Posts

Showing posts with the label Mana Nizamabad

హీరో విజయ్ కిరూట్ క్లియర్. తమిళనాడులో సంబరాలు

Image
తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మలుపులు చోటు చేసుకుంటున్నాయి. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళనాడు వెట్రి కళగం, ప్రభుత్వ ఏర్పాటు దిశగా కీలక అడుగులు వేస్తోంది. తాజా పరిణామాల ప్రకారం, లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ మద్దతు తెలపడంతో విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి మార్గం సుగమమైంది. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సీపీఐ ఎం,వర్కింగ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. విజయ్ పార్టీకి పూర్తి మద్దతు ఇవ్వాలని నిర్ణయించి నట్లు సమాచారం. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర కమిటీ అధికారికంగా ఆమోదించాల్సి ఉంది. సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలకు కలిపి మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు ఉండగా, వీరంతా టీవీకేకు మద్దతు తెలపడం విజయ్ బలాన్ని పెంచింది. తమిళనాడు అసెంబ్లీ లో మెజారిటీ మార్కు ను అందుకోవడానికి ఈ మద్దతు ఎంతో కీలకంగా మారింది. మరోవైపు, భారతీయ జనతా పార్టీ,ఈ రాజకీ య చదరంగంలో తటస్థంగా ఉండాలని నిర్ణయించుకుంది. తాము ఏ పార్టీకి ఓటు వేయమని, ప్రభుత్వ ఏర్పాటులో ప్రత్యక్షంగా పాల్గొనే ఉద్దేశ్యం లేదని బీజేపీ రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ జారీ చేసిన ఈ ప్రకటనలో, తమిళనాడు ప్రజల సం...

కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదు - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

Image
రాష్ట్రంలో రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు ఓటు వేసే అవకాశమే లేదని, తిరిగి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనీసం 20 సంవత్సరాల పాటు అధికారంలోకి రావడం కల్లని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్గాలను మోసం చేసిందని, దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి అరాచకాలు, కుంభకోణాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈరోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలతో ఒక సుదీర్ఘ సమీక్ష సమావేశాన్ని కేటీఆర్ గారు నంది నగర్ లోని తన నివాసంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు పార్టీని బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యాచరణ పైన దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి అడ్డగోలుగా పెరిగిపోయిందని, అన్ని అంశాల్లోనూ కాంగ్రెస్ పార్టీ కమీషన్లు, కాసుల కక్కుర్తి కోసమే చూస్తున్నదని కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లాలో భూములతో పాటు అనేక మైనింగ్ కుంభకోణాలకు కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులే స్వయంగా పాల్పడుతున్న పరిస్థితి నెలకొన్నదన్నారు. కాంగ...

50 కోట్ల భూమి.. 5 లక్షలకే.. -కాంగ్రెస్ కాయ్ రాజా కాయ్

Image
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ లేదు అనేది పాత సామెత. అభినవ రాజులు తలుచుకుంటే సర్కారు భూములు చిటికెలో చెర లోకి రావడమనేది కొత్త నానుడి. రాజకీయ పోకడతో రాజులుగా వర్ధిల్లుతున్న వారు అనుకున్నదే తడవుగా అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూమి అధికార కాంగ్రెస్ కు సొంతం అయ్యింది..1965 లో అప్పటి జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు మాధవరావు నేతృత్వంలో కొంచెం అటు ఇటుగా 3000 గజాలకు పైగా కాంగ్రెస్ పార్టీ సొంతం అయ్యింది. నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా కమర్షియల్ ప్రాపర్టీ అయ్యింది ఇప్పుడు..1980 లో దుకాణ సముదాయం నిర్మించారు. కాంగ్రెస్ పార్టీకి సొంతంగా జిల్లా ఆఫీసు...దాని నిర్వహణ ఖర్చులు పోను ఆదాయాన్ని సమకూర్చే కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది కాంగ్రెస్ పార్టీకి.. ఈ ప్రాపర్టీ విలువ కనీసం 40 కోట్ల పైమాటే.. ఇట్లా నగరం నడి బొడ్డులో సొంతంగా పార్టీ ఆఫీసు ఉన్నప్పటికీ.. ఇదే ఆఫీసు ఎదురుగా R&B స్థలంపై కాంగ్రెస్ పెద్దల కన్ను పడింది. గజం లక్షన్నర విలువ ఉన్న ఈ భూమి విలువ 50 నుంచి 60 కోట్లు ఉంది..4 లక్షల పైచిలుకు నామినల్ ధర చెల్లించి R&B శాఖకు చెందిన ఎకరం భూమిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి పొందింది. PCC చీఫ్ మహేష్ కుమార్ గ...

