బాసర త్రిబుల్ IT లో మరో విద్యార్థిని మృతి

నిర్మల్ జిల్లా // బాసర బాసర త్రిబుల్ ఐటీ లో మరో విద్యా కుసుమం నేల రాలిన వైనం వెలుగులోకి వచ్చింది. ఆరోగ్యం బాలేదని కళాశాల ఆసుపత్రికి వెళ్తే తూతూ మంత్రంగా ట్రీట్మెంట్ చేసి ,సకాలంలో సరైన ట్రీట్మెంట్ అందించకుండా హైదరాబాదుకు పంపించడం ప్రాణం మీదికి వచ్చింది. బాసర త్రిబుల్ ఐటీ లో PUC సెకండియర్ చదువుతున్న మెదక్ జిల్లా రామచంద్రపురానికి చెందిన మల్లెపూడి తేజస్విని మృతి చెందింది. మరోవైపు విద్యార్థిని మృతిపై ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ పిఆర్ఓ చేత ప్రెస్ నోట్ రిలీజ్ చేయించారు కళాశాల విసి గోవర్ధన్.విద్యార్థిని మృతిని నిరసిస్తూ రాత్రంతా విసి ఆఫీస్ ముందు నిద్రించిన విద్యార్థులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనితో క్యాంపస్ లో ఉద్రిక్తత నెలకొంది. వైస్ చాన్స్ లర్ రాజీనామా చేస్తానని చెప్పడం తో ఒప్పుకోని విద్యార్థులు..? రాజీనామా ముఖ్యం కాదు.. సమస్య లకు పరిష్కారం ముఖ్యమని తేల్చి చెప్పారు విద్యార్థులు.. OSD ని తొలగించాలని డిమాండ్ చేశారు విద్యార్థులు.రాత్రి 11 గంటలకు బాసర ఐఐఐటి కి చేరుకొని పరిస్థితి ని సమీక్షించారు ఎస్పీ జానకి షర్మిల.ఉన్నతాధికారులకు పరిస్థితి తెలియజేశారు ఆమె.

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

మంద కృష్ణ మాదిగపై కుట్ర CMO కనుసన్నల్లో యాక్షన్ టీమ్స్