Posts

Showing posts with the label Telangana News

నిజామాబాద్‌లో ఘనంగా బాబూ జగ్జీవన్ రాం 119వ జయంతి వేడుకలు

Image
నిజామాబాద్, భారత మాజీ ఉపప్రదాని డాక్టర్ బాబు జగ్జీవన్ రాం 119వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కంటేశ్వర్ కమాన్ వద్ద గల పాత అంబేడ్కర్ భవన్ లో నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో అర్బన్ శాసన సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగర మేయర్ కే.ఉమారాణి, రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్ తదితరులు బాబూ జగ్జీవన్ రాం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాత అంబేడ్కర్ భవన్ ఆవరణలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో పాల్గొని బాబు జగ్జీవన్ రాం చేసిన సేవలను కొనియాడారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, బాబూ జగ్జీవన్ రాం ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రత్యేకించి యువతరం, విద్యార్థుల్లో స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ భవిష్యత్తు కోసం, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు జగ్జీవన్ రాం అందించిన సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శమని అన్నారు. మహనీయుల గొప్...

భూగర్భానికి రీఛార్జ్... నెలకో మీటర్ లోతుకు జలమట్టాలు... ఆదా చెయ్యకపోతే అదొగతే...!

Image
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. తద్వారా భూగర్భ జలాలు ఆవిరి అధికమవుతున్నాయి. దీనికి తోడు లక్షలాది వ్యవసాయ బోరు బావులు పంటల నిమిత్తం నీటిని పొలాల్లోకి సాగునీరుగా వాడుకుంటున్నారు రైతులు. ఇక గృహ అవసరాల నిమిత్తం ఏర్పాటు చేసుకునే బోర్లు కోట్ల లీటర్ల నీటిని లాగేస్తున్నాయని భూగర్భ జల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ బాబు పేర్కొన్నారు. ప్రాజెక్టులు జలాశయాల్లోని నీటిని త్రాగునీటి కోసం సాగు అవసరాల కోసం వాడుతూనే ఉన్నాం అయితే వర్షాలు కురిసే శాతం తగ్గిపోవడంతో భూగర్భ రీఛార్జ్ కావడం లేదని, జలవినియోగంపై ఇంకుడు గుంటల కై వాటి ఏర్పాటు చేయడం వాటిపై దృష్టి సారించడం లేదన్నారు.దీంతో నెలకు మీటర్ లోతున నీరు ఖాళీ అవుతుంది ఈ మేరకు భవిష్యత్తులో త్రాగునీరు, సాగునీటి లభ్యత ప్రశ్నార్థకమవుతుంది. ఈ అంశంపై జిల్లా భూగర్భ జల శాఖ అధికారి శ్రీనివాస్ బాబు మన నిజామాబాద్ ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. వారు ఏమంటున్నారు వారి మాటల్లోనే విందాం.. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Cha...

కలెక్టరేట్‌లో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

Image
నిజామాబాద్, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లోని ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి, దొడ్డి కొమురయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, దొడ్డి కొమురయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రభావశీలిగా నిలిచారని కొనియాడారు. ఆనాటి దేశముఖ్ ల అసంబద్ధ పాలనకు వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహసాలతో పోరాటం జరిపారని గుర్తు చేశారు. కొమురయ్య పోరాట స్ఫూర్తితో తెలంగాణాలో అనేక ప్రజాస్వామిక ఉద్యమాలు జరిగాయని, ఈ ఉద్యమాలకు దొడ్డి కొమురయ్య పోరు పటిమ ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. మహనీయుల కృషిని స్మరించుకునేందుకు, నేటి తరం వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలనే ఆకాంక్షతో ప్రభుత్వం మహనీయుల జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందని అన్నారు. మహనీయులు చూపిన బాటలో నడుస్తూ, అణగారిన వర్గాల అభ్యున...

తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగంలో న్యాయవాదులు..

