర్ ప్రాథమిక సహకార కేంద్రం ఇష్టారాజ్యంగా తయారయింది. వడ్ల కొనుగోలు సీజన్ కావడంతో రైతుల నుండి వడ్లను కొనుగోలు సెంటర్ల ద్వారా కొనుగోలు చేసి రైస్ మిల్లకు తరలించాల్సిన అధికారులు బాధ్యత మరిచి సంబంధిత మాక్లూర్ సొసైటీ కార్యదర్శి కార్యాలయంలో అందుబాటులో లేకపోవడం తో రైతులు తమ పండించిన ధాన్యాన్ని ఎవరికి విక్రయించాలో తెలియని అయోమయ పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. గంగారాం అనే రైతుతో పాటు 20 మంది తెచ్చిన వడ్లను కొనకుండా IKP సిబ్బంది సతాయిస్తున్నారు. ఇక చైర్మన్ సంగతి సరే ఆయన ఎప్పుడు వస్తాడు ..ఎప్పుడు వెళ్తాడో స్థానిక రైతులకే తెలియని పరిస్థితి ఏర్పడిందని రైతులు లబోదిబోమంటున్నారు. తాము వరి కోతలు కోసి 20 రోజులు కావస...

నిజామాబాద్ ప్రజలకు అలర్ట్: మొబైల్‌లో సైరన్ శబ్దం వస్తే భయపడొద్దు!

Image
నిజామాబాద్ జిల్లా ప్రజలకు గమనిక: మీ మొబైల్ ఫోన్ హఠాత్తుగా గట్టిగా సైరన్ శబ్దం చేస్తూ, వైబ్రేట్ అవుతుంటే ఆందోళన చెందకండి. ఇది ప్రభుత్వం నిర్వహిస్తున్న అత్యవసర హెచ్చరిక వ్యవస్థ (Emergency Alert System) పరీక్షలో భాగం., కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మరియు టెలికమ్యూనికేషన్ విభాగం సంయుక్తంగా ఈ మే 2న (శనివారం) దేశవ్యాప్తంగా ఈ అత్యాధునిక వ్యవస్థను అధికారికంగా ప్రారంభించనున్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహిస్తున్నారు. మీ ఫోన్లలో ఏం జరుగుతుంది? నిజామాబాద్‌లోని మొబైల్ వినియోగదారులకు ఈ రోజు ఒకటి కంటే ఎక్కువసార్లు అలర్ట్‌లు రావచ్చు: శబ్దం మరియు వైబ్రేషన్: మీ ఫోన్ సైలెంట్ లేదా "డూ నాట్ డిస్టర్బ్" మోడ్‌లో ఉన్నప్పటికీ, ఈ ప్రత్యేక హెచ్చరిక వచ్చినప్పుడు గట్టిగా శబ్దం వస్తుంది. సందేశం: స్క్రీన్‌పై తెలుగు, హిందీ లేదా ఇంగ్లీష్ భాషల్లో ఒక పాప్-అప్ నోటిఫికేషన్ కనిపిస్తుంది. అందులో “ఇది ఒక నమూనా పరీక్ష సందేశం (SAMPLE TESTING MESSAGE)” అని స్పష్టంగా రాసి ఉంటుంది. మనం ఏం చేయాలి?: ఈ సందేశాన్ని చూసిన తర్వాత కేవలం 'OK' బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుం...

50 కోట్ల భూమి.. 5 లక్షలకే.. -కాంగ్రెస్ కాయ్ రాజా కాయ్

Image
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ లేదు అనేది పాత సామెత. అభినవ రాజులు తలుచుకుంటే సర్కారు భూములు చిటికెలో చెర లోకి రావడమనేది కొత్త నానుడి. రాజకీయ పోకడతో రాజులుగా వర్ధిల్లుతున్న వారు అనుకున్నదే తడవుగా అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూమి అధికార కాంగ్రెస్ కు సొంతం అయ్యింది..1965 లో అప్పటి జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు మాధవరావు నేతృత్వంలో కొంచెం అటు ఇటుగా 3000 గజాలకు పైగా కాంగ్రెస్ పార్టీ సొంతం అయ్యింది. నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా కమర్షియల్ ప్రాపర్టీ అయ్యింది ఇప్పుడు..1980 లో దుకాణ సముదాయం నిర్మించారు. కాంగ్రెస్ పార్టీకి సొంతంగా జిల్లా ఆఫీసు...దాని నిర్వహణ ఖర్చులు పోను ఆదాయాన్ని సమకూర్చే కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది కాంగ్రెస్ పార్టీకి.. ఈ ప్రాపర్టీ విలువ కనీసం 40 కోట్ల పైమాటే.. ఇట్లా నగరం నడి బొడ్డులో సొంతంగా పార్టీ ఆఫీసు ఉన్నప్పటికీ.. ఇదే ఆఫీసు ఎదురుగా R&B స్థలంపై కాంగ్రెస్ పెద్దల కన్ను పడింది. గజం లక్షన్నర విలువ ఉన్న ఈ భూమి విలువ 50 నుంచి 60 కోట్లు ఉంది..4 లక్షల పైచిలుకు నామినల్ ధర చెల్లించి R&B శాఖకు చెందిన ఎకరం భూమిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి పొందింది. PCC చీఫ్ మహేష్ కుమార్ గ...

