Posts

Showing posts with the label nizamabad news

నిజామాబాద్‌లో ఘనంగా బాబూ జగ్జీవన్ రాం 119వ జయంతి వేడుకలు

Image
నిజామాబాద్, భారత మాజీ ఉపప్రదాని డాక్టర్ బాబు జగ్జీవన్ రాం 119వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కంటేశ్వర్ కమాన్ వద్ద గల పాత అంబేడ్కర్ భవన్ లో నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో అర్బన్ శాసన సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగర మేయర్ కే.ఉమారాణి, రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్ తదితరులు బాబూ జగ్జీవన్ రాం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాత అంబేడ్కర్ భవన్ ఆవరణలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో పాల్గొని బాబు జగ్జీవన్ రాం చేసిన సేవలను కొనియాడారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, బాబూ జగ్జీవన్ రాం ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రత్యేకించి యువతరం, విద్యార్థుల్లో స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ భవిష్యత్తు కోసం, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు జగ్జీవన్ రాం అందించిన సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శమని అన్నారు. మహనీయుల గొప్...

భూగర్భానికి రీఛార్జ్... నెలకో మీటర్ లోతుకు జలమట్టాలు... ఆదా చెయ్యకపోతే అదొగతే...!

Image
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. తద్వారా భూగర్భ జలాలు ఆవిరి అధికమవుతున్నాయి. దీనికి తోడు లక్షలాది వ్యవసాయ బోరు బావులు పంటల నిమిత్తం నీటిని పొలాల్లోకి సాగునీరుగా వాడుకుంటున్నారు రైతులు. ఇక గృహ అవసరాల నిమిత్తం ఏర్పాటు చేసుకునే బోర్లు కోట్ల లీటర్ల నీటిని లాగేస్తున్నాయని భూగర్భ జల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ బాబు పేర్కొన్నారు. ప్రాజెక్టులు జలాశయాల్లోని నీటిని త్రాగునీటి కోసం సాగు అవసరాల కోసం వాడుతూనే ఉన్నాం అయితే వర్షాలు కురిసే శాతం తగ్గిపోవడంతో భూగర్భ రీఛార్జ్ కావడం లేదని, జలవినియోగంపై ఇంకుడు గుంటల కై వాటి ఏర్పాటు చేయడం వాటిపై దృష్టి సారించడం లేదన్నారు.దీంతో నెలకు మీటర్ లోతున నీరు ఖాళీ అవుతుంది ఈ మేరకు భవిష్యత్తులో త్రాగునీరు, సాగునీటి లభ్యత ప్రశ్నార్థకమవుతుంది. ఈ అంశంపై జిల్లా భూగర్భ జల శాఖ అధికారి శ్రీనివాస్ బాబు మన నిజామాబాద్ ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. వారు ఏమంటున్నారు వారి మాటల్లోనే విందాం.. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Cha...

కేసీఆర్ కార్యాలయంపై దాడికి మూల్యం తప్పదు

Image
నిజామాబాద్, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కేసీఆర్ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల భౌతిక దాడిన తీవ్రంగా ఖండిస్తున్నట్లు నిజామాబాద్ భారాస లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ దాదన్నగారి మధుసుధన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమ సారతి, తెలంగాణ రాష్ట్ర స్వాప్నికుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కార్యాలయం అని తెలిసి కుట్రపూరితంగా మూకుమ్మదిగా దాడి చేసి ఫర్నిచర్ ను ధ్వసం చేయడం క్షమించరాని నేరంగా ఆయన అభివర్ణించారు.భారాస నాయకులపైన కుట్రలు చేస్తూ దాడులు చేయడం కాంగ్రెస్ విషసంస్కృతిలో బాగమేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టే శక్తియుక్తులు భారాసకు ఉన్నాయని, భారాస శ్రేణుల బలం ముందు కాంగ్రెస్ పలాయనం కాకతప్పదని ఆయన హెచ్చరించారు. గజ్వేల్ తెలంగాణ రాష్ట్రం కోసం గజ్జెకట్టి కదిలిన చరిత్ర ఉన్నదని మరొకసారి గజ్జెకట్టి కదిలితే కాంగ్రెస్ కాలగర్భంలో కలిసి పోతుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ దాడులను , కాంగ్రెస్ ను అంధపాతాలానికి తొక్కివేసె బలం గజ్వేల్ ప్రజల సొంతమని, ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతే కొలమాణంగా భారాస కదిలి కాంగ్రెస్ ను కూకటి వేళ్ళతో పెకిలించి వేస్తుందని...