బీఆర్ఎస్‌ను వీడను.. బీజేపీలో చేరను: జీవన్ రెడ్డి క్లారిటీ

Image
తాను బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకి మారుతున్నానని కొన్ని వార్తా సంస్థల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. తాను జీవితంలో ఎప్పుడూ బీ ఆర్ఎస్ ను వీడను, బీజేపీతో సహా మరే పార్టీలో చేరను అని ఆయన స్పష్టం చేశారు. రాజకీయంగా తనను ఎదుర్కొనే దమ్ము లేను కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఒక పథకం ప్రకారం సాగిస్తున్న కుట్రలో భాగమే తనపై ఈ దుష్ప్రచారం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కంఠంలో ప్రాణమున్నంత వరకూ కేసీఆర్ బాట వీడనని, చివరి వరకు గులాబీ నీడలోనే రాజకీయాలు చేస్తానని ఆయన అన్నారు. తాను రాజకీయ ఓనమాలు దిద్దుకున్న పార్టీ బీఆర్ఎస్ అని, తన రాజకీయ గురువు, ఆరాధ్య దైవం కేసీఆర్ అని జీవన్ రెడ్డి తెలిపారు. తాను బీజేపీలో చేరడానికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీని ఢిల్లీలో కలిసినట్టు కట్టుకథలు ప్రచారం చేసురున్నారని ఆయన మండిపడ్డారు. నిజానికి తాను ఏ కేంద్ర మంత్రిని కలవలేదని, తాను హైదరాబాద్ లోనే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి పేక్ ప్రచారాలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంట...

నిజామాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చెక్: ఆ రెండు ‘ఫ్లైఓవర్లు’ నిర్మిస్తేనే నగరానికి మహర్దశ!

Image
కొండలు, గుట్టలు, పచ్చిక బయళ్లతో అలరారుతున్న మన నిజామాబాద్ జిల్లా ప్రకృతి సౌందర్యానికి కేరాఫ్ అడ్రస్. ఇక్కడి మనుషుల ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు వెలకట్టలేనివి. కష్టనష్టాల్లో ఒకరికొకరు తోడుగా నిలుస్తూ, ఆదర్శవంతమైన జీవనశైలితో ముందుకు సాగుతున్న మన నగరం గర్వించదగ్గ ఎన్నో విశేషాలకు నిలయం. అయితే, ఇంతటి అందమైన మన నగరానికి ఇప్పుడు ఒక పెద్ద సమస్య సవాలుగా మారింది. అదే ట్రాఫిక్ కష్టాలు. స్తంభిస్తున్న నగరం.. ఇబ్బందుల్లో జనం! జిల్లా కేంద్రంలో రోజురోజుకూ వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వేలాది కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు, బస్సులు, భారీ లారీలు.. ఇలా ఒకటేమిటి, ప్రతి రోజూ వేల సంఖ్యలో వాహనాలు నగర వీధుల్లో రాకపోకలు సాగిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ గంటల తరబడి స్తంభించిపోతుండటంతో సామాన్య ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిష్కారం ఒక్కటే: రెండు కీలక ఫ్లైఓవర్ల నిర్మాణం నగరంలో నెలకొన్న ఈ ట్రాఫిక్ జటిల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ సమస్యకు ప్రధానంగా రెండే రెండు పరిష్కార మార్గాలు ఉన్నాయని నిపుణులు మరియు స్థానికులు అ...

ప్రజావాణి పేదలకు భారమా?.. కలెక్టరేట్ చేరాలంటే ₹100 ఖర్చు తప్పదా!