బస్ స్టాండ్ జాగా కాంగ్రెస్ ఖాతాలో..

Image
నిజామాబాద్ నగరంలో ప్రజల అవసరాల కోసం ప్రతిపాదించిన ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం కేటాయించడాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా ప్రయోజనాలను పూర్తిగా పక్కనబెట్టి కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం అత్యంత విలువైన ప్రభుత్వ భూమినీ దుర్వినియోగం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతికి నిదర్శనమని అన్నారు. రాజకీయ పార్టీల కార్యాలయాలకు భూమిని కేటాయించడానికి BRS పార్టీ వ్యతిరేకం కాదు కానీ నగరంలోనే కోట్ల రూపాయల విలువైన మరియు ఇదివరకే ప్రజల అవసరాల కోసం ప్రతిపాదించినటువంటి భూమిని అప్పనంగా కొట్టేయ్యడానికి మేము వ్యతిరేకమన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నప్పుడు నిజామాబాద్ నగరంలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, ఆధునిక సదుపాయాలతో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం కోసం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న R &B స్థలాన్ని గుర్తించి ప్రతిపదించామని ,అలాగే బస్టాండ్ నిర్మాణము కోసం 20 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగాయని తెలిపారు....

బీఆర్ఎస్‌ను వీడను.. బీజేపీలో చేరను: జీవన్ రెడ్డి క్లారిటీ

Image
తాను బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకి మారుతున్నానని కొన్ని వార్తా సంస్థల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. తాను జీవితంలో ఎప్పుడూ బీ ఆర్ఎస్ ను వీడను, బీజేపీతో సహా మరే పార్టీలో చేరను అని ఆయన స్పష్టం చేశారు. రాజకీయంగా తనను ఎదుర్కొనే దమ్ము లేను కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఒక పథకం ప్రకారం సాగిస్తున్న కుట్రలో భాగమే తనపై ఈ దుష్ప్రచారం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కంఠంలో ప్రాణమున్నంత వరకూ కేసీఆర్ బాట వీడనని, చివరి వరకు గులాబీ నీడలోనే రాజకీయాలు చేస్తానని ఆయన అన్నారు. తాను రాజకీయ ఓనమాలు దిద్దుకున్న పార్టీ బీఆర్ఎస్ అని, తన రాజకీయ గురువు, ఆరాధ్య దైవం కేసీఆర్ అని జీవన్ రెడ్డి తెలిపారు. తాను బీజేపీలో చేరడానికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీని ఢిల్లీలో కలిసినట్టు కట్టుకథలు ప్రచారం చేసురున్నారని ఆయన మండిపడ్డారు. నిజానికి తాను ఏ కేంద్ర మంత్రిని కలవలేదని, తాను హైదరాబాద్ లోనే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి పేక్ ప్రచారాలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంట...

ప్రజావాణి పేదలకు భారమా?.. కలెక్టరేట్ చేరాలంటే ₹100 ఖర్చు తప్పదా!

