Posts

Showing posts with the label Mana Nizamabad News

పాపం ట్రాఫిక్ పోలీసన్నకు ఎంత కష్టం..ఎంత నష్టం?

Image
ఐదు లక్షల జనాభా.. వేలాది ద్విచక్ర వాహనాలు..వందలాది కార్లు..డినికితోడు 4 వందల ఆర్టీసీ బస్సులు, పదివేల వరకు ఆటోలు, సుమారు 500 లారీలు ఇలా చెప్పుకుంటూ పోతే అంబులెన్సులు, సైకిల్లు, జీపులు, ప్రవేట్ వాహనాలు,తోపుడు బండ్లు.. అబ్బబ్బా వీటన్నింటినీ నియంత్రణ చేసి ఒక క్రమ పద్ధతిలో ఎవరికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ .. నిరంతరం 24 గంటలు ఎండ, వాన, చలిలో సైతం కాపల దారుల్లా కంటికి రెప్పలా కాపాడుతూ ఉండేవారు ఎవరో తెలుసా?... అదేనండి మన ట్రాఫిక్ పోలీస్ అన్నలు. కానీ విచిత్రం ఏమిటంటే ..నిజామాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేసే ట్రాఫిక్ కానిస్టేబుల్ ల సంఖ్య కేవలం 50 నుండి 60 మంది మాత్రమే ఉంటారంటే మీరు నమ్ముతారా....? పైగా వీరికి ముఖ్యంగా తీవ్రమైన ఎండ తాకిడికి వచ్చే పలు రకాల వ్యాధులు, బిపి, షుగర్, వినికిడి సమస్య లాంటి సమస్యతోపాటు, కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటివి ఎంతో వెంటాడు తున్నప్పటికీ పొట్ట కూటి కోసం భరించక తప్పడంలేదు. వాటన్నిటిని విధుల నిర్వహనలో భాగంగా అనుకుంటూ వాళ్ళ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. ఎలాంటి ట్రాఫిక్ సమస్య ఎదురవ్వకుండా ప్రమాదాలను కట్టడి చేస్తున్న మ...

నిజామాబాద్‌లో ధాన్యం కొనుగోలు భారీ ప్లాన్ 🌾 9 లక్షల టన్నులు సేకరణ!

Image
నిజామాబాద్, యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా సంబంధిత అధికారులు, కేంద్రాల నిర్వాహకులు అంకితభావంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆదేశించారు. రైతులు ఎక్కడ కూడా ఏ దశలోనూ ఇబ్బందులు పడకుండా నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్లాలని అన్నారు. రబీ వరి ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో మంగళవారం ఆయా శాఖల అధికారులతో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈఓలు, ఐకెపి సీసీలు, మెప్మా ప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులో ఉంచేలా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో యాసంగిలో 4.27 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారని అన్నారు. సుమారు 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అంచనా వేయగా, 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం 669 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు. రైతులు నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు త...

కంటి చూపును జాగ్రత్తగా కాపాడుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

Image
నిజామాబాద్, నేత్ర సమస్యలను అశ్రద్ధ చేయకూడదని, శరీర అవయవాలలో అత్యంత ప్రధానమైన కంటి చూపును ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి హితవు పలికారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మంగళవారం జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో బోర్గాం(పి) ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ద్వారా దృష్టి లోపంతో బాధపడుతున్న విద్యార్థిని, విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా విచ్చేసి బాలబాలికలకు కంటి అద్దాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కంటి చూపు మందగించకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ఆకు కూరలు, క్యారెట్ వంటి వాటిని ఆహార పదార్థాలలో భాగం చేసుకోవాలని సూచించారు. ఇదివరకు తాను కూడా దృష్టి లోపంతో ఇబ్బందిపడ్డానని, తగిన వ్యాయామాలు, సరైన ఆహారపు అలవాట్లతో ఆ సమస్యను అధిగమించానని కలెక్టర్ వెల్లడించారు. కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించేందుకు వీలుగా జిల్లాలో సుమారు 70 వేల మంది వరకు విద్యార్థులకు నేత్ర పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 41 వేల మందికి కంటి పరీక్...

