Posts

Showing posts with the label Mana Nizamabad

బీజేపీకి జెన్ జీ ఔట్ ఆఫ్ సిలబస్? యువత ఆందోళనలపై ప్రత్యేక విశ్లేషణ

Image
బీజేపీకీ జెన్ జీ పూర్తిగా ఔట్ ఆఫ్ సిలబస్! (* కొనతం దిలీప్) ఈ దేశంలో ఎవరు తమ హక్కుల కోసం గొంతెత్తినా వారిని దేశద్రోహులు అని ముద్రవేయడం బీజేపీ ఇన్నాళ్లూ వాడిన ఎత్తుగడ. కానీ ఆ ఎత్తుగడ ఇక పనిచేయదు అని ఢిల్లీలో జెన్ జీ యువత చేస్తున్న ఆందోళనలు నిరూపిస్తున్నాయి. ఇదివరకు సీఏఏ ఆందోళనల్లో రైతుల ఆందోళనల్లో బీజేపీ చాలా అలవోకగా వీరిని వేర్పాటువాదులు, మిలిటెంట్లు, దేశద్రోహులు అని ముద్రవేసింది. వారి ఐటీ సెల్ సహాయంతో సామాన్య ప్రజల్లో ఇదే విషయం మీద ప్రాపగాండా చేయగలిగింది కానీ నీట్ పేపర్ లీక్ అంశంతో రాజుకున్న జెన్ జీ ఆందోళనలు అలా కొట్టివేయడానికి వీళ్లేనివి ఎందుకంటే వీటిలో పాల్గొంటున్నది ఎక్కువగా మధ్యతరగతి భద్రజీవుల పిల్లలు. మరీ ముఖ్యంగా ఉత్తర భారత దేశం నుండే ఎక్కువమంది పిల్లలు ఉన్నారు. ఈ రెండు సెక్షన్లలో సాంప్రదాయకంగా బీజేపీ మద్ధతుదారులు గణనీయ సంఖ్యలో ఉంటారు. అటువంటి సెక్షన్ల నుండే ఇప్పుడు బీజేపీ మీద, ప్రధాని మోదీ నాయకత్వం మీద తీవ్ర వ్యతిరేకత వస్తోంది. గత 2-3 రోజులుగా ఆ ముక్కుపచ్చలారని పిల్లల మీద పాశవికంగా అణచివేతను ప్రయోగిస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద దేశమంతటా ఆగ్రహజ్వాలలు ఎగుస్తున్నాయి. యువతీయువ...

"సచ్చిపోబుద్ధి అవుతుంది.." SIR సర్వేలో బీఎల్‌వోల ఆవేదన.. కమిషనర్ జోక్యం చేసుకోవాలంటూ విజ్ఞప్తి

Image
*హలో.. బలే* *సచ్చిపోబుద్ధి అవుతుంది..* *బి ఎల్ ఓ ల భావోద్వేగం.... కమిషనర్ గారు జర కన్నేయండి* వాయిస్ ఓవర్... హలో హలో మీ పేరు ఇదేనా అండి... నేను మీ బి ఎల్ వో ని మీ డివిజన్ పరిధిలో అంగన్వాడి ఫోన్ చేస్తున్నామండి. దయచేసి ఇక్కడికి వచ్చి సర్ తీసుకోండి.. నేను నేను వేరే చోట ఉన్నాను అనేది ప్రతి సమాధానం. పర్వాలేదండి మీ దగ్గరలో ఉన్న ఏదైనా చౌరస్తాకు రండి నేను ఇస్తా అనేది బి ఎల్ ఓ ఎదురు జవాబు. దీన్ని యవ్వ చచ్చిపోవాలనిపిస్తుంది. అనేది నిజాయితీ బిఎల్ఓ ల భావోద్వేగం. ఎలాగోలా ప్రత్యుత్తమరాలు నడుస్తున్నాయి. ఏదోరకంగా సర్ పాo ను అందుకున్న ఓటర్లు జాబితా అంతంత మాత్రమే ఇంకా కేవలం నాలుగు రోజులే కానీ చిక్కుముడని సమస్యలు లెక్కలేనివి. సదరు ఇంటి యజమాని లో అంతా అయోమయోమే.. చదువుకున్న వాడికి, చదువు లేని వాడికి తేడా ఏమీ లేదు. సర్ ఫారం లు నింపడం అన్ని డాలర్ల ప్రశ్నార్థకమే... ఇంకేముంది సర్ పత్రం అందుకున్న దారుడు హడావిడిగా పరిగెత్తి మీసేవ, బాగా చదువుకున్న వారి చుట్టూ పరిగెడుతూ నానా టంటలు పడుతూ ఉంటారనేది నేటి నిజం. ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ కి తెలిసిన, ఉన్నత అధికార యంత్రాంగానికి తెలిసిన ఏమీ తెలియనట్లు ఉండడం కాకపోతే గ్రామ...