Image
ప్రజావాణి.. పేదవాడికి వెతలేనా? ₹100 ఖర్చు చేస్తే తప్ప కలెక్టరేట్ గడప తొక్కలేని దుస్థితి! "మన నిజామాబాద్" ప్రత్యేక కథనం: జిల్లా నలుమూలల నుంచి ఆశతో వస్తున్న అర్జీదారులకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. తెల్లవారుజామునే నిద్రలేచి, ఎక్కడో అప్పు తెచ్చిన వంద రూపాయలు ఆటోలకే పోస్తుంటే.. తీరని సమస్యల వేదన సామాన్యుడిని కుంగదీస్తోంది. నిరాశ పరుస్తున్న 'పేపర్' రాజకీయం: కలెక్టర్ గారిని కలిసి తమ గోడు చెప్పుకుందామని వస్తే, కేవలం ఒక కాగితం కింది స్థాయి అధికారికి ఇచ్చి వెనుతిరగాల్సి రావడం ఒక 'నగ్న సత్యం'. కొత్తగా వచ్చిన మీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలకు, క్షేత్రస్థాయి అధికారుల అలసత్వం వల్ల నిరాశే ఎదురవుతోంది. అధికారుల అలసత్వం - మీకో పాపం: కింద స్థాయి సిబ్బంది చేసే నిర్లక్ష్యం అంతిమంగా జిల్లా యంత్రాంగానికి చెడ్డపేరు తెస్తోంది. దయచేసి ప్రజావాణి అర్జీలను కేవలం కాగితాలుగా చూడకుండా, వారం వారం వాటిపై సమీక్ష నిర్వహించి ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కోరుతున్నాం. మా డిమాండ్ - ఉచిత ప్రయాణం: బస్టాండ్ నుండి కలెక్టరేట్ వరకు రావడానికి పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి,...

కుల గణన నివేదిక ఆధారంగా మాదిగలకు 10-11% రిజర్వేషన్లు ఇవ్వాలి : MRPS డిమాండ్

Image
© కుల గణన నివేదిక ప్రకారం మాదిగల జనాభా శాతానికి తగినట్టుగా 10 నుండి 11% రిజర్వేషన్లు కేటాయించాలి. © మంద కృష్ణ మాదిగ గారి మాటలు కుల గణన రిపోర్ట్ ద్వారా నిజమయ్యాయి. © ఆనాడు 9% రిజర్వేషన్ ను స్వాగతించిన వాళ్ళు జాతి ద్రోహులు. © అన్ని రకాల ప్రభుత్వ నియామకాల్లో 11% వాటా మాదిగలకు ఇవ్వాలి. © మహాత్మా ఫూలే ద్విశత జయంతి కమిటీలో మంద కృష్ణ మాదిగకు చోటు కల్పించినందుకు ప్రధానమంత్రికి కృతజ్ఞతలు. - ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ. వివరణ :- తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఉన్న ఏకైక కులం మాదిగలు మాత్రమే అని గత 12 సంవత్సరాలుగా మంద కృష్ణ మాదిగ చేస్తున్న ప్రకటన సత్యమని కుల గణన రిపోర్ట్ రుజువు చేసిందని, మా జనాభా 10% నుండి 11% ఉందని, ఎస్సీ వర్గీకరణలో కూడా మాకు అంతే వాటా కేటాయించాలని మంద కృష్ణ మాదిగ గతంలో లేవనెత్తిన ప్రశ్నలు సంపూర్ణ న్యాయమని కుల గణన రిపోర్ట్ తో స్పష్టం అయిందని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ అన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో MRPS ఆద్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కనక ప్రమోద్ మాదిగ మాట్లాడుతూ " తెలంగాణ రాష్ట్ర ప...

ఘనంగా గణేష్ గుప్త జన్మదిన వేడుకలు

Image
నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల జన్మదిన వేడుకలు నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని నగర BRS పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి బాణా సంచా కాల్చి గణేష్ బిగాల జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గణేష్ బిగాల జన్మదినం సందర్భంగా ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని ఎల్లమ్మ గుట్ట కమాన్ వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించి, ప్రయాణికులకు మరియు స్థానిక ప్రజలకు చల్లని తాగునీరు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే కోటగల్లి లో చింతకాయల రాజు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా నిజామాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో నాయకులు, డివిజన్ ఇంచార్జులు, కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ గణేష్ బిగాల గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ నగర అధ్యక్షులు సిర్ప రాజ...

తెలంగాణ ప్రజలపై విషం చిమ్మిన భాజపా ఎంపీ తేజస్వి సూర్య

Image
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జీర్ణించుకోలేని భాజపా బెంగుళూరు ఎంపీ తేజస్వి సూర్య విషం చిమ్మడం తెలంగాణ ఆస్తిత్వంపై దాడిగా నిజామాబాద్ భారాస లీగల్ సెల్ కన్వీనర్ దాదన్నగారి మధుసుధన్ రావు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాస్ట్రాన్ని విభజించడాన్ని దేశ విభజనతో పోల్చడం అతని అజ్ఞానానికి పరాకాష్టగా అభివర్ణించారు. కేసీఆర్ మలిదశ ఉద్యమంతో సకల జనులు కలిసి వచ్చిన చారిత్రాత్మక పోరాటాన్ని కించపరచడమేనని తెలిపారు. తెలంగాణ ప్రజలను అవమానించిన భాజపా ఎంపీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.ఆంధ్ర ఆధిపత్య శక్తుల తొత్తుగా మారిన తేజస్వి సూర్యను తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన పేర్కొన్నారు.తెలంగాణ ఆత్మగౌరవంపై, తెలంగాణ ఆస్తిత్వంపై భాజపా ఎంపీ విషపు గుళికలు విసిరి వేయడం సూర్యలో ఉన్న కపటత్వానికి నిదర్శనమని మధుసుధన్ రావు అన్నారు. సూర్య తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పి, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel

నిజామాబాద్‌లో అన్నా బాహు సాఠే విగ్రహావిష్కరణ.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ఘన స్వాగతం

Image
నిజామాబాద్ నగర పర్యటనకు ఆదివారం సాయంత్రం విచ్చేసిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. చంద్రశేఖర్ కాలనీలో నూతనంగా నెలకొల్పిన అన్నా బాహు సాఠే విగ్రహాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇంచార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. మంత్రి వెంట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, నగర మేయర్ ఉమారాణి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel

పెర్కిట్ మహిళా ప్రాంగణం ఘటనపై కలెక్టర్ సీరియస్.. బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశం

Image
పెర్కిట్, మహిళా ప్రాంగణంలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనను కలెక్టర్ ఇలా త్రిపాఠి తీవ్రంగా పరిగణిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ పి.ఇందిర శుక్రవారం సాయంత్రం కలెక్టర్ ను కలిసి జరిగిన సంఘటన గురించి తెలియజేశారు. గత మార్చి నెల 02 వ తేదీ నుండి 31వ తేదీ వరకు బ్యూటిషియన్ కోర్సులో బాలికలు, యువతులకు మహిళా ప్రాంగణంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ కోర్సులో శిక్షణ అందించిన తాత్కాలిక ఇన్ స్ట్రక్టర్ గా కొనసాగిన స్నేహ, బాలికలు, యువతుల ఫోటోలు, ఫోన్ నెంబర్లను సతీష్ అనే వ్యక్తికి పంపించిందని అన్నారు. దీంతో సతీష్ కొంతమంది యువతులకు ఫోన్ లు చేసి, వాట్సప్ చాటింగ్ ల ద్వారా వేధింపులకు గురి చేశాడని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. బాధిత యువతులు ఈ విషయాన్ని గురువారం రోజున తమ దృష్టికి తేగా, పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయించామని తెలిపారు. ఈ ఉదంతంపై కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. ఈ తరహా చర్యలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని, బాధ్యులైన వారిపై జిల్లా యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. పెర్కిట్ మహి...

ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు

Image
మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దుబ్బ లోని మున్నూరు కాపు కల్యాణ మండపంలో పూలే జయంతి వేడుక నిర్వహించారు. అంతకుముందు వినాయకనగర్ లోని మహాత్మ జ్యోతిబా పూలే విగ్రహానికి అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగర మేయర్ కే.ఉమారాణి, ఇంచార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, బీసీ సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలో నెలకొని ఉన్న రుగ్మతలను పారద్రోలేందుకు మహాత్మ జ్యోతిబాపూలే కొనసాగించిన కృషి అమోఘమని అన్నారు. అడుగడుగునా అవరోధాలు, అవమానాలు ఎదురైనప్పటికీ ఏమాత్రం చలించకుండా సాంఘిక దురాచారాలను దూరం చేసేందుకు పూలే ఎంతగానో శ్రమించారని గుర్తు చేశారు. అణగారిన వర్గాలు సమానత్వం సాధించాలంటే విద్య ఎంతో అవసరమని గుర్తించి వారికి విద్య అందేలా విశేషంగా కృషి చేశారని, మహిళల విద్య కోసం ప్రత్యేకంగా మొట్టమొదటి పాఠశాలను స్థాపింపజేశారని అన్నారు. ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ప్రభుత్వం బీ.సీ గురుకులాలకు జ...

కందకుర్తికి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రాక.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు

Image
నిజామాబాద్, ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ నెల 11న నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి పర్యటనకు హాజరు కానున్న నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా అధికారులతో కలిసి ఆయన పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. కందకుర్తిలో కొనసాగుతున్న తుది ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్, అధికారులకు సూచనలు చేశారు. మోహన్ భగవత్ పర్యటనలో భద్రతా పరంగా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బహిరంగ సభకు వచ్చే వారు వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు ఎంపిక చేసిన స్థలంలో ఏర్పాట్లు, సభా ప్రాంగణం, బారికేడ్లు తదితర వాటిని కలెక్టర్ పరిశీలించారు. ఆర్ ఎస్ ఎస్ చీఫ్ భద్రతకు పకడ్బందీ బందోబస్తును ఏర్పాటు చేయాలని, ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. సభా స్థలి వద్ద అన్ని వసతులతో కూడిన అంబులెన్స్, అగ్నిమాపక శకటం, వైద్య బృందం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఏసీపీ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రవణ్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. మ...