గీత దాటితే వేటు తప్పదు.. కలెక్టర్ ఇలా త్రిపాఠి వార్నింగ్

Image
నిజామాబాద్, మార్చి 23 : విధి నిర్వహణలో ఎవరైనా కావాలని నిర్లక్ష్యానికి తావిస్తే, కేవలం సస్పెన్షన్ తోనే సరిపెట్టకుండా బాధ్యులైన వారిపై మరింత కఠిన చర్యలు చేపడతామని జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం అనంతరం అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇటీవల పదవ తరగతి పరీక్షల సందర్భంగా ఎస్జీటీ ఉపాధ్యాయుడు వ్యవహరించిన తీరును కలెక్టర్ ప్రస్తావిస్తూ పైవిధంగా హెచ్చరికలు చేశారు. ఎంతో బాధ్యతాయుతమైన విధుల్లో కొనసాగుతూ, విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం వాటిల్లే విధంగా వ్యవహరించడం శోచనీయమని అన్నారు. ఈ తరహా నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని, నిర్లక్ష్యానికి తావిచ్చే వారిపై తప్పనిసరిగా కఠినమైన చర్యలు ఉంటాయని కరాఖండీగా తేల్చి చెప్పారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణలో ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పక్కాగా వ్యవహరించాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్ తో పాటు సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, తహసిల్దార్లు క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాలలోకి సిబ్బంది ఎవరూ సెల్ ఫోన్లు ...

భగత్ సింగ్ గొప్ప యోధుడు -పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

Image
స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ప్రతి నిత్యం స్మరించుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపునిచ్చారు. మన దేశ స్వాతంత్రం కోసం పోరాడి ప్రాణాలను సైతం నవ్వుతూ వదులుకున్న ఎందరో మహనీయుల త్యాగాలను భారతీయులందరూ ప్రతినిత్యము స్మరించుకోవాలని అన్నారు ఆయన. మార్చ్ 23న నవ యువకులైన దేశభక్తులు భగత్ సింగ్ ,రాజ్ గురు, సుఖదేవ్ ల ప్రాణత్యాగానికి గుర్తుగా సమర్పణ దివస్ కార్యక్రమాన్ని కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ మేరా యువ భారత్ ఆధ్వర్యంలో సోమవారం పాలిటెక్నిక్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ కులాలు, మతాలు ప్రాంతాలు వేరువేరుగా ఉన్నప్పటికీ భారతీయులందరూ ఒకే తల్లి బిడ్డల్లాగా కలిసి ఉండటమే మన స్వతంత్ర సమరయోధుల యొక్క జీవిత ఆశయమని గుర్తు చేశారు, ప్రాణ త్యాగానికి మించిన గొప్ప త్యాగం ఇంకేది ఉండదని ,అలాంటిది వేలాదిమంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను ఈ దేశం కోసం వదిలిపెట్టారని ఆయన తెలిపారు. నవ యువకులుగా ఉన్న అతిపిన్న వయసు గల యువకులు భగత్ సింగ్ అతని స్నేహితులు రాజ్ గురు, సుఖదేవ్ లు ఉరి కొయ్యలను సైతం నవ్వుతూ ముద్దాడి మెడలో వేసుకున...

ఉత్తమ ఫారెస్టు ఆఫీసర్ గా బాస సుశీల్

Image
రాష్ట్ర స్థాయి ఉత్తమ అటవీశాఖ అధికారుల జాబితాలో ఆర్ముర్ ఫారెస్టు బీట్ ఆఫీసర్ బాస సుశీల్ కుమార్ ఎంపికయ్యారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ఉత్తమ అధికారులను గుర్తించింది ప్రభుత్వం. దేశ వ్యాప్తంగా ఎస్టిమేషన్ 2026 ను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు అటవీ, వన్యప్రాణుల సంరక్షణలో చూపిన అంకితభావంతో పని చేసినందుకు బాస సుశీల్ కుమార్ ఉత్తమ అధికారిగా ఎంపిక అయ్యారు. హైదరాబాద్ దూపల్లి లోని ఫారెస్టు అకాడమీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఉత్తమ ఉద్యోగి అవార్డును అందుకున్నారు ఆయన. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ఉత్తమ అధికారి అవార్డును అందుకున్న ఆర్ముర్ రేంజి బీట్ ఆఫీసర్ సుశీల్ కుమార్ ను అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టరు సువర్ణ,అభిలాష తదితరులు సుశీల్ కుమార్ ను అభినందించారు. Follow Our WhatsApp Channel

