కాళేశ్వరం పై బీజేపీ కుట్ర

ఢిల్లీ,
కాళేశ్వరం ప్రాజెక్టు నిధులు లక్ష కోట్లు నీళ్లలో కొట్టుకుపోయాయని కేంద్ర మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రాజ్యసభలో MP K R సురేష్ రెడ్డి ఉగ్రరూపం దాల్చారు..
మంత్రి సభలో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. లేకుంటే సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసు ఇస్తామని హెచ్చరించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్టు ఇరిగేషన్ పథకం కాళేశ్వరం అని చెప్పారు. అనేక మంది కేంద్ర మంత్రులు ప్రాజెక్టును ప్రశంశించారని గుర్తు చేశారు. అలాంటిది ఇప్పుడు కేంద్ర ఇరిగేషన్ మంత్రి పార్లమెంట్ లో కాళేశ్వరం ప్రాజెక్టును పనికిరాని ప్రాజెక్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నయా పైసా ఇవ్వకున్న KCR ప్రభుత్వం ప్రాజెక్టును చెప్పట్టిందన్నారు.
మెడిగడ్డ బ్యారేజి రెండు పిల్లర్లు మాత్రమే దెబ్బతింటే మొత్తం ప్రాజెక్ట్ కొట్టుక పోయిందని ప్రజలను తప్పుదోవ పట్టించడం బీజేపీ కి తగదన్నారు.
కాంగ్రెస్ పార్టీ బద్నాం చేసినట్లే..అదే తోవలో బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని MP సురేష్ రెడ్డి ఆరోపించారు.
కాళేశ్వరం పై వాస్తవాలతో కూడిన ప్రకటన చేసి,క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.లేకుంటే సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామన్నారు సురేష్ రెడ్డి..

మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

మంద కృష్ణ మాదిగపై కుట్ర CMO కనుసన్నల్లో యాక్షన్ టీమ్స్