వంటపనిలోనూ తగ్గేదేలే.. -- కులాంతర ప్రేమ పెళ్లి -- మేయర్ ఉమ తండ్రి ప్రముఖ జర్నలిస్టు
- Get link
- X
- Other Apps
(జమాల్పూర్ గణేష్, ప్రీతం రెడ్డి)
ఆమె నగర ప్రథమ పౌరురాలు.తెలంగాణలోనే అతిపెద్ద మూడవ మునిపల్ కొర్పొరేషన్ మేయర్గా ప్రమాణం చేశారు.ఆరోజు అంతా బిజీ బిజీగా గడిపారు.నిజామాబాద్ లో బుటిక్ నడుపుకునే అతి సాధారణ సగటు మహిళ.పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వల్ల ఊహించని ప్రోటోకాల్ పోస్టు సొంతమైంది కూడగాయల ఉమారాణికి..దీనితో ప్రమాణ స్వీకారం చేసిన రోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,మహేష్ కుమార్ గౌడ్ తదితర ఉద్దండులతో మర్యాద పూర్వక భేటీలు..కాంగ్రెస్ శ్రేణులతో సంబరాల్లో గడిచి పోయింది.మరుసటిరోజు యధావిధిగా ఇంటి పనులు,వంట పనుల్లో నిమగ్నం అయ్యారు నగర ప్రధమ పౌరురాలు..అదే సమయానికి మన నిజామాబాద్ వీడియో జార్నలిస్టు పొద్దుటూరు ప్రీతం రెడ్డి మేయర్ ఇంటి పనుల్లో బిజీ అయిన తీరును చిత్రీకరించారు..
గ్యాస్ స్టవ్ వెలిగించి పప్పుచారు కాస్తూనే.. మరో సైడ్ చాయ్ చేశారు..నడుమ కిచెన్ సర్దడం.పోపు డబ్బాలు,మసాలా దినుసులు క్రమంగా సర్దుకుని ఇల్లాలుగా భాద్యతలు పూర్తి చేసుకున్నరూ. మేయర్ కిచెన్ నుంచి హాల్ లో కొద్ది సేపు టీవీ చూసారు.ఆతరువాత భర్త కరాటే రమేష్ తో కలిసి బంధు మిత్రులతో కలిశారు మేయర్ ఉమారాణి.
స్నేహితులు,హితులు వారిద్దరినీ శాలువాలు, పూల దండలతో ముంచెత్తారు.
కసాబ్ సంఘ భవనం సమీపంలో ఇరుకైన సందులో 70 గజాల చిన్న ఇంట్లో సర్దుకుని మేయర్ దంపతులను ఆశీర్వదించారు బంధువులు..
ఇల్లు ఇరుకైతే ఏంది మనసు విశాలమైనది అంటూ కరాటే రమేష్ ను అభినందించారు.
మంగళవారం అమావాస్య ఉన్న కారణంగా అధికారిక కార్యక్రమాలు పెట్టుకోలేదని మేయర్ ఉమ మన నిజామాబాద్ తో చెప్పారు..
జర్నలిస్ట్ కూతురే మేయర్
నిజామాబాద్ లో సీనియర్ జర్నలిస్టు గా పని చేసిన అమరుడు బెడిద రాజేశ్వర కూతురే మన మేయర్ ఉమ.
నిజామాబాద్ కు చెందిన రాజేశ్వర్ మూడు దశాబ్దాల పాటు జర్నలిస్టు గా పనిచేసారు.
ఆర్ముర్ కేంద్రంగా జాతి రత్నం పత్రికను నడిపారు.
పెరిక సామాజిక వర్గానికి చెందిన ఉమా రాణిని ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కరాటే రమేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
కసాబ్ గల్లీలో నివసిస్తున్న వీరికి నలుగురు పిల్లలు.
వీరిలో ముగ్గురు ఆడ బిడ్డలు.ఒకరు MBBS చదువుతోంది. మరొకరు బీటెక్ పూర్తి చేసుకుని ఉద్యోగం చేస్తోంది. మరో పాట ఎంబీఏ చదువుతుండగా కొడుకు బీటెక్ థర్డ్ ఇయర్.
రమేష్ కరాటే శిక్షణ ఇస్తూ,భార్య చీరల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించారు..
మొత్తానికి అతి సాధారణ కుటుంబ నేపథ్యం ఉన్న ఉమా రాణి సామాజిక స్థాయిని అమాంతం పెంచింది మేయర్ పోస్టు..
కోటాను కోట్లకు అధిపతి అయిన వ్యాపార దిగ్గజం నరేందర్ రెడ్డి సతీమణి కార్పొరేటర్ గా గెలవక పోవడం వల్ల కూరగాయల ఉమా రాణిని మేయర్ పదవి వరించింది. ఏ సమయమున ఏమి జరుగునో ఎవరు ఉహించెదరు అనే పాటకు సరిగ్గా సరిపోయింది ఉమా రాణి ఉదంతం..
- Get link
- X
- Other Apps