Image
హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ విద్యార్థుల ఆధ్వర్యంలో గురువారం రాత్రి జరిగిన "DUCIMUS - WE LEAD" ముగింపు కార్యక్రమంలో అసెంబ్లీలో BRS పక్ష ఉప నేత హరీష్ రావు పాల్గొన్నారు.గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన చేసిన ప్రసంగం విద్యార్థులను అర్రుత లూగించారు. ఈ సందర్భంగా హరీష్ రావు ప్రసంగం ఆయన మాటల్లోనే... "ఉస్మానియా యూనివర్సిటీలోకి వస్తుంటే ఎన్నో పాత జ్ఞాపకాలు, ఉద్వేగభరిత సంఘటనలు గుర్తొస్తున్నాయి . లా పూర్తి చేసుకొని నల్ల సూట్ వేసుకొని బీఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ పరిరక్షకులుగా మారబోతున్న మీ అందరికి అభినందనలు. యువత అంటే సాఫ్ట్వేర్, డాక్టర్ వైపే మక్కువ చూపుతున్న ఈ రోజుల్లో మీరు లా చదవడం అంటే మీరు something special. ఈ దేశంలో జరిగిన అనేక ఉద్యమాల్లో, ఆఖరికి తెలంగాణ ఉద్యమంలో కూడా న్యాయవాదులే అగ్రభాగంలో ఉన్నారు. మహాత్మ గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, అంబేద్కర్ ఇలా స్వాతంత్ర్య పోరాటంలో ముందున్నది న్యాయవాదులే. సాగర హారం, మిలియన్ మార్చ్, రహదారుల దిగ్బంధం, ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఉద్యమానికి అండగా నిలబడ్డది న్యాయవాదులే. ఎక్కడై...

హనుమాన్ శోభా యాత్రలో బిగాల గణేష్ సేవ..

Image
📍 నిజామాబాద్, హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా నిజామాబాద్ నగరంలో భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించిన శోభాయాత్రలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమాన్ స్వామి విగ్రహ రథం వద్ద గణేష్ బిగాల పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు. నగరం మొత్తం భక్తి పారవశ్యంతో నిండిపోగా, “జై శ్రీరాం”, “జై హనుమాన్” నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణం అలరించింది. అనంతరం నిజామాబాద్ అర్బన్ BRS పార్టీ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ, పండ్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులతో ఆప్యాయంగా మమేకమై, వారికి అభివాదం చేస్తూ శోభాయాత్రలో కలిసి నడిచారు.ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ హనుమాన్ స్వామి భక్తి, బలం, ధైర్యానికి ప్రతీక అని, స్వామివారి కృపతో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ప్రతి ఇంటిలో ఆనందం, ఐశ్వర్యం నిండాలని ప్రార్థించారు. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel

అభివృద్ధికి కేరాఫ్ కాంగ్రెస్ -దోమకొండలో షబ్బీర్ అలీ

Image
కామారెడ్డి , దోమకొండలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభలో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక గురించి షబ్బీర్ అలీ వివరంగా ప్రజలకు తెలియజేశారు. ఈ ప్రణాళిక ద్వారా గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ఆరోగ్య సేవల మెరుగుదల, రహదారుల నిర్మాణం వంటి పలు రంగాల్లో వేగంగా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. మండల అభివృద్ధిలో భాగంగా రూ.75 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు మరియు ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఈ పనులు పూర్తయితే దోమకొండలో మౌలిక వసతులు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు. గ్రామసభలో భాగంగా గ్రామస్తులు పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేయగా, కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, 99 రోజుల ప్రణాళిక ద్వారా ప్రతి గ్రామంలో అభివృద్ధి ఫలితాలు కనిపిస్తాయని అన్నారు. దోమకొండ మండల...

