బాసర త్రిబుల్ IT లో మరో విద్యార్థిని మృతి
నిర్మల్ జిల్లా // బాసర
బాసర త్రిబుల్ ఐటీ లో మరో విద్యా కుసుమం నేల రాలిన వైనం వెలుగులోకి వచ్చింది.
ఆరోగ్యం బాలేదని కళాశాల ఆసుపత్రికి వెళ్తే తూతూ మంత్రంగా ట్రీట్మెంట్ చేసి ,సకాలంలో సరైన ట్రీట్మెంట్ అందించకుండా హైదరాబాదుకు పంపించడం ప్రాణం మీదికి వచ్చింది.
బాసర త్రిబుల్ ఐటీ లో PUC సెకండియర్ చదువుతున్న మెదక్ జిల్లా రామచంద్రపురానికి చెందిన మల్లెపూడి తేజస్విని మృతి చెందింది.
మరోవైపు విద్యార్థిని మృతిపై ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ పిఆర్ఓ చేత ప్రెస్ నోట్ రిలీజ్ చేయించారు కళాశాల విసి గోవర్ధన్.విద్యార్థిని మృతిని నిరసిస్తూ రాత్రంతా విసి ఆఫీస్ ముందు నిద్రించిన విద్యార్థులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనితో క్యాంపస్ లో ఉద్రిక్తత నెలకొంది.
వైస్ చాన్స్ లర్ రాజీనామా చేస్తానని చెప్పడం తో ఒప్పుకోని విద్యార్థులు..? రాజీనామా ముఖ్యం కాదు.. సమస్య లకు పరిష్కారం ముఖ్యమని తేల్చి చెప్పారు విద్యార్థులు.. OSD ని తొలగించాలని డిమాండ్ చేశారు విద్యార్థులు.రాత్రి 11 గంటలకు బాసర ఐఐఐటి కి చేరుకొని పరిస్థితి ని సమీక్షించారు ఎస్పీ జానకి షర్మిల.ఉన్నతాధికారులకు పరిస్థితి తెలియజేశారు ఆమె.