Image
ప్రజావాణి.. పేదవాడికి వెతలేనా? ₹100 ఖర్చు చేస్తే తప్ప కలెక్టరేట్ గడప తొక్కలేని దుస్థితి! "మన నిజామాబాద్" ప్రత్యేక కథనం: జిల్లా నలుమూలల నుంచి ఆశతో వస్తున్న అర్జీదారులకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. తెల్లవారుజామునే నిద్రలేచి, ఎక్కడో అప్పు తెచ్చిన వంద రూపాయలు ఆటోలకే పోస్తుంటే.. తీరని సమస్యల వేదన సామాన్యుడిని కుంగదీస్తోంది. నిరాశ పరుస్తున్న 'పేపర్' రాజకీయం: కలెక్టర్ గారిని కలిసి తమ గోడు చెప్పుకుందామని వస్తే, కేవలం ఒక కాగితం కింది స్థాయి అధికారికి ఇచ్చి వెనుతిరగాల్సి రావడం ఒక 'నగ్న సత్యం'. కొత్తగా వచ్చిన మీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలకు, క్షేత్రస్థాయి అధికారుల అలసత్వం వల్ల నిరాశే ఎదురవుతోంది. అధికారుల అలసత్వం - మీకో పాపం: కింద స్థాయి సిబ్బంది చేసే నిర్లక్ష్యం అంతిమంగా జిల్లా యంత్రాంగానికి చెడ్డపేరు తెస్తోంది. దయచేసి ప్రజావాణి అర్జీలను కేవలం కాగితాలుగా చూడకుండా, వారం వారం వాటిపై సమీక్ష నిర్వహించి ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కోరుతున్నాం. మా డిమాండ్ - ఉచిత ప్రయాణం: బస్టాండ్ నుండి కలెక్టరేట్ వరకు రావడానికి పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి,...

దద్దమ్మ తేజస్వి కి బుద్ధి లేదు.. -- మాజీ ఎంపీ మధు యాష్కీ

Image
60 ఏళ్ల తెలంగాణ పోరాటం గురించి తెలుసుకో.. తేజస్వి సూర్య..! తెలంగాణ గురించి, తెలంగాణ పోరాటం గురించి అవగాహన లేని దద్దమ్మ మాటలు మాట్లాడుతున్నావ్.. ఒకప్పుడు మీ కర్ణాటక ప్రాంతంని ప్రాంతాలు కూడా హైదరాబాద్ రాష్ట్రంలో భాగమే..! నిజాం పాలనలో ఉన్నవే.. తెలంగాణ చరిత్ర నీకు తెలవదు, మీ నరేంద్ర మోడీకి తెలవదు..! మీ తాత ముత్తాతల చరిత్ర ఏందో.. తెలుసుకొని మాట్లాడు తేజస్వి సూర్య..! బ్రిటిష్ కాలంలో ఇండియా - పాకిస్తాన్ విభజన ఎప్పుడు జరిగింది.? ఏపీ, తెలంగాణ విభజన ఎందుకు జరిగిందో..? అవగాహన లేకుండా రెండింటిని పోల్చుతూ మాట్లాడడం నీ తెలివి తక్కువ తనానికి నిదర్శనం. ఇలాంటి సిగ్గుమాలిన మాటలు మాట్లాడితే తెలంగాణలోనే కాదు.. నీ కర్ణాటకలోనూ నిన్ను చెప్పులతో కొడతారు..! అవకాశం వచ్చినప్పుడల్లా బిజెపి నేతలు తెలంగాణ పట్ల అక్కస్సును వెళ్లగాక్కుతున్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ.. ఏ చిన్న సంఘటన కూడా జరగకుండా కలిసిమెలిసి జీవనం సాగిస్తున్న తీరు బిజెపి పాలకులకు కంటగింపుగా కనపడుతుందా...? తెలంగాణ రాష్ట్ర ఎదుగుదల ఓర్వలేక పోతున్నారా..? బిజెపి ఎంపీ అలా అడ్డగోలుగా మాట్లాడుతున్నా తెలంగాణ రాష్ట్రం నుం...