ఏనుగు దంతాలు ఊడినయ్.. శ్రేణులు ఆగం అయ్యినయ్

Image
(జమాల్పూర్ గణేష్ /మూల్పూరు రాజేంద్ర బాబు)   ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో వెలిగిన ఏనుగు రవీందర్ రెడ్డి ప్రస్తుతం గంజిలో పడ్డ ఈగ చందంగా మారింది. "ఏనుగు దంతాలు ఊడినయ్-శ్రేణులు అయోమయంలో పడినయ్" అంటూ రాజకీయ ప్రత్యర్ధులు రాగాలు తీస్తున్నారు.. ఈ విచిత్ర అరుదైన రాజకీయ పరిస్థితులపై మన నిజామాబాద్ అందిస్తున్న స్పెషల్ ఫోకస్ ఇది.. ఏనుగు రవీందర్ రెడ్డి TRS రాజకీయ ప్రస్థానంలో ఒక వెలుగు వెలిగారు. ఆ పార్టీ నుంచి ఎల్లారెడ్డి సీనియర్ MLA గా తిరుగు లేని ఆధిపత్యం చెలాయించారు..ఆ ఊపుతోనే ఈటెల రాజేందర్ తో బీజేపీలో చేరి హల్చల్ చేశారు.. అక్కడ వర్కవుట్ కాక కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని బాన్సువాడ బాద్షా కావాలని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అప్పటి BRS సిట్టింగ్ MLA పోచారం శ్రీనివాస్ రెడ్డికి చుక్కలు చూపించారు.. తానోడినా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పోచారం కు చెక్ పెట్టారు.. బాన్సువాడ సెగ్మెంట్ లో ఇసుక పోయింట్స్ కంట్రోల్ లోకి తెచ్చుకుని కల్లం లో కుప్పలుగా ఎగబోసుకున్నారు.. పోలీస్, రెవెన్యూ తో పాటు అధికారులను చెప్పుచేతల్లో పెట్టుకుని పోచారం శ్రీనివాసరెడ్డి కి ఊపిరి ఆడనీయలేదు ఏనుగు రవీందర్ రెడ్డి.. ఈ పరిస్థ...

బీజేపీ వ్యతిరేక నినాదాల కేసు కొట్టివేత.. బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Image
ముంబైలో ఒక సామాన్యుడు బీజేపీ డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ డౌన్ అన్నందుకు నమోదైన కేసును కొట్టివేస్తూ బాంబే హైకోర్టు జస్టిస్ మాధవ్ జామ్దార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నినాదాలు చేసినందుకు ఒక వ్యక్తిపై పోలీసులు బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేయడాన్ని న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. బీజేపీ ప్రభుత్వం, అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేసినందుకు ఒక సామాన్యుడిపై అక్రమ కేసులు నమోదు చేయడం, అతడిని బహిష్కరించడం వంటి చర్యలను కోర్టు రద్దు చేసింది. విచారణ సందర్భంగా జస్టిస్ మాధవ్ జామ్దార్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. నీట్ పేపర్ లీకేజీలు, విద్యార్థుల ఆత్మహత్యలు, జరుగుతుంటే పౌరులపై వరుస కేసులు పెట్టి అణచివేయడం పద్ధతి కాదని ఆయన మండిపడ్డారు. నిరసనను అణచివేయడం అధికార సాధన కాదని, ప్రజలు ప్రశ్నలు అడగడం నేరం కాదని, అది పౌరుడి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. " పౌరులందరినీ మీరు ప్రభుత్వానికి బానిసలుగా మారుస్తున్నారా? నినాదం చేస్తే కేసులు పెడతారా?" అంటూ ఆయన పోలీసులను నిలదీశారు. కళ్ల ముందే విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోని అధికార యంత్రాంగం, రాజకీయ నినాదాల మీదనే కక్...

కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

Image
* కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ * ........... టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య ఆయనకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని, రైతులు, యువత, మహిళలు సంతోషంగా జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel

మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ బిగ్ ఫైట్.. పూజల్లో తరిచిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Image
(జమాల్పూర్ గణేష్ /మూల్పూరు రాజేంద్ర బాబు) హైదరాబాద్, జులై 2; తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్లు ఉంది రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారం.. అచ్చం ఈ సామెతకు సరిపోయే రాజకీయ సన్నివేశాలు హైదరాబాద్ గడ్డ మీద ఆవిష్కృతం అయ్యాయి. వివరాల్లోకి వెళితే... ప్రభుత్వం ,ప్రధాన ప్రతిపక్షమైన BRS నడుమ గురువారం హైదరాబాద్ లో బిగ్ ఫైట్ జరిగింది.. రేవంత్ రెడ్డి ఘన కార్యాలను తెలంగాణ భవన్ కు వచ్చి చెబుతా అని మంత్రి జూపల్లి సవాల్ విసిరారు. దానికి స్పందించిన కేటీఆర్, హరీష్ రావు ఇన్ టైంలో వచ్చి కూర్చున్నారు.అదే టైంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి బస్తీమే సవాల్ అంటూ గన్ పార్క్ అమర వీరులస్తూపం వద్ద బహిరంగ చర్చ కోసం మకాం వేశారు.. అక్కడికి చేరుకునేందుకు మొదట హరీష్ రావు తెలంగాణ భవన్ బయట పోలీసులతో పెద్ద యుద్ధమే చేశారు. తోపులాట,పోలీసుల బల ప్రయోగంతో హరీష్ కింద పడి పోయారు.. ఈ నాటకీయ రాజకీయ పరిణామాలు గురువారం రాష్ట్ర వ్యాపితంగా హల్చల్ రేపాయి. సీన్ కట్ చేస్తే.. ఈ మొత్తం వ్యవహారంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆంటీ ముట్టనట్లు ఉన్నారు. ఎక్కడా కనపడలేదు.. పల్లెత్తు మాట్లాడలేదు..రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో మం...

నో టికెట్ గ్యారెంటీ..! గేరు మార్చిన బీఆర్ఎస్.. మాజీ ఎమ్మెల్యేల్లో టెన్షన్

Image
(జమాల్పూర్ గణేష్ /మూల్పూరు రాజేంద్ర బాబు) కారు పార్టీ గేరు మార్చింది.. ఆ స్పీడుకు MLA టికెట్ల ఆశావాహుల కండ్లు బైర్లు కమ్ముతున్నాయి.. రామన్న, హరిషన్న చుట్టూ ప్రదక్షిణ చేసి.. మస్క పాలిస్ తో టికెట్ కొట్టేయొచ్చనే ఆశలు ఆడియాసలే నన్న అంచనా కొచ్చారు BRS మాజీ MLA లు..ఇంత కాలం పట్న వాసానికి మరిగిన వీళ్ళు అబ్బా మళ్ళీ ఊరు బాట పట్టాలా అంటూ ఉసూరు మంటున్నారు..10ఏళ్ళు అధికారం చెలాయించి, సుఖానికి మరిగిన మాజీ MLA లు ఇప్పుడిపుడే పల్లె బాటను వెతుక్కుంటున్నరు. ఎవరికి వారు విధిగా ఓడిన చోటే విజయానికి మెట్లు వేసుకుంటారేనని అధిష్ఠానం రెండేళ్లు సమయం ఇచ్చి చూసింది.. అయినా మాజీలు పట్నం వీడలేదు.. అందుకే బూతు లెవల్ లో పార్టీ నిర్మాణం, సర్ ప్రోగ్రామ్ ను జోడించి అధిష్టానమే కార్యాచరణ ఇచ్చింది. దీనితో తప్పని పరిస్థితుల్లో మాజీ MLA లు నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు పూర్తి చేశారు.మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలో మాజీలు టీమ్ గా ఏర్పడి పర్యటిస్తున్నారు.. అయినా వారిని టికెట్ నో గ్యారంటీ అనే మాట నిద్రపోనిస్తా లేదు. "గతాన్ని చూసి టికెట్లు ఇచ్చేది లేదు..ఎంత సీనియర్..ఎన్ని టర్మ్ లు MLA గా పని చేసారు అనేది ల...