హరీష్ రావు అడ్డాలో మార్పు జపం

Image
BRS బాహుబలి హరీష్ రావు అడ్డా అయిన సిద్దిపేట గడ్డమీద సీఎం రేవంత్ రెడ్డి మార్పు మంత్రం వల్లించారు. ఆదివారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం ఒక్కసారి సిద్దిపేట లో సిట్టింగ్ MLA హరీష్ రావు కు బదులు కాంగ్రెస్ ను గెలిపించాలని సిద్దిపేట ఓటర్లను అభ్యర్తించారు. హరీష్ రావు చెబుతున్నట్లు సిద్దిపేట మీద వివక్ష చూపలేదన్నారు సీఎం.10 ఏళ్ల BRS పాలనలో నా కొడంగల్ మీద వివక్ష చూపారని ఎదురు దాడికి దిగారు రేవంత్ రెడ్డి. ప్రసంగం మొత్తం హరీష్ రావు చుట్టే సాగడం విశేషం.. ప్రైవేటు మోజులో పడకుండా విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా రంగంలో మార్పులు తీసుకొస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు స్కూళ్లకంటే ఉన్నతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో మీట నొక్కి రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా (Rythu Bharosa) నిధులను విడుదల చేశారు. నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించి రైతులకు అంకితమిచ్చారు. తర్వాత జిల్లాలో 775 కోట్...

ఆశా వర్కర్లకు పరిష్కారం లేకపోతే చలో అసెంబ్లీ

Image
కామారెడ్డి, ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 28న చలో అసెంబ్లీ నిర్వహిస్తామని అంగన్వాడీ లు సర్కార్ కు అల్టిమేటం ఇచ్చారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ నాయకత్వంలో వారు శుక్రవారం కామారెడ్డిలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కలిశారు. షబ్బీర్ అలీ ఆశా వర్కర్లతో సుమారు గంటకు పైగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా CITU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కే చంద్రశేఖర్ ముదం అరుణ్ లు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు కనీస వేతనం 18000 లు అమలు చేస్తామనిఇచ్చిన హామీ నెరవేరలేదన్నారు. పని భద్రత హామీ కూడా ఇప్పటికే అమలు కాలేదన్నారు.ఎన్నికల్లో మాతో పని చేయించుకుని పారితోషికం ఇవ్వలేదని వెంటనే వాటిని విడుదల చేయాలని అన్నారు .అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పెంచిన 1500 ల పారితోషికాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. 2021 జులై నుండి డిసెంబర్ వరకు ఆరు నెలల పిఆర్సి బకాయిల విడుదల చేయాలని అన్నారు. పి ఎఫ్ ఎస్ ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సమయం ఇచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సుదీర్ఘంగా మాట్లాడిన షబ్బీర్ ఆలీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర...

అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా గుట్టు రట్టు

Image
శభాష్ ఇందూరు పోలీస్ ( మన నిజామాబాద్ అర్బన్) అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా గుట్టు రట్టు చేసినట్లుపోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఘరానా నిందితుల అరెస్ట్ వివరాలను ఆయన వెల్లడించారు. బి. శ్రీనివాస్ (నార్త్ రూరల్ బి శ్రీనివాస్), నవీపేట్ ఎస్సై శ్రీకాంత్ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసినట్లు సిపి తెలిపారు. *నిందితుల వివరాలు* A1. షేక్ అర్బజ్ @ మయా, నివాసం: శారదానగర్ నయాబాది, బాసర గ్రామం & మండలం ప్రస్తుతం ధర్మబాద్, మహారాస్ట్రా A2. షేక్ ఆరిబ్, ఖుడ్వయినగర్ చౌరస్తా, ఇత్వార్ (పో), దెగ్ళూర్ నాఖా, నాందేడ్ జిల్లా, మహారాస్ట్రా A3. షేక్ రెహమాన్ , నివాసం. మహబూబ్య కాలనీ మోసంబి క మల్ల నాందేడ్ (పరారీలో ఉన్నాడు) A4.పేరు షేక్ అర్బాజ్ రెహ్మత్ నివాసం: రాంనగర్ ధర్మాబాద్ గ్రామం మరియు మండలం నాందేడ్ జిల్లా మహారాష్ట్ర(రిసీవర్) A5. పేరు సోన్ కాంబ్లె మనోజ్ శంకర్ నివాసం. జరికోట్ గ్రామం ధర్మాబాద్ తాలూకా నాందేడ్ జిల్లా మహారాష్ట్ర (రిసీవర్) A6. షెర్ అలి షాదుల్ షేక్, నివాసం: టెంభుర్ని గ్రామం నాయగావ్ తాలూకా నాందేడ్ జిల్లా మహారాష్ట్ర(రిసీవర్) A7. అవేజ్ నివాసం బాసర గ్రామం మరియు మండలం (రిసీవర్,...