టైగర్ నరేంద్ర 12వ వర్ధంతి – బీజేపీ నేతల ఘన నివాళులు

Image
నిజామాబాద్, హిందుత్వమే ఊపిరిగా, కాషాయమే ప్రాణంగా, పాతబస్తీ అరాచక శక్తుల పాలిట సింహస్వప్నమైన మన తెలంగాణ ముద్దుబిడ్డ స్వర్గీయ టైగర్ నరేంద్ర.. అయోధ్య ఉద్యమంలో కరసేవకులకు నాయకత్వం వహించి లాఠీ దెబ్బలు తిన్న చరిత్ర . భారతీయ జనసంఘ్ ఇందూరు జిల్లా ప్రచారక్గా పని చేశారు. మహనీయులు ఎంతో మంది కార్యకర్తలను జాతీయవాదం కోసం, ఈదేశం కోసం, ధర్మం కోసం నిర్మాణం చేసిన టైగర్ అలె నరేంద్ర భాయ్ సాబ్ 12 వర్ధంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామి యాదవ్, ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధమల ఆనంద్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి పర్సని వెంకటేష్ గారితో కలిసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఒబిసి మోర్చా ఐటీ సెల్ కన్వీనర్ రాజ్ కుమార్ , కరుణ్ తోపాటు ఓబిసి మోర్చా నాయకులు పాల్గొన్నారు మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel

నిజామాబాద్‌లో కిసాన్ న్యాయ్ సత్యాగ్రహం – కాంగ్రెస్ నేతల పిలుపు

Image
నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ కార్యక్రమం జరిగింది.ముఖ్య అతిథిగా పాల్గొన్న నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఊర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్ , రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీ సభ్యులు రామకృష్ణ , నగర మేయర్ ఉమారాణి , నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ , నూడా చైర్మన్ కేశ వేణు ,జిల్లా కాంగ్రెస్ పార్టీ కోశాధికారి భక్తవత్సలం , జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శరత్ , గాదారి గోపి జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గౌడ్ ,కార్పొరేటర్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel

కల్తీ పెట్రోల్ టెస్ట్ పేపర్లు ఇవ్వరిక్కడ...

Image
మాయ చేసి మత్మరించడంలో ఘనాపాటీలు ఇందూరు పెట్రోల్ బంక్ యజమానులు.. పెట్రోల్ క్వాలిటీ నిర్దారణ కోసం వినియోగ దారులకు ఉన్న చట్టబద్ధమైన హక్కును బాజాప్తాగా కాలరాస్తున్నారు. ప్రతి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ నాణ్యత తాలూకు పరీక్ష కోసం వినియోగదారులకు ప్రీ పెట్రోల్ క్వాలిటీ టెస్టు పేపరును అందుబాటులో ఉంచాలి. ఈ విషయం వినియోగదారులకు తెలిసిన దాఖలాలు లేవు. ఒకరిద్దరు వినియోగదారులకు తెలిసి క్వాలిటీ టెస్టు పేపర్ అడిగినా ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు పెట్రోల్ బంక్ యజమానులు.. అచ్చంగా అలాంటి చేదు అనుభవం మన నిజామాబాద్ టీమ్ కు ఎదురైంది. నిజామాబాద్ నగరంలోని వంశీ హోటల్ ఎదురుగా ఉన్న ఇండియన్ ఆయిల్ బంక్ లో పెట్రోల్ టెస్టు పేపర్ అడిగితే తిక్క తిక్కగా వ్యవహరించారు . టెస్టు పేపర్ ఉండదని ఒకసారి.. వినియోగదారులకు ఇచ్చేది కాదని బుకాయించాడు బంక్ ఇంచార్జ్.టెస్ట్ పేపర్ అడిగితే వివ్వవల్సిందే అని DSO చెప్పారని అన్న వెంటనే.. అయితే DSO నే అడగండని తిక్క సమాధానం ఇచ్చారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం 1986 ప్రకారం టెస్టు పేపర్ ఇవ్వాల్సిందే అని మన నిజామాబాద్ పట్టుబట్టగా చేసేది ఏమిలేక అయిష్టంగా పేపర్ ను చేతిలో పెట్టారు ...