VDC ఆగడాలకు అడ్డుకట్ట.. దళితులు రాజీపడొద్దు: ఎస్సీ-ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్య

Image
నిజామాబాద్ జిల్లాలో గ్రామ అభివృద్ధి కమిటీ లు ఆయా గ్రామాల్లో విధించే సాంఘిక బహిష్కరణలకు అడ్డుకట్ట వేస్తామని, ఇందులో దళితులు రాజీ పడాల్సిన అవసరం లేదని, దీనికై త్వరలోనే మరిన్ని కఠినమైన చట్టాల అమలుకు శ్రీకారం చుడతామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్య ఉద్గటించారు. బుధవారం జిల్లా కేంద్రానికి తన వ్యక్తిగత పనులపై వచ్చిన చైర్మన్ మన నిజామాబాద్ ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయా జిల్లాలో కలెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులు నివేదికల సహకారంతో జూన్ మాసంలో డీజీపీ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. దీని ద్వారా దళిత గిరిజనులకు దేవాలయాల ప్రవేశ నిషేధం, పరువు హత్యలు, లాంటివి జరగకుండా ఉండేందుకు ఈ సమావేశం నిర్వహించ తలపెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. రోస్టర్ పాయింట్ల లో ఉన్న లోపాల గుర్తింపు వాటి సవరణలు లాంటి అనేక అంశాల్లో ఉన్న సంస్కరణలతో మన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ న్ని దేశానికి రోల్ మోడల్ గా నిలబెడతానని ఆయన అభిప్రాయపడ్డారు ఈ మేరకు ఇప్పటికే ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ చైర్మన్లు సభ్యులతో చర్చలు సంప్రదింపులు జరిపామన్నారు. న్యాయశా...

నిజామాబాద్‌లో బలవంతపు పన్ను వసూళ్లు? ఇంట్లో ఫ్రిజ్ జప్తు !

Image
నిజామాబాద్ ప్రజలు ఇంకా నిజాం నవాబు పాలనలో ఉన్నామా అంటూ ముక్కున వేలు వేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది.. నిజాం నిరంకుశ పాలనలో పన్నుల వసూలు కర్కశంగా ఉండేది.. రజాకార్లను రంగంలోకి దింపి పన్నులు కట్టమని.. ఇంట్లో కనపడిన వస్తువులను ఎత్తుకుని పోయేవారు.. తెలంగాణ రాష్ట్రం సిద్దించక ముందు TDP, కాంగ్రెస్ హయాంలోనూ నిజాం కాలంనాటి జప్తులు కొనసాగేవి..పన్నులు కట్టడం లేదంటూ ఇరుగుపొరుగు వారిని పిలిచి ఇజ్జత్ తీసి ఇంటి దర్వాజలు,కిటికీలు పీక్కపోయి పరువు తీసేవారు అంజువాన్ అధికారులు..అంటే సహకార శాఖ వసూల్ సిబ్బంది.. 13 ఏళ్లలో ఇలాంటి బూజు పట్టిన నవాబు కాలంనాటి బలవంతపు పన్నుల వసూళ్ళు జరుగలేవు.. ఘనత వహించిన నిజామాబాద్ బల్దియా మాత్రం నిజాం తరహా పన్ను వసూళ్లకు బరితెగించారు. శ్రీరామ నవమి పండుగరోజే మిడుతలు దండు వలే నిజామాబాద్ నగరం ఎల్లమ్మ గుట్ట ప్రాంతంలోని విజయ్ టాకీస్ వెనకాల అనౌన్స్ మెంట్ వెహికిల్స్ తో ఎంటరయ్యారు.. నవీన్ అనే మధ్య తరగతి ఇంట్లోకి దూరి ఇంట్లోని వస్తువులను జప్తు చేసేందుకు హడావిడి చేశారు మున్సిపల్ కార్పోరేషన్ ఉద్యోగులు..18000 ఇంటి పన్ను ఇప్పటికిప్పుడు కట్టితీర వల్సిందే అంటూ హుకుం జారీచేశారు....

మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం.. సమిష్టి కృషికి కలెక్టర్, సీపీ పిలుపు

Image
నిజామాబాద్, మాదకద్రవ్యాల నిరోధానికి సమిష్టి కృషి జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్, సీపీ వెల్లడి మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగంపై గట్టి నిఘా కొనసాగించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లా స్థాయి సమావేశం జరిగింది. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టిన చర్యలపై చర్చించి, వాటి నిరోధానికి అవలంభించాల్సిన చర్యలపై అధికారులకు కలెక్టర్, సీపీ దిశానిర్దేశం చేశారు. గడిచిన రెండు మాసాలలో జిల్లాలో ఎక్సైజ్, పోలీస్ శాఖల అధ్వర్యంలో నిర్వహించిన దాడులు, పట్టుబడిన గంజాయి, అల్ఫ్రాజోలం ఇతర మత్తు పదార్థాలు, నమోదైన కేసుల గురించి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యువతను, విద్యార్థులను మత్తుకు బానిసలుగా మారుస్తున్న మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. పోలీస్, ఎక్సైజ్, రవాణా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో కమిటీగా ఏర్పడి పక్కాగా కృషి చేయాలన్నారు. ...

కలెక్టరేట్‌లో ఉచిత అంబలి పంపిణీ ప్రారంభం.. ఉద్యోగులకు ఉపశమనం

Image
📍 నిజామాబాద్, కలెక్టరేట్ లో ఉచిత అంబలి పంపిణీని ప్రారంభించిన కలెక్టర్ తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీఓ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ఏర్పాటు చేసిన ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ప్రారంభించారు. వేసవి సీజన్ ను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులకు ఉపశమనం కల్పించేందుకు వీలుగా తాగునీటితో పాటు ఉచితంగా అంబలి పంపిణీకి చొరవ చూపడం అభినందనీయమని టీఎన్జీఓ సంఘాన్ని అభినందించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీఓ ప్రతినిధులు కృషి చేస్తూ, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయం అని అన్నారు. కలెక్టరేట్ ఉద్యోగులతో పాటు వివిధ పనుల కోసం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయానికి వచ్చే వారికి ప్రస్తుత వేసవిలో అంబలి కేంద్రం ఉపశమనాన్ని అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు సుమన్, కార్యదర్శి శేఖర్, రాష్ట్ర నాయకుడు గైని గంగారాం తదితరులు పాల్గొన్నారు. Follow Our WhatsApp Channel

నిజామాబాద్‌లో LPG, పెట్రోల్, డీజిల్ సరఫరాలు సాధారణం.. ప్రజలు ఆందోళన చెందొద్దు - జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి

Image
* ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో LPG, పెట్రోల్ మరియు డీజిల్ సరఫరాలపై సమీక్ష నిర్వహించబడింది. 👉 ప్రస్తుత పరిస్థితి: * జిల్లాలో సరఫరాలు సాధారణంగా కొనసాగుతున్నాయి * ఎటువంటి కొరత లేదు * సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయి ⚠️ అయితే జాగ్రత్త చర్యలు తీసుకోవాలి *అన్ని డిస్ట్రిబ్యూటర్లు / అధికారులు తప్పనిసరిగా పాటించవలసిన సూచనలు: * LPG సిలిండర్లకు తగిన నిల్వలు (7–10 రోజులు) ఉంచాలి * బుకింగ్ మరియు డెలివరీలో విలంబం లేకుండా చూడాలి * గృహ వినియోగ గ్యాస్‌ను వాణిజ్య వినియోగానికి మళ్లించరాదు * స్టాక్ వివరాలు స్పష్టంగా ప్రదర్శించాలి * ప్రతి రోజు స్టాక్ & సరఫరా నివేదికలు సమర్పించాలి పెట్రోల్ & డీజిల్: * అన్ని బంకుల్లో స్టాక్ అందుబాటులో ఉండాలి * ఎటువంటి స్టాక్ అవుట్ పరిస్థితి రాకుండా చూడాలి * ధరలు మరియు స్టాక్ వివరాలు ప్రదర్శించాలి ఎన్‌ఫోర్స్‌మెంట్: * అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ పై కఠిన చర్యలు * అవసరమైతే రైడ్లు నిర్వహించాలి ప్రజలకు విజ్ఞప్తి: * అవసరానికి మించి నిల్వలు చేయవద్దు * గ్యాస్ / ఇంధన కొరతపై భయపడవద్దు 👉 జిల్లా ...