బాసర త్రిబుల్ IT లో మరో విద్యార్థిని మృతి

Image
నిర్మల్ జిల్లా // బాసర బాసర త్రిబుల్ ఐటీ లో మరో విద్యా కుసుమం నేల రాలిన వైనం వెలుగులోకి వచ్చింది. ఆరోగ్యం బాలేదని కళాశాల ఆసుపత్రికి వెళ్తే తూతూ మంత్రంగా ట్రీట్మెంట్ చేసి ,సకాలంలో సరైన ట్రీట్మెంట్ అందించకుండా హైదరాబాదుకు పంపించడం ప్రాణం మీదికి వచ్చింది. బాసర త్రిబుల్ ఐటీ లో PUC సెకండియర్ చదువుతున్న మెదక్ జిల్లా రామచంద్రపురానికి చెందిన మల్లెపూడి తేజస్విని మృతి చెందింది. మరోవైపు విద్యార్థిని మృతిపై ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ పిఆర్ఓ చేత ప్రెస్ నోట్ రిలీజ్ చేయించారు కళాశాల విసి గోవర్ధన్.విద్యార్థిని మృతిని నిరసిస్తూ రాత్రంతా విసి ఆఫీస్ ముందు నిద్రించిన విద్యార్థులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనితో క్యాంపస్ లో ఉద్రిక్తత నెలకొంది. వైస్ చాన్స్ లర్ రాజీనామా చేస్తానని చెప్పడం తో ఒప్పుకోని విద్యార్థులు..? రాజీనామా ముఖ్యం కాదు.. సమస్య లకు పరిష్కారం ముఖ్యమని తేల్చి చెప్పారు విద్యార్థులు.. OSD ని తొలగించాలని డిమాండ్ చేశారు విద్యార్థులు.రాత్రి 11 గంటలకు బాసర ఐఐఐటి కి చేరుకొని పరిస్థితి ని సమీక్షించారు ఎస్పీ జానకి షర్మిల.ఉన్నతాధికారులకు పరిస్థితి తెలియజేశారు ఆమె.

ఆదానీకి అమ్మేసి సుద్దపూస మాటలా?

Image
ఎంపీ అరవింద్‌పై కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి విమర్శలు Nizamabad: జిల్లాకు గత పది సంవత్సరాల్లో ఏమి అభివృద్ధి సాధించారో చెప్పకుండా ఈనెల 21న “చలో కలెక్టరేట్” కార్యక్రమం చేపడుతున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి ఎంపీ Dharmapuri Arvind పై విమర్శలు గుప్పించారు. బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీ అరవింద్‌కు జిల్లా అభివృద్ధిపై, ముఖ్యంగా రైతాంగంపై ఎలాంటి శ్రద్ధ లేదని ఆరోపించారు. రైతుల పేరుతో రాజకీయాలు చేస్తున్నారే తప్ప అభివృద్ధిలో మాత్రం శూన్యం అని విమర్శించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేశామని చెప్పుకుంటున్నా, పసుపు రైతులకు కనీస మద్దతు ధర కూడా లభించడం లేదని, మార్కెట్ యార్డుల్లో రైతులు ధర పెంపు కోసం ఆందోళనలు చేస్తున్నప్పటికీ ఎంపీ స్పందించడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మొక్కజొన్నకు మద్దతు ధర ఇవ్వాలంటూ కలెక్టరేట్ ముట్టడి చేపడతామని చెప్పడం హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో పసుపు రైతుల గురించి పెద్ద ఎత్తున మాట్లాడిన అరవింద్ ఇప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టారని ప్రశ్నించారు. జిల్లాలో ఎప్పుడూ రాజకీయ...

ఆబ్కారీ పోలీసులా.. మజాకా..