సౌమ్య కేసులో సంచలన ట్విస్ట్..! గంజాయి స్మగ్లర్లను తప్పించారనే ఆరోపణలు.. లీకైన వీడియోలో కొత్త విషయాలు

Image
( జమాల్పూర్ గణేష్, మూల్పూరు రాజేంద్ర బాబు) ... గంజాయి స్మగ్లింగ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే ప్రయత్నంలో ఆబ్కారీ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందిన సంఘటనకు సంబంధించిన సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చే వీడియో మన నిజామాబాద్ చేతికి చిక్కింది.. జనవరిలో నిజామాబాద్ సమీపంలోని మాధవనగరం ప్రధాన రహదారి మీద గంజాయి స్మగ్లర్ లను పట్టుకునే ప్రయత్నంలో సౌమ్య మృతి చెందిన విషయం తెలిసిందే.. స్పాట్లో స్మగ్లర్లు ఉపయోగించిన కారు గుద్దిన సంఘటనలో ఆమె మృతి చెందింది.. ఆరు నెలల కిందట జరిగిన ఈ సంఘటనలో అసలు దోషులను తప్పించారనే ఆరోపణలు ఉన్నాయి.. నిర్మల్,నిజామాబాద్ కు చెందిన గంజాయి స్మగ్లర్లు ఆ రోజు స్పాట్ లో ఉన్నా.. కొందరిని ఆబ్కారీ అధికారులు తప్పించారని ఇద్దరు నిందితులు ఆక్రోశం వెళ్లగక్కిన వీడియో సౌమ్య కేసు వెనుక దాగివున్న డొల్లతనాన్ని బహిర్గతం చేసింది. ఆబ్కారీ SHO స్వప్న ఆఫీసు బ్యారక్ లో నిందితులు అధికారులతో వాదనకు దిగిన సందర్భంగా లేవనెత్తిన ప్రశ్నలు నిజామాబాద్ నిందితులను సౌమ్య కేసునుంచి తప్పించిన తీరును తేటతెల్లం చేస్తోంది.. నిందితుల్లో ఒకరు గాజు సీసాను పగులగొట్టి కొడుపును చీల్చుకునే ప్రయత్నం వల్ల నిందితు...

ఆబ్కారీలో అంతా అవినీతే..? అక్రమ బదిలీలు, ముడుపుల ఆరోపణలు.. ACB నజర్‌లో నిజామాబాద్ ఆబ్కారీ శాఖ!

Image
నిజామాబాద్ ఆబ్కారీ శాఖను అవినీతి జబ్బు పట్టుకుంది. చట్టాలను అమలు చేయాల్సిన అధికారులే పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయి అంచావతారులుగా మారారు.ఫలితమే సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కటకటాలు లెక్కపెడుతున్నారు.. జిల్లా వ్యాపితంగా ప్రాణాOతక రసాయనాలు క్లోరోఫామ్,డైజోఫామ్ తదితర రసాయనిక పదార్థాలను కలిపిన కల్తీ కల్లు ఏరులై పారుతోంది..లైసెన్సులు లేని కల్లుదుకాణాలు నడుస్తున్నా చర్యలు లేవు.బెల్టుషాపులు గల్లీ గల్లీల్లో వెలిసాయి. వైన్ షాపులు,బారు షాపుల్లో తెల్లవారు జామున మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.. అయినా ఆబ్కారీ శాఖ అధికారులు లంచాలకు మరిగి చర్యలు తీసుకోవడం లేదు..నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న మద్యం వ్యాపారానికి కొమ్ముకాయడం ద్వారా ప్రతినెలా కోటి రూపాయలు ముడుపులు అందుతున్నాయని అంచనా ఉంది.. వీటిని పంచుకోవడం లోనూ అవినీతి అధికారులు దర్జాగా వ్యవహరిస్తున్నారు. ప్రతినెలా సమీక్షల పేరిట ఏదో ఒక గెస్ట్ హౌస్ లో జరుపుకునే దావత్ లోనే.. అధికారుల పొజిషన్ లెక్కన కట్టిపెట్టిన నోట్ల ముల్లెలు చేతులు మారుతున్నాయని ఆబ్కారీ శాఖలోనే ప్రచారం జరుగుతోంది.మూటల పంపిణీలో నిజామాబాద్ కేంద్రంగా పనిచేస్తున...

వర్షపు నీటి ప్రతి బొట్టు అమూల్యం.. భూగర్భ జలాల పరిరక్షణకు ఇంకుడు గుంటలే పరిష్కారం: జిల్లా భూగర్భ జల శాఖ అధికారి