నిజామాబాద్ కార్పొరేషన్ బడ్జెట్ 2026-27 ఆమోదం.. రూ.231కోట్ల వ్యయం

Image
నిజామాబాద్, నిజామాబాద్ నగరపాలక సంస్థ 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రతిపాదించిన బడ్జెట్ ఆమోదం పొందింది. శనివారం నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో మేయర్ కూరగాయల ఉమారాణి అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ పాల్గొన్నారు. 2026-2027 సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదిత బడ్జెట్ తో పాటు, 2025 - 2026 సవరించిన అంచనా బడ్జెట్ ను సమావేశంలో ప్రవేశపెట్టగా, కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. 2025 ఏప్రిల్ 01 నాటికి ప్రారంభ నిల్వ రూ. 9471.33 లక్షలు, 2025-2026 సవరణ అంచనా ఆదాయం రూ. 13717.11 లక్షలు కలుపుకుని మొత్తం రూ. 23188.44 లక్షలుగా పేర్కొన్నారు. 2026-2027 సంవత్సరపు సాధారణ నిధుల అంచనా ఆదాయం రూ. 14763.60 లక్షలుగా బడ్జెట్ లో పొందుపర్చారు. ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ గ్రాంట్ల ద్వారా రూ. 9937.00 లక్షల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. అదేవిధంగా మొత్తం అంచనా వ్యయం రూ. 24700.60 లక్షలుగా బడ్జెట్ పద్దులో పేర్కొన్నారు. ప్రతిపాదిత బడ్...

తన గురువు జైశెట్టి రమణయ్య మృతిపై కేసీఆర్ సంతాపం

Image
తన గురువు డాక్టర్ జైశెట్టి రమణయ్య మరణం పట్ల BRS అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. తనకు చదువు చెప్పిన గురువు, జగిత్యాలకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు, రిటైర్డ్ లెక్చరర్ జైశెట్టి రమణయ్య మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ, సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా తనకు గురువుగా, అత్యంత ఆత్మీయుడైన రమణయ్య గారితో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ గారు స్మరించుకున్నారు. రమణయ్య సిద్దిపేటలో లెక్చరర్ గా పనిచేస్తున్న సమయంలో, తను ఇంటర్మీడియట్ విద్యార్థిగా తన దగ్గర విద్యనభ్యసించిన సందర్భాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. వారి మరణంతో శొకతప్త హృదయులైన కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రమణయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కాగా.. 1971లో సిద్దిపేటలో జూనియర్, డిగ్రీ కాలేజీలో హిస్టరీ లెక్చరర్ గా జైశెట్టి రమణయ్య పని చేశారు. చిన్న వయసులోనే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన అరుదైన వ్యక్తిగా, జగిత్యాలలో మొట్టమొదట డాక్టరేట్ పొందిన పరిశోధన విద్యార్థిగా వారికి పేరున్నది. "సౌత్ ఇండియా టెంపుల్స్" అనే పరిశోధనాత్మక గ్రంధాన్ని సమర్పించి జైశెట్టి రమణయ్య పీహెచ్‌డీ డాక్టర్ పట్టాను పొందారు. ...

