Posts

Big Breaking : మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై కోర్టులో కేసు

Image
 కామారెడ్డి పట్టణ ప్రథమ పౌరురాలు ఇప్ప ఉమారాణి మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నిక చెల్లదంటూ ఆమె రాజకీయ ప్రత్యర్థి రంగ మాధవి కామారెడ్డి జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.   కామారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఇప్ప ఉమారాణి మునిసిపల్ చైర్మన్గా భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.ఎన్నికల నియమావలికి వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా కేవలం మూడు ఓట్ల తేడాతో ఎన్నికయ్యారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా మంగళవారం కామారెడ్డి జిల్లా న్యాయస్థానంలో దాఖలు చేసిన కేసు నంబర్ ELEC. OP 1 OF 2026 ఎలక్షన్ పిటిషన్ కోర్టులో అడ్మిట్ అయింది.  ఈ నేపథ్యంలో ఈ కేసుని జిల్లా న్యాయమూర్తి CHVRR Prasad విచారణకు స్వీకరించారు.

Big Breaking : మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై కోర్టులో కేసు

Image
 కామారెడ్డి పట్టణ ప్రథమ పౌరురాలు ఇప్ప ఉమారాణి మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నిక చెల్లదంటూ ఆమె రాజకీయ ప్రత్యర్థి రంగ మాధవి కామారెడ్డి జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.   కామారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఇప్ప ఉమారాణి మునిసిపల్ చైర్మన్గా భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.ఎన్నికల నియమావలికి వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా కేవలం మూడు ఓట్ల తేడాతో ఎన్నికయ్యారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా మంగళవారం కామారెడ్డి జిల్లా న్యాయస్థానంలో దాఖలు చేసిన కేసు నంబర్ ELEC. OP 1 OF 2026 ఎలక్షన్ పిటిషన్ కోర్టులో అడ్మిట్ అయింది.  ఈ నేపథ్యంలో ఈ కేసుని జిల్లా న్యాయమూర్తి CHVRR Prasad విచారణకు స్వీకరించారు.

పంజా విసిరిన కవిత.. హైడ్రా పరువు బజారుపాలు..

Image
హైడ్రా రంగనాధ్,రేవంత్ రెడ్డి బండారాన్ని బట్టబయలు చేశారు తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత. హొలీ పండుగ రోజునే పేదలకు అండగా.. హైడ్రా చల్లని నీడలో చేదదీరుతున్న బడా బిల్డర్ల బట్టలిప్పేసి నడి రోడ్డులో నిలబెట్టారు కవిత. రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు డొల్ల తనాన్ని బయట పెట్టారు.. హైదరాబాద్ మహానగరం పొలిమేరలో నార్సింగి సమీపంలో సరోవర్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న మూసీ నది గర్భంలో నిర్మాణము లో ఉన్న వంటేజ్ అపార్ట్మెంట్ ముందు కవిత నాయకత్వంలో వందలాదిమంది జాగృతి కార్యకర్తలు ప్రత్యక్ష పోరుకు దిగారు. మూసీ నదీ నట్టనడుమ నిర్మిస్తున్న ఈ అపార్ట్మెంట్ లకు BRS హయాంలో అనుమతులు ఇచ్చారని,రేవంత్ రెడ్డి హయాంలో పనులు ఊపందు కున్నాయని కవిత ఆరోపించారు.. హైడ్రా రంగనాధ్కు ఈ అక్రమ నిర్మాణాలు కనబడడం లేదా అని ప్రశ్నించారు కవిత.. పెద్దలంటే భయమా..పేదలంటే అలుసా అని నిలదీశారు జాగృతి అధినేత్రి.. హైడ్రా బుల్డోజర్లు నర్సింగి కి రావాలని..వంటేజ్ అపార్ట్మెంట్ లను నేలమట్టం చేయాలని కవిత పట్టుపట్టారు.. అప్పటి దాకా వంటేజ్ వెంచర్ ముందు నుంచి వెళ్ళేది లేదని హెచ్చరించారు కవిత..