Image
కన్నీరు ఓ బావోద్వాగల సర్వజనాలకు అది మనిషి అయిన, జంతువైన, పక్షి అయిన శ్వాస నిశ్వాస గల ఏ ప్రాణి అయినా సరే.., ఇది ఓ ప్రక్రియ ఇదో ప్రాముఖ్యత గల అంశం దీనికి సమాంతరం ఏదో కాదు అని గత కొన్ని దశాబ్దాలుగా అనుకునేవాళ్లం కానీ ఇప్పుడు ఈ కన్నీటి చుక్కల కంటే కొన్ని బిలియన్, బ్రిలియన్ అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత అంశం ఏమిటో తెలుసా అది వర్షపు నీటి బొట్టు అదే మేఘావృతమై ఆకాశం నుంచి కురిచే వర్షం ఎన్నో మధురానుభూతుల్ని ఇస్తుంది. అలాగే నష్టానుసారాన్ని అనుసరిస్తుంది ప్రకృతిని ప్రేమిస్తే ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తారు. అది ప్రకృతి పగబడితే ద్వేషిస్తుంది. ఈ నీటి దార సాగునీరుకు అనే అంశాన్ని ముమ్మాటికి మరిచారు మూర్ఖపు ప్రజానికం. దీనికి ప్రత్యామ్నాయం ఇంటింటికి ఇంకు ఇంకుడు గుంటలే అంటున్నారు. భూగర్భ జల శాఖ అధికారులు.... ఇంతకీ ప్రజల ఆలోచనలు మార్పు రాకపోతే భవిష్యత్తు అధోగతే అంటున్నారు జిల్లా అధికారి బాబు గారు వారి మాటల్లోనే భూగర్భ జలాలపై భూమిలో ఇంకిపోతున్న నీటిపై మన నిజామాబాద్ తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడిన ఆయన మాటలు చూద్దాం మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అ...

హీరో విజయ్ కిరూట్ క్లియర్. తమిళనాడులో సంబరాలు

Image
తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మలుపులు చోటు చేసుకుంటున్నాయి. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళనాడు వెట్రి కళగం, ప్రభుత్వ ఏర్పాటు దిశగా కీలక అడుగులు వేస్తోంది. తాజా పరిణామాల ప్రకారం, లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ మద్దతు తెలపడంతో విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి మార్గం సుగమమైంది. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సీపీఐ ఎం,వర్కింగ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. విజయ్ పార్టీకి పూర్తి మద్దతు ఇవ్వాలని నిర్ణయించి నట్లు సమాచారం. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర కమిటీ అధికారికంగా ఆమోదించాల్సి ఉంది. సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలకు కలిపి మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు ఉండగా, వీరంతా టీవీకేకు మద్దతు తెలపడం విజయ్ బలాన్ని పెంచింది. తమిళనాడు అసెంబ్లీ లో మెజారిటీ మార్కు ను అందుకోవడానికి ఈ మద్దతు ఎంతో కీలకంగా మారింది. మరోవైపు, భారతీయ జనతా పార్టీ,ఈ రాజకీ య చదరంగంలో తటస్థంగా ఉండాలని నిర్ణయించుకుంది. తాము ఏ పార్టీకి ఓటు వేయమని, ప్రభుత్వ ఏర్పాటులో ప్రత్యక్షంగా పాల్గొనే ఉద్దేశ్యం లేదని బీజేపీ రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ జారీ చేసిన ఈ ప్రకటనలో, తమిళనాడు ప్రజల సం...

కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదు - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

Image
రాష్ట్రంలో రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు ఓటు వేసే అవకాశమే లేదని, తిరిగి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనీసం 20 సంవత్సరాల పాటు అధికారంలోకి రావడం కల్లని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్గాలను మోసం చేసిందని, దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి అరాచకాలు, కుంభకోణాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈరోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలతో ఒక సుదీర్ఘ సమీక్ష సమావేశాన్ని కేటీఆర్ గారు నంది నగర్ లోని తన నివాసంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు పార్టీని బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యాచరణ పైన దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి అడ్డగోలుగా పెరిగిపోయిందని, అన్ని అంశాల్లోనూ కాంగ్రెస్ పార్టీ కమీషన్లు, కాసుల కక్కుర్తి కోసమే చూస్తున్నదని కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లాలో భూములతో పాటు అనేక మైనింగ్ కుంభకోణాలకు కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులే స్వయంగా పాల్పడుతున్న పరిస్థితి నెలకొన్నదన్నారు. కాంగ...