పకడ్బందీగా తెలంగాణ ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలి

Image
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఏప్రిల్, మీ 2026 విషయాలపై జిల్లా ఉన్నతాధికారులు సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టరేట్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. డి ఆర్ డి ఏ పి డి సాయ గౌడ్, డిఇఓ అశోక్ జిల్లా వివిధ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ ఏప్రిల్ 20 నుండి నిర్వహిస్తున్న ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఎలాంటి మాస్ కాపీయింగ్కు తావులేకుండా చూడాలని ఆదేశించారు. వాటికి అనుగుణంగా తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు అనంతరం డిఆర్డిఏ మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించే ఓపెన్ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పరిశీలకుడిగా మధు యాష్కీ గౌడ్ నియామకం

Image
హైదరాబాద్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడిగా పీసీసీ ప్రచారకమిటి చైర్మన్,నిజమా బాద్ మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ నియామకం అయ్యారు. ఆయనను AICC పరిశీలకుడిగా జాతీయ అధ్యక్షుడి ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్ నియమించారు. గతంలోనూ తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ వ్యవహారాలను మధు యాష్కీ గౌడ్ పర్యవేక్షించారు. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel

కలెక్టరేట్‌లో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

Image
నిజామాబాద్, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లోని ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి, దొడ్డి కొమురయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, దొడ్డి కొమురయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రభావశీలిగా నిలిచారని కొనియాడారు. ఆనాటి దేశముఖ్ ల అసంబద్ధ పాలనకు వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహసాలతో పోరాటం జరిపారని గుర్తు చేశారు. కొమురయ్య పోరాట స్ఫూర్తితో తెలంగాణాలో అనేక ప్రజాస్వామిక ఉద్యమాలు జరిగాయని, ఈ ఉద్యమాలకు దొడ్డి కొమురయ్య పోరు పటిమ ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. మహనీయుల కృషిని స్మరించుకునేందుకు, నేటి తరం వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలనే ఆకాంక్షతో ప్రభుత్వం మహనీయుల జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందని అన్నారు. మహనీయులు చూపిన బాటలో నడుస్తూ, అణగారిన వర్గాల అభ్యున...

హనుమాన్ శోభా యాత్రలో బిగాల గణేష్ సేవ..

Image
📍 నిజామాబాద్, హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా నిజామాబాద్ నగరంలో భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించిన శోభాయాత్రలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమాన్ స్వామి విగ్రహ రథం వద్ద గణేష్ బిగాల పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు. నగరం మొత్తం భక్తి పారవశ్యంతో నిండిపోగా, “జై శ్రీరాం”, “జై హనుమాన్” నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణం అలరించింది. అనంతరం నిజామాబాద్ అర్బన్ BRS పార్టీ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ, పండ్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులతో ఆప్యాయంగా మమేకమై, వారికి అభివాదం చేస్తూ శోభాయాత్రలో కలిసి నడిచారు.ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ హనుమాన్ స్వామి భక్తి, బలం, ధైర్యానికి ప్రతీక అని, స్వామివారి కృపతో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ప్రతి ఇంటిలో ఆనందం, ఐశ్వర్యం నిండాలని ప్రార్థించారు. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel

పల్లె ప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలి-కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపు

Image
నిజామాబాద్, పల్లెలు, పట్టణాల సర్వతోముఖాభివృద్ది కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలలో అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే సత్వర ప్రగతి సాధ్యమవుతుందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం మోస్రా మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్ పాల్గొన్నారు. జయ జయహే తెలంగాణ రాష్ట్ర గేయంతో గ్రామసభకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. తమ సమస్యలను ప్రజలు రాతపూర్వకంగా తెలియజేసేందుకు వీలుగా గ్రామ సభ వేదిక వద్ద ఫిర్యాదుల బాక్సును అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మునుముందు అమలు చేయనున్న పథకాల గురించి ప్రజలకు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రగతి, సంక్షేమంలో వారిని భాగస్వామ్యం చేయాలన్న సంకల...