Image
మాయ చేసి మత్పరించడంలో నిజామాబాద్ ఎక్సయిజ్ పోలీసులకు ఎవరూ సరి రారని నిరూపిస్తున్నారు.మాటలు కోటలు దాటినా వారి చేతిలో ఉన్న లాఠీ ఆఫీసు గడప దాటదని రూఢి అవుతోంది. తెల్లవారు జాము మద్యం అమ్మకాలను నియంత్రించామని,బెల్టు షాపులను మూసేయించామని ఎక్సయిజ్ పోలీసుల ప్రకటనలు భూటకమని తేలిపోయింది. మద్యం వ్యాపారులతో ఉన్న నోట్ల బంధం ముందు విధులు బలా దూర్ అని తేలిపోయింది. ఈ పరిణామాలకు అద్దం పడుతోంది నిజామాబాద్ మద్యం అమ్మకాల తీరు. నిజామాబాద్ నగరం నలుమూలల్లో నిబంధనలకు విరుద్ధంగా తెల్లవారుజామున నుంచే వైన్స్,బార్ షాపుల్లో లిక్కర్ అమ్ముతున్న విషయాన్ని మన నిజామాబాద్ స్టింగ్ ఆపరేషన్తో బయట పెట్టింది.అయితే అలాంటి షాపులపై చర్యలు తీసుకుంటామని ఆబ్కారీ SHO స్వప్న ఖరాఖండిగా చెప్పిన మాటలు గాలివాటమివే అని తేలిపోయింది. స్టింగ్ ఆపరేషన్ జరిపిన మరుసటిరోజు తూతూ మంత్రం చర్యలతో సరిపెట్టారు స్వప్న. ఆ మరుసటిరోజు నుంచే నిజామాబాద్ అంతటా యధావిధిగా తెల్లవారుజామున నుంచే బార్ షాపుల్లో మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. అయితే లిక్కర్ సిండికేట్ తో ఉన్న లాలూచీ వల్లే బజారులో బజాప్తాగా అక్రమంగా మద్యం ఏరులై పారుతోంది.జిల్లా కేంద్రంలోనే విధులు నిర్వ...

పోలీసు దాడిలో ఆశ వర్కర్లకు గాయాలు

Image
*సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆశా వర్కర్ల కామారెడ్డి కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం *భారీ కేట్లను పక్కకు జరిపి గేటు వద్ద ఆందోళన నిర్వహించిన ఆశ వర్కర్లు, CITU నాయకులు *పోలీసుల దాడిలో గాయపడ్డ ఆశా వర్కర్లు *మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీస్ కంట్రోల్ రూమ్ సీఐ నరేష్ పై నిర్భయ కేసు నమోదు చేయాలని సస్పెండ్ చేసే అరెస్టు చేయాలని డిమాండ్ ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ధర్నాకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఆశ వర్కర్లు సిఐటియు నాయకులు భారీ కేట్లను తోసేసి కలెక్టరేట్ గేటు ముందుకు చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగి పలువురు ఆశా వర్కర్లకు గాయాలయ్యాయి. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కే చంద్రశేఖర్, ముదం అరుణ్ లు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా నిరసన తెలుపుదామని వెళితే పోలీసుల అత్యుత్సాహం వల్ల ఉద్రిక్తత కి దారితీసిందన్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్ సీఐ నరేష్ మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించాడని ఇష్...

రణరంగంగా మారిన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్

Image
కమిషనర్ ఛాంబర్ ఎదుట బైఠాయించిన మున్సిపల్ కార్మికులు పరిస్థితి ఉద్రిక్తం ధర్నా కార్యక్రమంలో అపస్మారక స్థితికి చేరుకున్న మహిళా కార్మికులు మన నిజామాబాద్ అర్బన్.. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మంగళవారం మున్సిపల్ కార్మికుల వేతనాలు చెల్లించాలంటూ సిపిఐ సిపిఎం ఎ టి యు సి ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమం రణరంగంగా మారింది. మున్సిపల్ కమిషనర్ చాంబర్ ముందు కార్మికులు బైఠాయించి సుమారు అరగంటసేపు నిరసన తెలిపారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఆందోళన కారులను అక్కడి నుంచి వదిలి వెళ్లాలని కోరారు. దీంతో కార్మికులు అంతా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం మెట్లపై కూర్చుని సైతం తమ డిమాండ్లు నెరవేరే వరకు ఇక్కడ నుండి వెల్లబోమని బీస్మించుకొని కూర్చుండి పోయారు. అయితే ఇది ఇలా ఉండగా రెండవ అంతస్తులో ఉండే డిప్యూటీ కమిషనర్ను కలిసి తమ సమస్యను విన్నవించడానికి వెళ్లిన మహిళా కార్మికులు డిప్యూటీ కమిషనర్ తలుపు మూసి ఉంచటంతో వాటిని తెరవాలని చేతులతో బాధదంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులకు మహిళా కార్మికులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో ముగ్గురు మహిళలు అపస్మారక స్థితికి చేరుకొని పడి...

