జర్నలిస్టు కూతురు అనన్య స్టేట్ ర్యాంకర్.. CECలో 982 మార్కులతో మూడో స్థానం
కామారెడ్డి కి చెందిన మున్నం అనన్య పట్టణంలోని VRK కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఆదివారం ఇంటర్ బోర్డ్ ప్రకటించిన ఫలితాల్లో CEC Group నుంచి 1000 Marks కు గాను 982 మార్క్స్ సాధించింది రాష్ట్రంలో మూడవ ర్యాంక్ సాధించింది. రాష్ట్ర టాపర్ కు 985 మార్క్స్ వచ్చాయి.
ఇంటర్ ప్రథమ సంవత్సరంలోను స్టేట్ లో రెండవ ర్యాంక్ సాధించింది. IAS లక్ష్యంగా తాను CEC Group ను ఎంచుకొని శ్రమిస్తున్నట్లు ఈ సందర్బంగా అనన్య తెలిపింది. అనన్య తండ్రి మున్నం శ్రవణ్ కుమార్ 25 ఏళ్లుగా సీనియర్ జర్నలిస్ట్ గా పని చేస్తున్నారు. తల్లి మున్నం రాధ గృహిణి .తమ బిడ్డ ఇంటర్ లో అనుకున్న స్థాయిలో మార్క్ లు ర్యాంక్ ను సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తమ కూతురు IAS లక్ష్యంగా కష్టపడి చదువుతొందని ,తన లక్ష్యం చేరుకొనేలా వెన్నంటి తోడ్పాటు నిస్తామని ఈ సందర్బంగా చెప్పారు.తమ పెద్ద కూతురు నిహారిక సైతం SRK విద్యసంస్తల్లొ చదివి ఇంటర్ MPC లో 950 పైగా మార్క్ లు సాధించి EAPCET లో మంచి ర్యాంక్ సాధించి నల్లమల్లారెడ్డి కాలెజిలొ ఫ్రీ సీట్ సాధించి CSE AI Group లొ B.Tech సెకండ్ ఈయర్ చదువుతోంది. తమ ఇద్దరు కూతుల్లు అనుకున్న లక్ష్యాల వైపు సాగుతుండడం పట్ల తల్లి తండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. కళాశాల యజమాన్యం హర్షం వ్యక్తం చేశారు...
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Click here to 👆 Follow Our WhatsApp Channel