VDC ఆగడాలకు అడ్డుకట్ట.. దళితులు రాజీపడొద్దు: ఎస్సీ-ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్య

Image
నిజామాబాద్ జిల్లాలో గ్రామ అభివృద్ధి కమిటీ లు ఆయా గ్రామాల్లో విధించే సాంఘిక బహిష్కరణలకు అడ్డుకట్ట వేస్తామని, ఇందులో దళితులు రాజీ పడాల్సిన అవసరం లేదని, దీనికై త్వరలోనే మరిన్ని కఠినమైన చట్టాల అమలుకు శ్రీకారం చుడతామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్య ఉద్గటించారు. బుధవారం జిల్లా కేంద్రానికి తన వ్యక్తిగత పనులపై వచ్చిన చైర్మన్ మన నిజామాబాద్ ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయా జిల్లాలో కలెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులు నివేదికల సహకారంతో జూన్ మాసంలో డీజీపీ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. దీని ద్వారా దళిత గిరిజనులకు దేవాలయాల ప్రవేశ నిషేధం, పరువు హత్యలు, లాంటివి జరగకుండా ఉండేందుకు ఈ సమావేశం నిర్వహించ తలపెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. రోస్టర్ పాయింట్ల లో ఉన్న లోపాల గుర్తింపు వాటి సవరణలు లాంటి అనేక అంశాల్లో ఉన్న సంస్కరణలతో మన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ న్ని దేశానికి రోల్ మోడల్ గా నిలబెడతానని ఆయన అభిప్రాయపడ్డారు ఈ మేరకు ఇప్పటికే ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ చైర్మన్లు సభ్యులతో చర్చలు సంప్రదింపులు జరిపామన్నారు. న్యాయశా...

వీర హనుమాన్ విజయాత్ర రూట్ మ్యాప్ పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

Image
విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 2వ తేదీన జరిగే వీర హనుమాన్ విజయ యాత్ర రూట్ మ్యాప్ ను మంగళవారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ పరిశీలించారు. స్థానిక కోడూరు హనుమాన్ ఆలయం నుండి విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ సభ్యులతో కలిసి పెద్ద బజార్,నిజాంసాగర్ చౌరస్తా, జీవధాన్ రోడ్డు, జన్మభూమి రోడ్డు, కొత్త బస్టాండ్, పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్, ధర్మశాల, సుభాష్ రోడ్డు, పాంచ్రస్తా హరిజనవాడ, రూట్ లో సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఏఎస్పీ, సిఐ, విద్యుత్తు, మున్సిపల్, ఆర్ అండ్ బి తదితర అధికారులు విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరుపబడే వీర హనుమాన్ విజయాత్ర ఆహ్వాన పత్రికను మంగళవారం స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి కి, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర,ఎఎస్పీ చైతన్య రెడ్డి లకు అందచేశారు. విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఆధార నిత్యానందం,కార్యదర్శి బొల్లి రాజు, ప్రచార ప్రముఖ్ శ్రీకాంత్ రావు, బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ వివేకానంద అశోక్, ఏకేష్, కార్యకర్తలు పాల్గొన్నారు. ...

మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం.. సమిష్టి కృషికి కలెక్టర్, సీపీ పిలుపు

Image
నిజామాబాద్, మాదకద్రవ్యాల నిరోధానికి సమిష్టి కృషి జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్, సీపీ వెల్లడి మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగంపై గట్టి నిఘా కొనసాగించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లా స్థాయి సమావేశం జరిగింది. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టిన చర్యలపై చర్చించి, వాటి నిరోధానికి అవలంభించాల్సిన చర్యలపై అధికారులకు కలెక్టర్, సీపీ దిశానిర్దేశం చేశారు. గడిచిన రెండు మాసాలలో జిల్లాలో ఎక్సైజ్, పోలీస్ శాఖల అధ్వర్యంలో నిర్వహించిన దాడులు, పట్టుబడిన గంజాయి, అల్ఫ్రాజోలం ఇతర మత్తు పదార్థాలు, నమోదైన కేసుల గురించి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యువతను, విద్యార్థులను మత్తుకు బానిసలుగా మారుస్తున్న మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. పోలీస్, ఎక్సైజ్, రవాణా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో కమిటీగా ఏర్పడి పక్కాగా కృషి చేయాలన్నారు. ...