50 కోట్ల భూమి.. 5 లక్షలకే.. -కాంగ్రెస్ కాయ్ రాజా కాయ్

Image
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ లేదు అనేది పాత సామెత. అభినవ రాజులు తలుచుకుంటే సర్కారు భూములు చిటికెలో చెర లోకి రావడమనేది కొత్త నానుడి. రాజకీయ పోకడతో రాజులుగా వర్ధిల్లుతున్న వారు అనుకున్నదే తడవుగా అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూమి అధికార కాంగ్రెస్ కు సొంతం అయ్యింది..1965 లో అప్పటి జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు మాధవరావు నేతృత్వంలో కొంచెం అటు ఇటుగా 3000 గజాలకు పైగా కాంగ్రెస్ పార్టీ సొంతం అయ్యింది. నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా కమర్షియల్ ప్రాపర్టీ అయ్యింది ఇప్పుడు..1980 లో దుకాణ సముదాయం నిర్మించారు. కాంగ్రెస్ పార్టీకి సొంతంగా జిల్లా ఆఫీసు...దాని నిర్వహణ ఖర్చులు పోను ఆదాయాన్ని సమకూర్చే కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది కాంగ్రెస్ పార్టీకి.. ఈ ప్రాపర్టీ విలువ కనీసం 40 కోట్ల పైమాటే.. ఇట్లా నగరం నడి బొడ్డులో సొంతంగా పార్టీ ఆఫీసు ఉన్నప్పటికీ.. ఇదే ఆఫీసు ఎదురుగా R&B స్థలంపై కాంగ్రెస్ పెద్దల కన్ను పడింది. గజం లక్షన్నర విలువ ఉన్న ఈ భూమి విలువ 50 నుంచి 60 కోట్లు ఉంది..4 లక్షల పైచిలుకు నామినల్ ధర చెల్లించి R&B శాఖకు చెందిన ఎకరం భూమిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి పొందింది. PCC చీఫ్ మహేష్ కుమార్ గ...

బీఆర్ఎస్‌ను వీడను.. బీజేపీలో చేరను: జీవన్ రెడ్డి క్లారిటీ

Image
తాను బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకి మారుతున్నానని కొన్ని వార్తా సంస్థల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. తాను జీవితంలో ఎప్పుడూ బీ ఆర్ఎస్ ను వీడను, బీజేపీతో సహా మరే పార్టీలో చేరను అని ఆయన స్పష్టం చేశారు. రాజకీయంగా తనను ఎదుర్కొనే దమ్ము లేను కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఒక పథకం ప్రకారం సాగిస్తున్న కుట్రలో భాగమే తనపై ఈ దుష్ప్రచారం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కంఠంలో ప్రాణమున్నంత వరకూ కేసీఆర్ బాట వీడనని, చివరి వరకు గులాబీ నీడలోనే రాజకీయాలు చేస్తానని ఆయన అన్నారు. తాను రాజకీయ ఓనమాలు దిద్దుకున్న పార్టీ బీఆర్ఎస్ అని, తన రాజకీయ గురువు, ఆరాధ్య దైవం కేసీఆర్ అని జీవన్ రెడ్డి తెలిపారు. తాను బీజేపీలో చేరడానికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీని ఢిల్లీలో కలిసినట్టు కట్టుకథలు ప్రచారం చేసురున్నారని ఆయన మండిపడ్డారు. నిజానికి తాను ఏ కేంద్ర మంత్రిని కలవలేదని, తాను హైదరాబాద్ లోనే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి పేక్ ప్రచారాలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంట...

నిజామాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చెక్: ఆ రెండు ‘ఫ్లైఓవర్లు’ నిర్మిస్తేనే నగరానికి మహర్దశ!

Image
కొండలు, గుట్టలు, పచ్చిక బయళ్లతో అలరారుతున్న మన నిజామాబాద్ జిల్లా ప్రకృతి సౌందర్యానికి కేరాఫ్ అడ్రస్. ఇక్కడి మనుషుల ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు వెలకట్టలేనివి. కష్టనష్టాల్లో ఒకరికొకరు తోడుగా నిలుస్తూ, ఆదర్శవంతమైన జీవనశైలితో ముందుకు సాగుతున్న మన నగరం గర్వించదగ్గ ఎన్నో విశేషాలకు నిలయం. అయితే, ఇంతటి అందమైన మన నగరానికి ఇప్పుడు ఒక పెద్ద సమస్య సవాలుగా మారింది. అదే ట్రాఫిక్ కష్టాలు. స్తంభిస్తున్న నగరం.. ఇబ్బందుల్లో జనం! జిల్లా కేంద్రంలో రోజురోజుకూ వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వేలాది కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు, బస్సులు, భారీ లారీలు.. ఇలా ఒకటేమిటి, ప్రతి రోజూ వేల సంఖ్యలో వాహనాలు నగర వీధుల్లో రాకపోకలు సాగిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ గంటల తరబడి స్తంభించిపోతుండటంతో సామాన్య ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిష్కారం ఒక్కటే: రెండు కీలక ఫ్లైఓవర్ల నిర్మాణం నగరంలో నెలకొన్న ఈ ట్రాఫిక్ జటిల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ సమస్యకు ప్రధానంగా రెండే రెండు పరిష్కార మార్గాలు ఉన్నాయని నిపుణులు మరియు స్థానికులు అ...