జర్నలిస్టు కూతురు అనన్య స్టేట్ ర్యాంకర్.. CECలో 982 మార్కులతో మూడో స్థానం

Image
కామారెడ్డి కి చెందిన మున్నం అనన్య పట్టణంలోని VRK కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఆదివారం ఇంటర్ బోర్డ్ ప్రకటించిన ఫలితాల్లో CEC Group నుంచి 1000 Marks కు గాను 982 మార్క్స్ సాధించింది రాష్ట్రంలో మూడవ ర్యాంక్ సాధించింది. రాష్ట్ర టాపర్ కు 985 మార్క్స్ వచ్చాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరంలోను స్టేట్ లో రెండవ ర్యాంక్ సాధించింది. IAS లక్ష్యంగా తాను CEC Group ను ఎంచుకొని శ్రమిస్తున్నట్లు ఈ సందర్బంగా అనన్య తెలిపింది. అనన్య తండ్రి మున్నం శ్రవణ్ కుమార్ 25 ఏళ్లుగా సీనియర్ జర్నలిస్ట్ గా పని చేస్తున్నారు. తల్లి మున్నం రాధ గృహిణి .తమ బిడ్డ ఇంటర్ లో అనుకున్న స్థాయిలో మార్క్ లు ర్యాంక్ ను సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తమ కూతురు IAS లక్ష్యంగా కష్టపడి చదువుతొందని ,తన లక్ష్యం చేరుకొనేలా వెన్నంటి తోడ్పాటు నిస్తామని ఈ సందర్బంగా చెప్పారు.తమ పెద్ద కూతురు నిహారిక సైతం SRK విద్యసంస్తల్లొ చదివి ఇంటర్ MPC లో 950 పైగా మార్క్ లు సాధించి EAPCET లో మంచి ర్యాంక్ సాధించి నల్లమల్లారెడ్డి కాలెజిలొ ఫ్రీ సీట్ సాధించి CSE AI Group లొ B.Tech సెకండ్ ఈయర్ చదువుతోంది. తమ ఇద్దరు కూతుల్లు అనుకున్న లక్ష్యాల వైపు సాగుతుండడం పట్ల త...

నిజామాబాద్‌లో అన్నా బాహు సాఠే విగ్రహావిష్కరణ.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ఘన స్వాగతం

Image
నిజామాబాద్ నగర పర్యటనకు ఆదివారం సాయంత్రం విచ్చేసిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. చంద్రశేఖర్ కాలనీలో నూతనంగా నెలకొల్పిన అన్నా బాహు సాఠే విగ్రహాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇంచార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. మంత్రి వెంట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, నగర మేయర్ ఉమారాణి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel

నిజామాబాద్‌లో ఇంటర్ ఫలితాలు 2025-26: 66.19% ఉత్తీర్ణత.. బాలికలదే పై చేయి

Image
2025-26 విద్యా సంవత్సరానికి గాను నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి మార్చి నెలలో నిర్వహించిన వార్షిక పరీక్షలలో జనరల్ విభాగంలో రెండవ సంవత్సరం విద్యార్థులు 66.19% ఉత్తీర్ణత సాధించారు. కాగా మొదటి సంవత్సరం విద్యార్థులు 56.64% ఉత్తీర్తో సాధించారు. అలాగే జిల్లాలో ఒకేషనల్ విభాగంలో రెండవ సంవత్సరంలో 67.68% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ మొదటి సంవత్సరం లో 49.65% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో ఫిబ్రవరి, మార్చ్ నెలలో నిర్వహించిన ఇంటర్ వార్షిక పరీక్షలలో మొత్తం రెండవ సంవత్సరం జనరల్ విద్యార్థులు మొత్తం 13,876 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 9,187 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలికలు 7,606 మంది పరీక్షలకు హాజరుకాగా 5,823 మంది బాలికలు ఉత్తీర్ణత కాగా 76.56% శాతం తో బాలుర పై చేయి సాధించారు. రెండవ సంవత్సరం బాలురు 6 ,273 మంది విద్యార్థులు హాజరు కాగా వీరిలో 3,364 మంది విద్యార్థులు పాసై 53.63% సాధించారు. మొదటి సంవత్సరం జనరల్ విభాగంలో మొత్తం విద్యార్థులు 15,547 మంది పరీక్షలకు హాజరు కాగా 8,806 మంది విద్యార్థులు పాస్ కాగా 56.64% సాధించారు. వీరిలో బాలికలు 8,711 మంది ...

పెర్కిట్ మహిళా ప్రాంగణం ఘటనపై కలెక్టర్ సీరియస్.. బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశం

Image
పెర్కిట్, మహిళా ప్రాంగణంలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనను కలెక్టర్ ఇలా త్రిపాఠి తీవ్రంగా పరిగణిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ పి.ఇందిర శుక్రవారం సాయంత్రం కలెక్టర్ ను కలిసి జరిగిన సంఘటన గురించి తెలియజేశారు. గత మార్చి నెల 02 వ తేదీ నుండి 31వ తేదీ వరకు బ్యూటిషియన్ కోర్సులో బాలికలు, యువతులకు మహిళా ప్రాంగణంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ కోర్సులో శిక్షణ అందించిన తాత్కాలిక ఇన్ స్ట్రక్టర్ గా కొనసాగిన స్నేహ, బాలికలు, యువతుల ఫోటోలు, ఫోన్ నెంబర్లను సతీష్ అనే వ్యక్తికి పంపించిందని అన్నారు. దీంతో సతీష్ కొంతమంది యువతులకు ఫోన్ లు చేసి, వాట్సప్ చాటింగ్ ల ద్వారా వేధింపులకు గురి చేశాడని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. బాధిత యువతులు ఈ విషయాన్ని గురువారం రోజున తమ దృష్టికి తేగా, పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయించామని తెలిపారు. ఈ ఉదంతంపై కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. ఈ తరహా చర్యలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని, బాధ్యులైన వారిపై జిల్లా యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. పెర్కిట్ మహి...

ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు

Image
మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దుబ్బ లోని మున్నూరు కాపు కల్యాణ మండపంలో పూలే జయంతి వేడుక నిర్వహించారు. అంతకుముందు వినాయకనగర్ లోని మహాత్మ జ్యోతిబా పూలే విగ్రహానికి అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగర మేయర్ కే.ఉమారాణి, ఇంచార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, బీసీ సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలో నెలకొని ఉన్న రుగ్మతలను పారద్రోలేందుకు మహాత్మ జ్యోతిబాపూలే కొనసాగించిన కృషి అమోఘమని అన్నారు. అడుగడుగునా అవరోధాలు, అవమానాలు ఎదురైనప్పటికీ ఏమాత్రం చలించకుండా సాంఘిక దురాచారాలను దూరం చేసేందుకు పూలే ఎంతగానో శ్రమించారని గుర్తు చేశారు. అణగారిన వర్గాలు సమానత్వం సాధించాలంటే విద్య ఎంతో అవసరమని గుర్తించి వారికి విద్య అందేలా విశేషంగా కృషి చేశారని, మహిళల విద్య కోసం ప్రత్యేకంగా మొట్టమొదటి పాఠశాలను స్థాపింపజేశారని అన్నారు. ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ప్రభుత్వం బీ.సీ గురుకులాలకు జ...

అన్నా నన్ను దేవుడే పంపిండు.. -జీవన్ రెడ్డి భావోద్వేగం

Image
ఎర్రవల్లి, కేసీఆర్ ను కలిసిన సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు ఆయనను కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావుతో ఎర్రవెల్లి నివాసంలో, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి శుక్రవారం నాడు మర్యాదపూర్వక భేటీ అయ్యారు. నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్. రమణ, ఎమ్మెల్యే డా. కె. సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు. జీవన్ రెడ్డి గారితో పాటు వచ్చిన వారిలో వారి కుమారులు, జగిత్యాల మాజీ జడ్పీ చైర్ పర్సన్ వసంత సురేశ్ దంపతులు తదితరులు ఉన్నారు. నిరంతరం తన నియోజకవర్గం, జిల్లా ప్రజలు, రైతుల గురించి ఆలోచన చేసే...

నిజామాబాద్ సెంట్రల్ జైలులో ఖైదీలకు ఎయిడ్స్, టిబి పరీక్షలు

Image
నిజామాబాద్, ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ రోజు సెంట్రల్ జైలు లో దాదాపు 640 మంది ఖైదీలకు HIV/syphilis/hepatitis B &C &TB పరీక్షలు నిర్వహించారు.,అలాగే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి డాక్టర్ల సహకారంతో కంటి పరీక్షలు, స్కిన్ ,డెంటల్ , గైనిక్ ,గుండెకు సంబంధించిన పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యా ఆరోగ్య అధికారి డాక్టర్ బి రాజశ్రీ, జిల్లా టిబి నియంత్రణ అధికారి & పోగ్రామ్ ఆఫీసర్ ఎయిడ్స్ అండ్ లెప్రసీ డాక్టర్ దేవి నాగేశ్వరి, NVHCP నోడల్ ఆఫీసర్ డాక్టర్ వెంకటేష్ , మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సామ్రాట్ యాదవ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అవంతి, డి హెచ్ ఈ ఘన్ పూర్ వెంకటేశ్వర్ , ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సిబ్బంది, జిల్లా టిబి నియంత్రణ సిబ్బంది పాల్గొన్నారు. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel

టైగర్ నరేంద్ర 12వ వర్ధంతి – బీజేపీ నేతల ఘన నివాళులు

Image
నిజామాబాద్, హిందుత్వమే ఊపిరిగా, కాషాయమే ప్రాణంగా, పాతబస్తీ అరాచక శక్తుల పాలిట సింహస్వప్నమైన మన తెలంగాణ ముద్దుబిడ్డ స్వర్గీయ టైగర్ నరేంద్ర.. అయోధ్య ఉద్యమంలో కరసేవకులకు నాయకత్వం వహించి లాఠీ దెబ్బలు తిన్న చరిత్ర . భారతీయ జనసంఘ్ ఇందూరు జిల్లా ప్రచారక్గా పని చేశారు. మహనీయులు ఎంతో మంది కార్యకర్తలను జాతీయవాదం కోసం, ఈదేశం కోసం, ధర్మం కోసం నిర్మాణం చేసిన టైగర్ అలె నరేంద్ర భాయ్ సాబ్ 12 వర్ధంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామి యాదవ్, ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధమల ఆనంద్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి పర్సని వెంకటేష్ గారితో కలిసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఒబిసి మోర్చా ఐటీ సెల్ కన్వీనర్ రాజ్ కుమార్ , కరుణ్ తోపాటు ఓబిసి మోర్చా నాయకులు పాల్గొన్నారు మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel

నిజామాబాద్ కాంగ్రెస్ కార్యాలయంలో రచ్చ – నేతల మధ్య వాగ్వాదం, సస్పెన్షన్లు

Image
కాంగ్రెస్​ పార్టీ నిజామాబాద్​ జిల్లా కార్యాలయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. డీసీసీ అధ్యక్షుడు నగేశ్​రెడ్డి, ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్​ మధ్య రచ్చ రచ్చ జరిగింది. కాంగ్రెస్​ పార్టీ నిజామాబాద్​ జిల్లా కార్యాలయంలో నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. డీసీసీ అధ్యక్షుడు నగేశ్​రెడ్డి, ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్​ మధ్య కొట్లాట జరిగింది. రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్​​ ఛైర్మన్​, డీసీసీ మాజీ అధ్యక్షుడు మానాల మోహన్​రెడ్డి పుట్టిన రోజు వేడుకలను బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. వేణురాజ్​ ఆధ్వర్యంలో కార్యకర్తలు కేక్ చేయడానికి అంతా సిద్ధం చేశారు. ఇంతలోనే అయితే వారిని జిల్లా అధ్యక్షుడు నగేశ్​రెడ్డి, బర్త్డే వేడుకలను నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. జిల్లా అధ్యక్షుడికి, వేణురాజ్​కు మధ్య మాటల యుద్ధం నడిచింది. ఒకరిపై ఒకరు విచక్షణ మరిచి ఒక ప్రజా ప్రతినిధులం అని కూడా మర్చిపోయి ఓ స్థాయిలో ఒకరిని ఒకరు కాలర్లు పట్టుకొని కొట్టుకొనే వరకు ఘటన వెళ్ళింది. అయితే మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డికి ప్రస...

నిజామాబాద్‌లో భారీ సైబర్ మోసం బట్టబయలు – ₹152 కోట్ల లావాదేవీలు, 9 మంది అరెస్ట్ - శభాష్ CP సాయి చైతన్య

Image
నిజామాబాద్ జిల్లాలో ఇటీవల పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య సూచనల మేరకు ప్రత్యేక ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్‌ను IV టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సతీష్ , సైబర్ క్రైమ్ పోలీస్ సిబ్బంది సహకారంతో విజయవంతంగా నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా మొత్తం 9 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు.. గతంలో కూడా ఈ కేసుకు సంబంధించి 7 మందిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా, కర్ణాటక బ్యాంక్‌లో తప్పుడు ధ్రువపత్రాలు ఉపయోగించి అక్రమంగా కరెంట్ అకౌంట్లు ఓపెన్ చేసి, వాటిని మధ్యవర్తుల ద్వారా సైబర్ మోసగాళ్లకు విక్రయిస్తున్న నెట్‌వర్క్‌ను పోలీసులు వెలికితీశారు. ఈ నిందితులు ఫేక్ డాక్యుమెంట్స్‌తో బిజినెస్ అకౌంట్లు తెరిచి, వాటిని సైబర్ నేరాలకు ఉపయోగించే విధంగా అందించినట్లు గుర్తించబడింది. ఈ అకౌంట్ల ద్వారా కేవలం మూడు నెలల వ్యవధిలో సుమారు రూ. 152 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. మరికొంతమంది వ్యక్తులు ఇందులో ప్రమేయం ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. వారిని త్వరలో గుర...