నిజామాబాద్‌లో ఇంధన కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు: అధికారి శ్రీకాంత్ రెడ్డి

Image
📍 నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఇంధన కొరతపై వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు. 👉 జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఐఓసీఎల్ ఆధీనంలో 62 బంకుల్లో రోజుకు సుమారు 3.94 లక్షల లీటర్ల పెట్రోల్, 4.59 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయని తెలిపారు. 👉 హెచ్‌పీసీఎల్ పరిధిలో 64 బంకుల్లో 3.54 లక్షల లీటర్ల పెట్రోల్, 3.83 లక్షల లీటర్ల డీజిల్, 👉 భారత్ పెట్రోలియం పరిధిలో 69 బంకుల్లో 3 లక్షల లీటర్ల పెట్రోల్, 3.5 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయని చెప్పారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 211 పెట్రోల్ బంకుల్లో ప్రతి రోజు సగటున 1.50 లక్షల లీటర్ల పెట్రోల్, 2.60 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయని వివరించారు. 💬 కృత్రిమంగా కొరత సృష్టించే బంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 👉 ఎల్పీజీ సిలిండర్ల కొరత కూడా లేదని, బుకింగ్ ప్రక్రియ సాధారణంగానే కొనసాగుతోందన్నారు. డొమెస్టిక్ సిలిండర్లన...

3 నెలలకు సరిపడా పెట్రోల్,డీజిల్ ఉంది. -మంత్రి ఉత్తమ్

Image
-మంత్రి ఉత్తమ్ హైదరాబాద్. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్,ఎల్.పి.జి కొరత ఉత్పన్నమయ్యే ప్రసక్తేలేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానంగా హైదరాబాద్ లో డీజిల్,పెట్రోల్ బంక్ ల వద్ద పెద్ద ఎత్తున ఉన్న క్యూలను చూసి పెట్రోల్,డీజిల్,ఎల్.పి.జి కొరత అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇంధన వనరులతో పాటు ఎల్.పి.జి కొరత అంటూ వస్తున్న వదంతులతో ప్రజాలేవరు గందరగోళంలో పడొద్దని ఆయన ఉద్బోధించారు. ఈ మేరకు రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో పౌర సరఫరాల శాఖా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తో కలసి ఆయన మీడియాతో ముచ్చటించారు. రానున్న మూడు నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయని జరుగుతున్న వదంతులతో ఏ ఒక్కరూ అయోమయంలో పడొద్దని ఆయన ఉద్బోధించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్,భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలు ఇంధన సరఫరాలను గణనీయంగా పెంచాయని ఆయన పేర్కొన్నారు. డిమాండ్ నీ మించి సరఫరా కొనసాగుతోందని,ఈ రోజు 17,246 కిలో లీటర్ల డిమాండ్ ఉండగా 17,898 కిలోలీటర్ల సరఫరా జరగడమే ఇందుకు నిదర్శనమన్నారు.అంటే ...