ప్రజావాణి పేదలకు భారమా?.. కలెక్టరేట్ చేరాలంటే ₹100 ఖర్చు తప్పదా!

Image
ప్రజావాణి.. పేదవాడికి వెతలేనా? ₹100 ఖర్చు చేస్తే తప్ప కలెక్టరేట్ గడప తొక్కలేని దుస్థితి! "మన నిజామాబాద్" ప్రత్యేక కథనం: జిల్లా నలుమూలల నుంచి ఆశతో వస్తున్న అర్జీదారులకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. తెల్లవారుజామునే నిద్రలేచి, ఎక్కడో అప్పు తెచ్చిన వంద రూపాయలు ఆటోలకే పోస్తుంటే.. తీరని సమస్యల వేదన సామాన్యుడిని కుంగదీస్తోంది. నిరాశ పరుస్తున్న 'పేపర్' రాజకీయం: కలెక్టర్ గారిని కలిసి తమ గోడు చెప్పుకుందామని వస్తే, కేవలం ఒక కాగితం కింది స్థాయి అధికారికి ఇచ్చి వెనుతిరగాల్సి రావడం ఒక 'నగ్న సత్యం'. కొత్తగా వచ్చిన మీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలకు, క్షేత్రస్థాయి అధికారుల అలసత్వం వల్ల నిరాశే ఎదురవుతోంది. అధికారుల అలసత్వం - మీకో పాపం: కింద స్థాయి సిబ్బంది చేసే నిర్లక్ష్యం అంతిమంగా జిల్లా యంత్రాంగానికి చెడ్డపేరు తెస్తోంది. దయచేసి ప్రజావాణి అర్జీలను కేవలం కాగితాలుగా చూడకుండా, వారం వారం వాటిపై సమీక్ష నిర్వహించి ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కోరుతున్నాం. మా డిమాండ్ - ఉచిత ప్రయాణం: బస్టాండ్ నుండి కలెక్టరేట్ వరకు రావడానికి పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి,...

దద్దమ్మ తేజస్వి కి బుద్ధి లేదు.. -- మాజీ ఎంపీ మధు యాష్కీ

Image
60 ఏళ్ల తెలంగాణ పోరాటం గురించి తెలుసుకో.. తేజస్వి సూర్య..! తెలంగాణ గురించి, తెలంగాణ పోరాటం గురించి అవగాహన లేని దద్దమ్మ మాటలు మాట్లాడుతున్నావ్.. ఒకప్పుడు మీ కర్ణాటక ప్రాంతంని ప్రాంతాలు కూడా హైదరాబాద్ రాష్ట్రంలో భాగమే..! నిజాం పాలనలో ఉన్నవే.. తెలంగాణ చరిత్ర నీకు తెలవదు, మీ నరేంద్ర మోడీకి తెలవదు..! మీ తాత ముత్తాతల చరిత్ర ఏందో.. తెలుసుకొని మాట్లాడు తేజస్వి సూర్య..! బ్రిటిష్ కాలంలో ఇండియా - పాకిస్తాన్ విభజన ఎప్పుడు జరిగింది.? ఏపీ, తెలంగాణ విభజన ఎందుకు జరిగిందో..? అవగాహన లేకుండా రెండింటిని పోల్చుతూ మాట్లాడడం నీ తెలివి తక్కువ తనానికి నిదర్శనం. ఇలాంటి సిగ్గుమాలిన మాటలు మాట్లాడితే తెలంగాణలోనే కాదు.. నీ కర్ణాటకలోనూ నిన్ను చెప్పులతో కొడతారు..! అవకాశం వచ్చినప్పుడల్లా బిజెపి నేతలు తెలంగాణ పట్ల అక్కస్సును వెళ్లగాక్కుతున్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ.. ఏ చిన్న సంఘటన కూడా జరగకుండా కలిసిమెలిసి జీవనం సాగిస్తున్న తీరు బిజెపి పాలకులకు కంటగింపుగా కనపడుతుందా...? తెలంగాణ రాష్ట్ర ఎదుగుదల ఓర్వలేక పోతున్నారా..? బిజెపి ఎంపీ అలా అడ్డగోలుగా మాట్లాడుతున్నా తెలంగాణ రాష్ట్రం నుం...

జర్నలిస్టు కూతురు అనన్య స్టేట్ ర్యాంకర్.. CECలో 982 మార్కులతో మూడో స్థానం

Image
కామారెడ్డి కి చెందిన మున్నం అనన్య పట్టణంలోని VRK కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఆదివారం ఇంటర్ బోర్డ్ ప్రకటించిన ఫలితాల్లో CEC Group నుంచి 1000 Marks కు గాను 982 మార్క్స్ సాధించింది రాష్ట్రంలో మూడవ ర్యాంక్ సాధించింది. రాష్ట్ర టాపర్ కు 985 మార్క్స్ వచ్చాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరంలోను స్టేట్ లో రెండవ ర్యాంక్ సాధించింది. IAS లక్ష్యంగా తాను CEC Group ను ఎంచుకొని శ్రమిస్తున్నట్లు ఈ సందర్బంగా అనన్య తెలిపింది. అనన్య తండ్రి మున్నం శ్రవణ్ కుమార్ 25 ఏళ్లుగా సీనియర్ జర్నలిస్ట్ గా పని చేస్తున్నారు. తల్లి మున్నం రాధ గృహిణి .తమ బిడ్డ ఇంటర్ లో అనుకున్న స్థాయిలో మార్క్ లు ర్యాంక్ ను సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తమ కూతురు IAS లక్ష్యంగా కష్టపడి చదువుతొందని ,తన లక్ష్యం చేరుకొనేలా వెన్నంటి తోడ్పాటు నిస్తామని ఈ సందర్బంగా చెప్పారు.తమ పెద్ద కూతురు నిహారిక సైతం SRK విద్యసంస్తల్లొ చదివి ఇంటర్ MPC లో 950 పైగా మార్క్ లు సాధించి EAPCET లో మంచి ర్యాంక్ సాధించి నల్లమల్లారెడ్డి కాలెజిలొ ఫ్రీ సీట్ సాధించి CSE AI Group లొ B.Tech సెకండ్ ఈయర్ చదువుతోంది. తమ ఇద్దరు కూతుల్లు అనుకున్న లక్ష్యాల వైపు సాగుతుండడం పట్ల త...

నిజామాబాద్‌లో అన్నా బాహు సాఠే విగ్రహావిష్కరణ.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ఘన స్వాగతం

Image
నిజామాబాద్ నగర పర్యటనకు ఆదివారం సాయంత్రం విచ్చేసిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. చంద్రశేఖర్ కాలనీలో నూతనంగా నెలకొల్పిన అన్నా బాహు సాఠే విగ్రహాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇంచార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. మంత్రి వెంట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, నగర మేయర్ ఉమారాణి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel

నిజామాబాద్‌లో ఇంటర్ ఫలితాలు 2025-26: 66.19% ఉత్తీర్ణత.. బాలికలదే పై చేయి

Image
2025-26 విద్యా సంవత్సరానికి గాను నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి మార్చి నెలలో నిర్వహించిన వార్షిక పరీక్షలలో జనరల్ విభాగంలో రెండవ సంవత్సరం విద్యార్థులు 66.19% ఉత్తీర్ణత సాధించారు. కాగా మొదటి సంవత్సరం విద్యార్థులు 56.64% ఉత్తీర్తో సాధించారు. అలాగే జిల్లాలో ఒకేషనల్ విభాగంలో రెండవ సంవత్సరంలో 67.68% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ మొదటి సంవత్సరం లో 49.65% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో ఫిబ్రవరి, మార్చ్ నెలలో నిర్వహించిన ఇంటర్ వార్షిక పరీక్షలలో మొత్తం రెండవ సంవత్సరం జనరల్ విద్యార్థులు మొత్తం 13,876 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 9,187 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలికలు 7,606 మంది పరీక్షలకు హాజరుకాగా 5,823 మంది బాలికలు ఉత్తీర్ణత కాగా 76.56% శాతం తో బాలుర పై చేయి సాధించారు. రెండవ సంవత్సరం బాలురు 6 ,273 మంది విద్యార్థులు హాజరు కాగా వీరిలో 3,364 మంది విద్యార్థులు పాసై 53.63% సాధించారు. మొదటి సంవత్సరం జనరల్ విభాగంలో మొత్తం విద్యార్థులు 15,547 మంది పరీక్షలకు హాజరు కాగా 8,806 మంది విద్యార్థులు పాస్ కాగా 56.64% సాధించారు. వీరిలో బాలికలు 8,711 మంది ...