గోదావరి పుష్కరాల ఏర్పాట్లు వేగవంతం.. కందకుర్తి ఘాట్‌ను కలెక్టర్ పరిశీలన

Image
నిజామాబాద్, వచ్చే ఏడాది జూలైలో అట్టహాసంగా జరుగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ఏర్పాట్లను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. రెంజల్ మండలంలోని కందకుర్తి పుష్కర ఘాట్ ను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. పక్షం రోజుల క్రితం కూడా ఈ పుష్కర ఘాట్ ను సందర్శించిన సమయంలో అధికారులకు పురమాయించిన పనులను వారు ఏమేరకు చేపట్టారు అని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. పుష్కర ఘాట్ కు వచ్చే మార్గాలలో రహదారుల మరమ్మతులు, విస్తరణ పనులను, శివాలయం వద్ద కొనసాగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్దంగా పనులు చేపట్టాలని అన్నారు. పుష్కరాల సమయంలోనే కాకుండా ఈ ప్రదేశానికి సాధారణ సమయాలలోనూ భక్తులు తరలివస్తారని, వారి సౌకర్యార్ధం పరిసరాల పరిశుభ్రతతో పాటు భక్తులకు కనీస వసతులు అందుబాటులో ఉండేలా చొరవ చూపాలన్నారు. గోదావరి పుష్కరాలకు త్రివేణి సంగమ ప్రాంతం అయినందున ఈ ఘాట్ వద్ద పుణ్య స్నానాల కోసం ప్రముఖులతో పాటు, లక్షలాదిగా భక్తులు పుణ్య స్నానాలకు తరలివచ్చే అవకాశాలు ఉన్నందు...

కలెక్టరేట్‌లో ఉచిత అంబలి పంపిణీ ప్రారంభం.. ఉద్యోగులకు ఉపశమనం

Image
📍 నిజామాబాద్, కలెక్టరేట్ లో ఉచిత అంబలి పంపిణీని ప్రారంభించిన కలెక్టర్ తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీఓ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ఏర్పాటు చేసిన ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ప్రారంభించారు. వేసవి సీజన్ ను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులకు ఉపశమనం కల్పించేందుకు వీలుగా తాగునీటితో పాటు ఉచితంగా అంబలి పంపిణీకి చొరవ చూపడం అభినందనీయమని టీఎన్జీఓ సంఘాన్ని అభినందించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీఓ ప్రతినిధులు కృషి చేస్తూ, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయం అని అన్నారు. కలెక్టరేట్ ఉద్యోగులతో పాటు వివిధ పనుల కోసం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయానికి వచ్చే వారికి ప్రస్తుత వేసవిలో అంబలి కేంద్రం ఉపశమనాన్ని అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు సుమన్, కార్యదర్శి శేఖర్, రాష్ట్ర నాయకుడు గైని గంగారాం తదితరులు పాల్గొన్నారు. Follow Our WhatsApp Channel

నిజామాబాద్‌లో LPG, పెట్రోల్, డీజిల్ సరఫరాలు సాధారణం.. ప్రజలు ఆందోళన చెందొద్దు - జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి

Image
* ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో LPG, పెట్రోల్ మరియు డీజిల్ సరఫరాలపై సమీక్ష నిర్వహించబడింది. 👉 ప్రస్తుత పరిస్థితి: * జిల్లాలో సరఫరాలు సాధారణంగా కొనసాగుతున్నాయి * ఎటువంటి కొరత లేదు * సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయి ⚠️ అయితే జాగ్రత్త చర్యలు తీసుకోవాలి *అన్ని డిస్ట్రిబ్యూటర్లు / అధికారులు తప్పనిసరిగా పాటించవలసిన సూచనలు: * LPG సిలిండర్లకు తగిన నిల్వలు (7–10 రోజులు) ఉంచాలి * బుకింగ్ మరియు డెలివరీలో విలంబం లేకుండా చూడాలి * గృహ వినియోగ గ్యాస్‌ను వాణిజ్య వినియోగానికి మళ్లించరాదు * స్టాక్ వివరాలు స్పష్టంగా ప్రదర్శించాలి * ప్రతి రోజు స్టాక్ & సరఫరా నివేదికలు సమర్పించాలి పెట్రోల్ & డీజిల్: * అన్ని బంకుల్లో స్టాక్ అందుబాటులో ఉండాలి * ఎటువంటి స్టాక్ అవుట్ పరిస్థితి రాకుండా చూడాలి * ధరలు మరియు స్టాక్ వివరాలు ప్రదర్శించాలి ఎన్‌ఫోర్స్‌మెంట్: * అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ పై కఠిన చర్యలు * అవసరమైతే రైడ్లు నిర్వహించాలి ప్రజలకు విజ్ఞప్తి: * అవసరానికి మించి నిల్వలు చేయవద్దు * గ్యాస్ / ఇంధన కొరతపై భయపడవద్దు 👉 జిల్లా ...

మానవత్వం మంట కలిసిన వేళా.. - పంచరెడ్డి కుటుంబానికి పలకరింపేది?

