ట్రాన్స్ జెండర్ల బహిష్కరణ.. ఇందూరు గడ్డపై VDCల ఆగడాలు
నగరంలోని కలెక్టరేట్ ఎదుట ట్రాన్స్జెండర్లు ధర్నాకు దిగారు. తమను గ్రామాల్లోకి రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రజావాణి లో అధికారులకు ఫిర్యాదు చేశారు. ట్రాన్స్జెండర్స్ సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఓరుగంటి గంగ, జరీనా బేగం మాట్లాడుతూ.. గ్రామాల్లోకి ట్రాన్స్జెండర్లు వీడీసీలు ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నాయని ఆరోపించారు. ఇటీవల సిరికొండ మండలం మైలారం గ్రామంలో చిన్న పిల్లల్ని అపహరిస్తున్నారంటూ భౌతికదారులకు దిగారన్నారు. అలాగే నందిపేట మండలం హుస్నాపూర్లో హిజ్రాలను గ్రామపంచాయతీలో అక్రమంగా నిర్బంధించారని పేర్కొన్నారు. మోపాల్ మండలంలో హిజ్రాలు రావొద్దంటూ పోస్టర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్నారు. తమను పూర్తిగా సామాజిక బహిష్కరణ చేయడం ఎంతవరకు సబబని ట్రాన్స్జెండర్లు ప్రశ్నించారు. ఎక్కడైనా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరిగితే వెళ్లి వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వారి జీవితం, వారి వ్యాపార లావాదేవాలు సుభిక్షంగా ఉండాలని తాము నిండు మనసుతో ఆశీర్వదిస్తామే తప్ప తమలో ఎలాంటి కల్మషం ఉండదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఇచ్చినంత తీసుకొని వస్తామని.. అలాంటి తమపై దుష్ప్రచారం చేయడం సరైనది కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు గ్రామాభివృద్ధి కమిటీలు ఎస్సీ, ఎస్టీ బీసీలను బహిష్కరణ చేస్తే నేడు హిజ్రాలను సైతం బహిష్కరణ చేయడం పూర్తిగా చట్ట విరుద్ధమని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా ట్రాన్స్జెండర్లపై భౌతికదాడులను నిరోధించాలని మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న వీడీసీలపై చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు. ఈ ఘటనపై కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు ఇందుకు కలెక్టర్ మానవతా దృక్పథంతో సానుకూలంగా స్పందించి తమకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ట్రాన్స్జెండర్ల సంక్షేమ సంఘం సభ్యులు వంకాయల అక్షర, ఆర్తి, శ్యామల, ఆసది, అలక, ప్రియ తదితరులు పాల్గొన్నారు.
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Click here to 👆 Follow Our WhatsApp Channel