నిజామాబాద్‌లో కిసాన్ న్యాయ్ సత్యాగ్రహం – కాంగ్రెస్ నేతల పిలుపు

Image
నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ కార్యక్రమం జరిగింది.ముఖ్య అతిథిగా పాల్గొన్న నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఊర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్ , రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీ సభ్యులు రామకృష్ణ , నగర మేయర్ ఉమారాణి , నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ , నూడా చైర్మన్ కేశ వేణు ,జిల్లా కాంగ్రెస్ పార్టీ కోశాధికారి భక్తవత్సలం , జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శరత్ , గాదారి గోపి జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గౌడ్ ,కార్పొరేటర్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel

కల్తీ పెట్రోల్ టెస్ట్ పేపర్లు ఇవ్వరిక్కడ...

Image
మాయ చేసి మత్మరించడంలో ఘనాపాటీలు ఇందూరు పెట్రోల్ బంక్ యజమానులు.. పెట్రోల్ క్వాలిటీ నిర్దారణ కోసం వినియోగ దారులకు ఉన్న చట్టబద్ధమైన హక్కును బాజాప్తాగా కాలరాస్తున్నారు. ప్రతి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ నాణ్యత తాలూకు పరీక్ష కోసం వినియోగదారులకు ప్రీ పెట్రోల్ క్వాలిటీ టెస్టు పేపరును అందుబాటులో ఉంచాలి. ఈ విషయం వినియోగదారులకు తెలిసిన దాఖలాలు లేవు. ఒకరిద్దరు వినియోగదారులకు తెలిసి క్వాలిటీ టెస్టు పేపర్ అడిగినా ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు పెట్రోల్ బంక్ యజమానులు.. అచ్చంగా అలాంటి చేదు అనుభవం మన నిజామాబాద్ టీమ్ కు ఎదురైంది. నిజామాబాద్ నగరంలోని వంశీ హోటల్ ఎదురుగా ఉన్న ఇండియన్ ఆయిల్ బంక్ లో పెట్రోల్ టెస్టు పేపర్ అడిగితే తిక్క తిక్కగా వ్యవహరించారు . టెస్టు పేపర్ ఉండదని ఒకసారి.. వినియోగదారులకు ఇచ్చేది కాదని బుకాయించాడు బంక్ ఇంచార్జ్.టెస్ట్ పేపర్ అడిగితే వివ్వవల్సిందే అని DSO చెప్పారని అన్న వెంటనే.. అయితే DSO నే అడగండని తిక్క సమాధానం ఇచ్చారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం 1986 ప్రకారం టెస్టు పేపర్ ఇవ్వాల్సిందే అని మన నిజామాబాద్ పట్టుబట్టగా చేసేది ఏమిలేక అయిష్టంగా పేపర్ ను చేతిలో పెట్టారు ...

BJP కార్పొరేటర్ వసూళ్లపై పోరాటం

Image
నిజామాబాద్, ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ మఠం పవన్ రాజకీయ కక్ష సాధింపుతో ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అసోసియేషన్ పై పుకార్లు పుట్టిస్తూ జిల్లా కలెక్టర్ ,మున్సిపల్ కమిషనర్ లకి ఫిర్యాదు చేయడం అత్యంత హేయమైన చర్య అని ఆర్ ఆర్ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.... మున్సిపల్ ఎన్నికలలో గెలుపొందిన నిజామాబాద్ సౌత్ డివిజన్ల కార్పొరేటర్లకు సన్మానం చేయాలని సదుద్దేశంతో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ భవనము మరమ్మత్తులు జరుగుతుండడం వలన స్థానికంగా ఉన్న వాటర్ ప్లాంట్ లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వాటర్ ప్లాంట్ ను డాక్టర్ గ్రూప్ వారు 15 సంవత్సరములు అద్దెకు తీసుకున్నారని , ఇంకా ఏడు సంవత్సరాల కాల పరిమితి మిగిలి ఉందన్నారు. తాము అనుమతితో సన్మాన కార్యక్రమం నిర్వహించామని, సన్మాన కార్యక్రమంలో మఠం పవన్ ని కూడా సన్మానించామన్నారు. కానీ తాను రాజకీయ బురద చల్లడం కోసం వాటర్ ప్లాంట్ ను కబ్జా చేసేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కార్పొరేటర్ గా ఎ...