టౌన్ ప్లానింగ్ కు అటెండరే బిగ్ బాస్

Image
*మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అంతా గందరగోళం *టౌన్ ప్లానింగ్ అధికారి బదిలీ కావడంతో అంతా మా ఇష్టమని కలెక్షన్ల పేరిట విధులకు డుమ్మా కొడుతున్న కిందిస్థాయి సిబ్బంది *టౌన్ ప్లానింగ్ లో సెక్షన్ లో ఒక్క అటెండర్ తప్ప విధులకు హాజరుకాని వైనం వడ్డించేవారు లేకపోతే ఏదైనా పెట్టుకుని తినవచ్చు అనే నానుడిని అక్షరాల నిజం చేసి చూయిస్తున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోని టౌన్ ప్లానింగ్ సెక్షన్ లోని ముఖ్య అధికారులు కిందిస్థాయి అధికారులు అయితే ఇటీవల టౌన్ ప్లానింగ్ అధికారి బదిలీ కావడంతో తమకు అడుగే నాధుడే లేదనుకున్నట్టు ఉన్నారు టౌన్ ప్లానింగ్ సిబ్బంది అధికారులు. తమ శిక్షణలో ఎవరు పై స్థాయి అధికారి లేరని ఇక ఎవరి మాట వినే ప్రసక్తే ఉండదనుకుంటున్నారో ఎంటో టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో వార్త సేకరణ కోసం ఓ అధికారిని కలవడానికి మన నిజామాబాద్ టీం వెళ్ళగా అక్కడ కేవలం ఆ సెక్షన్లో ఒక మహిళ అటెండర్ తప్ప ముఖ్యమైన టౌన్ ప్లానింగ్ అధికారులు సిబ్బంది ఎవరు లేకపోవడంతో ఆ సెక్షన్ లో మొత్తం ఖాళీ కూర్చిలే దర్శనమిచ్చాయి. దీంతో సదరు మహిళ అటెండర్ ను వివరణ అడగగా టౌన్ ప్లానింగ్ ముఖ్య అధికారి ఇటీవల బదిలీ అయి వెళ్లారని మిగతా వారంత...

నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అవార్డు

Image
కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా అందించే అత్యున్నత సాహిత్య పురస్కారం 'కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు -2025' ప్రముఖ తెలంగాణ కవి, రచయిత, నందిని సిధారెడ్డికి దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేసారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ సందర్బంగా నందిని సిధారెడ్డి ని అభినందిస్తూ కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సందర్భంగా ప్రపంచం ఎదుర్కున్న సంక్షోభాన్ని, ముఖ్యంగా మానవ సంబంధాల విచ్చిన్నతలను కవిత్వం ద్వారా హృద్యంగా చిత్రీకరించిన, దీర్ఘ కవితా సంపుటి 'అనిమేష'కు ఈ అవార్డు రావడం గొప్ప విషయం అని అన్నారు కేసీఆర్. తెలంగాణ మట్టివాసన తెలిసిన కవిగా, తన సాహిత్యం ద్వారా తెలంగాణ జీవితాన్ని అక్షరబద్ధం చేసిన, తెలంగాణ గర్వించదగ్గ కవి నందిని సిధారెడ్డి అని అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంగా మంజీరా రచయితల సంఘం ఏర్పాటుచేసి, అన్ని వర్గాల ప్రజా సమస్యలు, సామాజిక సమానత్వం కోసం రచనలు చేస్తూ తమ కలాన్ని గళాన్ని విప్పారని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో తన పాట ,సాహిత్యం ద్వారా ప్రజలను ఆలోచింపజేస్తూ ఉద్యమ కవిగా తెలంగాణ ప్రజల అభిమానాన్ని సిధారెడ్డి చూరగొన్నారని తెలిపారు...