🟠 నిజామాబాద్ నేలపై RSS బీజం

Image
డాక్టర్ కేశవ్ బలిరాం హెగ్డేవార్ వందేళ్ల క్రితం కేవలం ఐదుగురు సభ్యులతో ప్రారంభించిన ఆర్ఎస్ఎస్ శాఖ విశ్వవ్యాప్తమైంది. ఈ మహా యజ్ఞానికి బీజం పడింది నిజామాబాద్ జిల్లాలో కావడం విశేషం. ఐదుగురితో ఏర్పడ్డ RSS అంచెలంచెలుగా దేశవ్యాప్తం లక్షల స్వయం సేవకులను తయారు చేసింది. ప్రపంచంలోని ముఖ్య దేశాలలో సైతం RSS భావజాలం విస్తరించింది. RSS సిద్ధాంతం నచ్చి.. ఆ భావజాలం నీడలో హెగ్డేవార్ హిందుత్వ ఎజెండా ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. బలమైన రాజకీయ శక్తిగా ఇండియాలో చోదక శక్తిగా ఎదిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఇందూరు గడ్డ మీద పురుడు పోసుకుంది. రెంజల్ మండలం కందకుర్తి గ్రామంలో RSS పుట్టింది. RSS వ్యవస్థాపకులు హెగ్డేవార్ తాతయ్య నరసింహ శాస్త్రి. వారి వంశం రేవతి బాయి, బలిరం అనే దంపతులకు జన్మించిన మహానుభావుడు , గొప్ప వ్యక్తి హెడ్గేవర్ .ఆయన జన్మించింది మామూలు రోజు కాదు ..ఆయన పుట్టింది పెరిగింది హిందువుల తెలుగు నూతన సంవత్సర పండగ ఉగాది రోజున..హెగ్డేవార్ 1889 లో జన్మించినట్లు ఆర్ఎస్ఎస్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కందకుర్తి గ్రామంలో 30 కోట్ల రూపాయలతో మూడు అంతస్తులతో కూడిన ఎడ్గేవర్ స్మృతి భవనాన్ని నిర్మిస్తున్నారు అ...

భగత్ సింగ్ గొప్ప యోధుడు -పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

Image
స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ప్రతి నిత్యం స్మరించుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపునిచ్చారు. మన దేశ స్వాతంత్రం కోసం పోరాడి ప్రాణాలను సైతం నవ్వుతూ వదులుకున్న ఎందరో మహనీయుల త్యాగాలను భారతీయులందరూ ప్రతినిత్యము స్మరించుకోవాలని అన్నారు ఆయన. మార్చ్ 23న నవ యువకులైన దేశభక్తులు భగత్ సింగ్ ,రాజ్ గురు, సుఖదేవ్ ల ప్రాణత్యాగానికి గుర్తుగా సమర్పణ దివస్ కార్యక్రమాన్ని కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ మేరా యువ భారత్ ఆధ్వర్యంలో సోమవారం పాలిటెక్నిక్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ కులాలు, మతాలు ప్రాంతాలు వేరువేరుగా ఉన్నప్పటికీ భారతీయులందరూ ఒకే తల్లి బిడ్డల్లాగా కలిసి ఉండటమే మన స్వతంత్ర సమరయోధుల యొక్క జీవిత ఆశయమని గుర్తు చేశారు, ప్రాణ త్యాగానికి మించిన గొప్ప త్యాగం ఇంకేది ఉండదని ,అలాంటిది వేలాదిమంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను ఈ దేశం కోసం వదిలిపెట్టారని ఆయన తెలిపారు. నవ యువకులుగా ఉన్న అతిపిన్న వయసు గల యువకులు భగత్ సింగ్ అతని స్నేహితులు రాజ్ గురు, సుఖదేవ్ లు ఉరి కొయ్యలను సైతం నవ్వుతూ ముద్దాడి మెడలో వేసుకున...

ఉత్తమ ఫారెస్టు ఆఫీసర్ గా బాస సుశీల్

Image
రాష్ట్ర స్థాయి ఉత్తమ అటవీశాఖ అధికారుల జాబితాలో ఆర్ముర్ ఫారెస్టు బీట్ ఆఫీసర్ బాస సుశీల్ కుమార్ ఎంపికయ్యారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ఉత్తమ అధికారులను గుర్తించింది ప్రభుత్వం. దేశ వ్యాప్తంగా ఎస్టిమేషన్ 2026 ను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు అటవీ, వన్యప్రాణుల సంరక్షణలో చూపిన అంకితభావంతో పని చేసినందుకు బాస సుశీల్ కుమార్ ఉత్తమ అధికారిగా ఎంపిక అయ్యారు. హైదరాబాద్ దూపల్లి లోని ఫారెస్టు అకాడమీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఉత్తమ ఉద్యోగి అవార్డును అందుకున్నారు ఆయన. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ఉత్తమ అధికారి అవార్డును అందుకున్న ఆర్ముర్ రేంజి బీట్ ఆఫీసర్ సుశీల్ కుమార్ ను అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టరు సువర్ణ,అభిలాష తదితరులు సుశీల్ కుమార్ ను అభినందించారు. Follow Our WhatsApp Channel