Image
వారిద్దరూ ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత.. మరొకరు కార్పొరేటర్ పంచర్ రెడ్డి సురేష్. అది కవిత బీఆర్ఎస్ లో ఉన్నప్పటి పరిస్థితి... గతంలోకి ఒకసారి వెళ్తే కవిత నిజామాబాద్ అప్పట్లో వచ్చిందంటే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల నుండి మంత్రులు, నామినేటెడ్ పోస్టులు ఉన్నవారు, చివరికి కార్పొరేటర్లు సైతం ఆమె వెనకే ఉంటూ ఆమె మెప్పుకోసం ప్రయత్నించేవారు ఇది గతం.... అంటే కల్వకుంట్ల కవిత తీహార్ జైలులో ఉన్న సమయంలో... కానీ ఇప్పుడు మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పంచర్ రెడ్డి సురేష్ సతీమణి అనిత, పార్టీ బిజెపి కల్వకుంట్ల కవిత కు బద్ధ శత్రువు అయిన పార్టీ.. అయినప్పటికీ మానవత్వంతో సురేష్ ఇటీవల మృతి చెందారని ఆయన కుటుంబాన్ని ఓదార్చడానికి ఆమె ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అయితే గత మున్సిపల్ ఎన్నికల సమయంలో బిజెపి పార్టీలో చేరారు పంచర్ రెడ్డి సురేష్ అనిత, ఆ తర్వాత ఆమె కార్పొరేటర్ గా కూడా గెలిచి విజయం సాధించారు. ఆమె విజయం సాధించిన కొద్ది నెలల్లోని ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. పంచ రెడ్డి సురేష్ గుండెపోటుతో మరనించారు. దీంతో వారి కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. అ...

ఏప్రిల్ 25న కొత్త రాజకీయ పార్టీ ప్రకటన: కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన

Image
నిజామాబాద్, ఏప్రిల్ 25న రాజకీయ పార్టీ ప్రకటిస్తామని తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రకటించారు. శుక్రవారం నిజామాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో అనేక విషయాలను వెల్లడించారు.. కవిత మాటల్లోనే.. *రాజకీయ పార్టీగా మారబోతోంది తెలంగాణ జాగృతి. *ఏప్రిల్ 25న మునీరాబాద్ వేదికగా పార్టీ జెండా, అజెండాను ప్రకటిస్తాం. *తెలంగాణ భవిష్యత్ మార్చే దారి దీపం కాబోతున్నాం. *సర్వోదయ తెలంగాణ కావాలన్నదే మా లక్ష్యం. ఆ లక్ష్యం కోసం పనిచేస్తాం. *మేము పెట్టబోయే పార్టీ తెలంగాణ ఇంటి పార్టీ. మా ఫోకస్ మొత్తం తెలంగాణ కోసమే. *మేము ఎవరికీ బీ టీమ్ కాదు. తెలంగాణలో మాదే నంబర్ వన్ పార్టీ అవుతుంది. *మహిళలు, యువత, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు మేధావులంతా పార్టీ ఆవిర్భావ సభకు రావాలని విజ్ఞప్తి చేస్తున్. *ప్రజాభిప్రాయం తీసుకొని పాలనలో వైఫల్యాలను రాముల వారు సరిచేసుకున్నార. *రాముల వారు స్ఫూర్తితో మా పార్టీని నడిపిస్తాం. *రాజకీయ పార్టీకి ఈగో ఉండకూడదు. నన్ను విమర్శించిన వాళ్లైనా సరే తెలంగాణ సోయి ఉంటే మాతో కలిసి రండి. *మా అజెండా మొత్తం కూడా ప్రాక్టికల్ గా, ప్రజల ఆమోదం పొందేలా ఉంటుంది. *ఏదైనా ప...

హనుమాన్ ర్యాలీకి లక్షకు పైగా భక్తులు.. VHP భారీ ఏర్పాట్లు

Image
📍 నిజామాబాద్, ఏప్రిల్ 2న జరగనున్న హనుమాన్ ధరణి ర్యాలీని విజయవంతం చేయాలని విశ్వహిందూ పరిషత్ (VHP) నాయకులు పిలుపునిచ్చారు. గురువారం ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో, ఈసారి లక్షకు పైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. 👉 ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా హనుమాన్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గత సంవత్సరం కూడా లక్షకు పైగా భక్తులు పాల్గొన్నారని, ఈసారి మరింత భారీగా స్పందన ఉండే అవకాశం ఉందన్నారు. 💬 ఈ ర్యాలీ విజయవంతం కావడానికి ప్రజలతో పాటు పోలీసు శాఖ, మున్సిపల్ అధికారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 👉 నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ హిందూ విభాగం కార్యదర్శి కృష్ణాజీ దినేష్ ఠాగూర్, విహెచ్పి జిల్లా అధ్యక్షులు, హిందూ వాహిని జిల్లా అధ్యక్షులు దాసరి సాయి ప్రసాద్, దాత్రిక రమేష్, శేఖర్, నికేష్ తదితరులు పాల్గొన్నారు. 👉 మీరు ఈ ర్యాలీలో పాల్గొంటారా? కామెంట్ చేయండి 💬 👉 మరిన్ని తాజా వార్తల కోసం Mana Nizamabad ను ఫాలో అవ్వండి 🔔 Follo...

మహిళలను కోటీశ్వరులను చేస్తాం: కామారెడ్డిలో షబ్బీర్ అలీ హామీ

Image
📍 కామారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గంలోని బిక్నూర్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ అలీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మొత్తం రూ.52 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. 👉 డ్వాక్రా మహిళల కోసం రూ.10 లక్షలతో మహిళా భవనం నిర్మాణానికి, 👉 పిల్లల సంక్షేమం కోసం రూ.12 లక్షలతో అంగన్వాడి భవనం, 👉 గ్రామ అభివృద్ధి కోసం రూ.30 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 💬 ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సాధికారతపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలను ఆర్థికంగా బలపరచి కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని, సంక్షేమం మరియు అభివృద్ధి సమాంతరంగా కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి జనరల్ సెక్రటరీ ఇంద్రకరణ్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, మండల అధ్యక్షులు సుతారి రమేష్, భీమ్ రెడ్డి, అనంతరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, డీసీసీ ఉపాధ్యక్షులు గం...

బీసీ డిక్లరేషన్ అమలు కోసం BRS ఎమ్మెల్యేల నిరసన.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు

Image
📍 హైదరాబాద్: బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కామారెడ్డి డిక్లరేషన్, ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. 👉 కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని ఎమ్మెల్యేలు ఆరోపించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీని తక్షణమే అమలు చేయాలని కోరారు. 💬 రాష్ట్రంలోని బీసీ కార్పొరేషన్లకు వెంటనే నిధులు విడుదల చేసి ఆదుకోవాలని సూచించారు. గొల్ల, కురుమల జీవనోపాధిని దెబ్బతీయొద్దని, రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం బీసీ సబ్ ప్లాన్‌ను అమలు చేయాలని, ముదిరాజ్, గంగపుత్రులను ఆదుకోవాలని కోరారు. 🎣 మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఎమ్మెల్యేలు తెలిపారు. 👉 ఓట్ల కోసం బీసీలను వాడుకుని వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చేదాకా తమ పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. Follow ...

ఏమి తక్కువ చేసాము? జీవన్ రెడ్డి ఆరోపణలపై మానాల మోహన్ రెడ్డి కౌంటర్

Image
📍 నిజామాబాద్: మాజీ మంత్రి జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పై చేసిన ఆరోపణలను రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మెన్ మానాల మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. జీవన్ రెడ్డి పార్టీని విడిచిపోతుండటం బాధాకరమని పేర్కొన్న ఆయన, స్వార్థ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేయడం సరికాదని విమర్శించారు. 👉 రాష్ట్రంలో రాక్షస పాలనకు తెరదింపిన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అని ఆయన కొనియాడారు. జీవన్ రెడ్డి తన వయసుకు, విజ్ఞతకు తగిన విధంగా మాట్లాడాలని సూచించారు. పార్టీ అధిష్టానం నిర్ణయాల మేరకే చేరికలు జరుగుతాయని స్పష్టం చేశారు. 💬 “మీ పోరాటం సీఎం పై కాకుండా ప్రజా సమస్యలపై ఉండాలి” అని మోహన్ రెడ్డి అన్నారు. వేం నరేందర్ రెడ్డి క్లిష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీకి విశేష సేవలు అందించారని, గత తొమ్మిదేళ్లుగా పార్టీ అభివృద్ధికి కృషి చేశారని గుర్తుచేశారు. జీవన్ రెడ్డి ప్రతి సారి ఓడిపోయినా కూడా పార్టీ ఆయనకు ప్రాధాన్యత ఇచ్చిందని మానాల మోహన్ రెడ్డి పేర్కొన్నారు. Follow Our WhatsApp Channel