కాంగ్రెస్‌కు గుడ్‌బై దిశగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి.

Image
Big Breaking కాంగ్రెస్ తో పెనవేసుకున్న బంధం తునాతునకలు కానుంది. తెలంగాణలో కాంగ్రెస్ పాత తరం నేతగా స్థానాన్ని సొంతం చేసుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి మనసు ముక్కలయ్యింది. కాంగ్రెస్ తో కటీఫ్ కు ముహూర్తం సమీపిస్తుంది. దీన్ని అక్షరాలా నిజం చేస్తూ జగిత్యాలలో జీవన్ రెడ్డి ఇంట్లో, పట్టణంలో పలు చోట్ల ఉన్న ఫ్లెక్సీలను ఆయన అనుచరులు సోమవారం తొలగించారు. కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు మాట్లాడిన కొద్దిసేపటికే ఫ్లెక్సీల తొలగింపునకు జీవన్రెడ్డి అనుచరులు రంగంలోకి దిగడం విశేషం. కాంగ్రెస్ పార్టీతో ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుబంధాన్ని తెంచుకోవడం ఖాయం అయ్యింది.ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్,PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన సంధి ప్రయత్నాలు విఫలం అయ్యాయి. BRS నుంచి గెలిచి కాంగ్రేసు లో స్థానిక MLA సంజయ్ చేరినప్పటి నుంచి జీవన్ రెడ్డి అనేక అవమానాలు చవి చూసారు.మొన్నటి మునిసిపల్ ఎన్నికల్లోనూ జీవన్ రెడ్డి అనుచరులకు టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ అధిష్టానం సంజయ్ వైపు మొగ్గు చూపింది. స్థానికంగా బలమైన క్యాడర్ ఉన్న నేత కావడంతో జీవన్ రెడ్డి అసలైన కాంగ్రెస్ లీడర్లను రెబల్స్ గా రంగంలోకి దింపారు. ప...

గీత కార్మికుల కోసం బడ్జెట్‌లో ₹5000 కోట్లు

Image
రాష్ట్ర బడ్జెట్లో కల్లుగీత కార్మికులకు 5000 కోట్లు కేటాయించాలని వక్తలు డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్ ఇందిరా పార్క్ లో జరిగే మహాధర్నాను జిల్లాలో ఉన్న గీత కార్మికులు తరలి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కోయడి నర్సింహులు అధ్యక్షతన సోమవారం స్థానిక R&B గెస్ట్ హౌస్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కల్లుగీత కార్మికుల కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రాష్ట్ర బడ్జెట్లో గీతా కార్మికులకై ఐదు వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.గీత కార్మికులకు కొత్త పెన్షన్లు ఇవ్వాలని, ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ ని 4000 చేయాలని, ఎక్స్గ్రేషియా ను 10 లక్షలకు పెంచాలని కోరారు. అలాగే సేఫ్టీ కిట్స్ ఇవ్వాలని తీర్మానం చేసింది సమావేశం. సమస్యల పరిష్కారానికై రేపు హైదరాబాదులోని ఇందిరాపార్క్ లో జరిగే మహా ధర్నా,అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. దీనిలో KGKS జిల్లా కార్యదర్శి చిడుగు శేఖర్ గౌడ్, కోశాధికారి శ్రీరాం గౌడ్, సాయగౌడ్ తో పాటు ఈ సమావేశం వివిధ గీత వృత్తి సంఘ ప్రతినిధులు ఎనుగందుల మురళి,నారా గౌడ్ శ్రీనివాస్, కృష్ణాగౌ...

ప్రజల ముంగిట్లోకి అభివృద్ధి ఫలాలు - షబ్బీర్ అలీ వెల్లడి

Image
కామారెడ్డి , ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడంతో పాటు గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి కోసం “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” కింద 99 రోజుల కార్యచరణ ప్రణాళికను అమలు చేస్తోందని ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అవగాహన సదస్సులో షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, వివిధ విభాగాల జిల్లా అధికారులు, నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు ఈ సందర్భంగా ప్రభుత్వ 99 రోజుల కార్యచరణ ప్రణాళికపై ప్రజాప్రతినిధులకు, అధికారులకు విస్తృత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు ఈ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను తీసుకువచ్చిందని చెప్పారు. ప్రభుత్వ పథకాలు నిజంగా ప్రజలకు చేరాలంటే గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద...