Posts

Showing posts with the label Mana Nizamabad

Big Breaking : మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై కోర్టులో కేసు

Image
 కామారెడ్డి పట్టణ ప్రథమ పౌరురాలు ఇప్ప ఉమారాణి మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నిక చెల్లదంటూ ఆమె రాజకీయ ప్రత్యర్థి రంగ మాధవి కామారెడ్డి జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.   కామారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఇప్ప ఉమారాణి మునిసిపల్ చైర్మన్గా భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.ఎన్నికల నియమావలికి వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా కేవలం మూడు ఓట్ల తేడాతో ఎన్నికయ్యారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా మంగళవారం కామారెడ్డి జిల్లా న్యాయస్థానంలో దాఖలు చేసిన కేసు నంబర్ ELEC. OP 1 OF 2026 ఎలక్షన్ పిటిషన్ కోర్టులో అడ్మిట్ అయింది.  ఈ నేపథ్యంలో ఈ కేసుని జిల్లా న్యాయమూర్తి CHVRR Prasad విచారణకు స్వీకరించారు.

పంజా విసిరిన కవిత.. హైడ్రా పరువు బజారుపాలు..

Image
హైడ్రా రంగనాధ్,రేవంత్ రెడ్డి బండారాన్ని బట్టబయలు చేశారు తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత. హొలీ పండుగ రోజునే పేదలకు అండగా.. హైడ్రా చల్లని నీడలో చేదదీరుతున్న బడా బిల్డర్ల బట్టలిప్పేసి నడి రోడ్డులో నిలబెట్టారు కవిత. రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు డొల్ల తనాన్ని బయట పెట్టారు.. హైదరాబాద్ మహానగరం పొలిమేరలో నార్సింగి సమీపంలో సరోవర్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న మూసీ నది గర్భంలో నిర్మాణము లో ఉన్న వంటేజ్ అపార్ట్మెంట్ ముందు కవిత నాయకత్వంలో వందలాదిమంది జాగృతి కార్యకర్తలు ప్రత్యక్ష పోరుకు దిగారు. మూసీ నదీ నట్టనడుమ నిర్మిస్తున్న ఈ అపార్ట్మెంట్ లకు BRS హయాంలో అనుమతులు ఇచ్చారని,రేవంత్ రెడ్డి హయాంలో పనులు ఊపందు కున్నాయని కవిత ఆరోపించారు.. హైడ్రా రంగనాధ్కు ఈ అక్రమ నిర్మాణాలు కనబడడం లేదా అని ప్రశ్నించారు కవిత.. పెద్దలంటే భయమా..పేదలంటే అలుసా అని నిలదీశారు జాగృతి అధినేత్రి.. హైడ్రా బుల్డోజర్లు నర్సింగి కి రావాలని..వంటేజ్ అపార్ట్మెంట్ లను నేలమట్టం చేయాలని కవిత పట్టుపట్టారు.. అప్పటి దాకా వంటేజ్ వెంచర్ ముందు నుంచి వెళ్ళేది లేదని హెచ్చరించారు కవిత..