ఆశా వర్కర్లకు పరిష్కారం లేకపోతే చలో అసెంబ్లీ

Image
కామారెడ్డి, ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 28న చలో అసెంబ్లీ నిర్వహిస్తామని అంగన్వాడీ లు సర్కార్ కు అల్టిమేటం ఇచ్చారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ నాయకత్వంలో వారు శుక్రవారం కామారెడ్డిలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కలిశారు. షబ్బీర్ అలీ ఆశా వర్కర్లతో సుమారు గంటకు పైగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా CITU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కే చంద్రశేఖర్ ముదం అరుణ్ లు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు కనీస వేతనం 18000 లు అమలు చేస్తామనిఇచ్చిన హామీ నెరవేరలేదన్నారు. పని భద్రత హామీ కూడా ఇప్పటికే అమలు కాలేదన్నారు.ఎన్నికల్లో మాతో పని చేయించుకుని పారితోషికం ఇవ్వలేదని వెంటనే వాటిని విడుదల చేయాలని అన్నారు .అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పెంచిన 1500 ల పారితోషికాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. 2021 జులై నుండి డిసెంబర్ వరకు ఆరు నెలల పిఆర్సి బకాయిల విడుదల చేయాలని అన్నారు. పి ఎఫ్ ఎస్ ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సమయం ఇచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సుదీర్ఘంగా మాట్లాడిన షబ్బీర్ ఆలీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర...

ఆబ్కారీ పోలీసులా.. మజాకా..

Image
మాయ చేసి మత్పరించడంలో నిజామాబాద్ ఎక్సయిజ్ పోలీసులకు ఎవరూ సరి రారని నిరూపిస్తున్నారు.మాటలు కోటలు దాటినా వారి చేతిలో ఉన్న లాఠీ ఆఫీసు గడప దాటదని రూఢి అవుతోంది. తెల్లవారు జాము మద్యం అమ్మకాలను నియంత్రించామని,బెల్టు షాపులను మూసేయించామని ఎక్సయిజ్ పోలీసుల ప్రకటనలు భూటకమని తేలిపోయింది. మద్యం వ్యాపారులతో ఉన్న నోట్ల బంధం ముందు విధులు బలా దూర్ అని తేలిపోయింది. ఈ పరిణామాలకు అద్దం పడుతోంది నిజామాబాద్ మద్యం అమ్మకాల తీరు. నిజామాబాద్ నగరం నలుమూలల్లో నిబంధనలకు విరుద్ధంగా తెల్లవారుజామున నుంచే వైన్స్,బార్ షాపుల్లో లిక్కర్ అమ్ముతున్న విషయాన్ని మన నిజామాబాద్ స్టింగ్ ఆపరేషన్తో బయట పెట్టింది.అయితే అలాంటి షాపులపై చర్యలు తీసుకుంటామని ఆబ్కారీ SHO స్వప్న ఖరాఖండిగా చెప్పిన మాటలు గాలివాటమివే అని తేలిపోయింది. స్టింగ్ ఆపరేషన్ జరిపిన మరుసటిరోజు తూతూ మంత్రం చర్యలతో సరిపెట్టారు స్వప్న. ఆ మరుసటిరోజు నుంచే నిజామాబాద్ అంతటా యధావిధిగా తెల్లవారుజామున నుంచే బార్ షాపుల్లో మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. అయితే లిక్కర్ సిండికేట్ తో ఉన్న లాలూచీ వల్లే బజారులో బజాప్తాగా అక్రమంగా మద్యం ఏరులై పారుతోంది.జిల్లా కేంద్రంలోనే విధులు నిర్వ...