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

Image
ఎప్పుడూ సీరియస్గా కనపడే ప్రదేశ్ కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ సైతం మ్యూజిక్ కు మైమరచిపోయిన అరుదైన సందర్భం ఆవిష్కతం అయ్యింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమం సోమవారం హైదరాబాద్ శివారులోని రిసార్ట్ లో జరిగింది. శిక్షణ పూర్తయిన వారికి సర్టిఫికెట్ ప్రధానం సందర్భంగా ఒక నాయకుడు హిందీ పాటకు అనుగుణంగా స్టెప్పులు వేస్తూ వేదిక పైకి ఎక్కారు.. మేడం నటరాజన్ పక్కనే నిలబడి ఉన్న నాయకుడు ఫుల్ జోష్ తో స్టెప్పులు వేస్తుండగా.. వేదిక పైకి ఎక్కిన నాయకుడు శృతి కలిపారు. ఇద్దరు నేతలు స్టెప్పులు వేయడంతో పక్కనే ఉన్న ఆలిండియా కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ సైతం కాళ్లతో తప్పెట్లు వేశారు..మ్యూజిక్ కు తగ్గట్టు మేడం అటూ ఇటూ కదలగా.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చప్పట్లు కొడుతూ జోష్ ను మరింత పెంచారు..

నిజామాబాద్ జిల్లా టైక్వాండో క్రీడ పోటీలు అభినందనీయం - క్రీడారంగంలో రాణించి జిల్లాకు వన్య తీసుకురావాలి.

Image
నిజామాబాద్ జిల్లాలో ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా టైక్వాండో క్రీడ పోటీలో పాల్గొంటున్న విద్యార్థులు క్రీడాకారులు తమ నైపుణ్యం ప్రదర్శించి జిల్లాకు వన్నె తీసుకురావాలని నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల. ఉమాదేవి అన్నారు. ఈరోజు నగరంలోని టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టైక్వాండో అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ పవర్, టైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీర్ వహజ్ అలీ ఖాన్, రాష్ట్ర అబ్జర్వర్ ముస్తఫా, లు హాజరైనారు. జిల్లా స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని నగర మేయర్ ఉమారాణి రమేష్ అన్నారు. నగరంలో జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ తైక్వాండో జిల్లా ఛాంపియన్షిప్ పోటీలను ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ రమేష్ పవర్ పాల్గొన్నారు. మేయర్ మాట్లాడుతూ కరాటే, తైక్వాండో వంటి క్రీడలు ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగపడతాయని, విద్యార్థి దశ నుంచే శిక్షణ తీసుకుంటే శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు. ఇలాంటి టోర్నమెంట్లను సద్వినియోగం చేసుకుంటే క్రీడాకారులు భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థా...

అన్నదమ్ముల సవాల్ - ధర్మపురి బ్రదర్స్ వార్

Image
(జమాల్పూర్ గణేష్ మూల్పూర్ రాజేంద్ర బాబు) వాళ్లిద్దరూ రాజకీయ ఉద్దండి బిడ్డలు..వైరి పక్షాల్లో కీలక నేతలే వారు..మాట వారుసకైనా ఆ అన్నదమ్ముల మధ్య మాట్లాడుకోవడాలు లేదు.. గత కొంతకాలంగా వారిద్దరి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు బహిరంగ మయ్యింది.. వారెవరో కాదు.ఒకరు ఎంపీ ధర్మపురి ఆరవింద్.. మరొకరు నిజామాబాద్ నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్. మునిసిపల్ ఎన్నికల ముందు సంజయ్ యాక్టివ్ అయ్యారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మేయర్ ఎన్నికల కోసం అప్పటికే పార్టీ శిక్షణ లో ఉన్న సంజయ్ని హుటాహుటిన నిజామాబాద్ రప్పించారు. తనదైన స్టయిల్ లో సంజయ్ ఎన్నికల సమరంలో దిగారు.. అంతర్గత సమావేశాల్లో,ప్రెస్ మీట్స్ సైతం తమ్ముడు అర్వింద్ పేరు ప్రస్తావించకుండానే సుతి మెత్తగా మత రాజకీయాలతో లబ్ది కోసం తపించడం సరికాదని హిత బోధ చేశారు. నిజామాబాద్ సమగ్ర అభివృద్ధికి ఆటంకం అని వ్యాఖ్యానించారు. శనివారం నిర్వహించిన పీస్ ర్యాలీలోనూ అర్వింద్ పేరు తీసుకోకుండానే పరోక్ష ప్రస్తావనకే పరిమితం అయ్యారు సంజయ్.. కానీ ఆదివారంనాడు సంజయ్ నిర్వహించిన మున్నూరు కాపు కార్పొరేటర్లు,కౌన్సిలర్ల సన్మానానికి బీజేపీ ప్ర...

బీజేపీ ముఖ్య నాయకుడే అడ్డుకున్నారు... మాజీ మేయర్ ధర్మపురి సంజయ్

Image
మున్నూరు కాపు కులస్థులంతా ఐక్యంగా ఉండి అభివృద్ధి కోసం పాటుపడాలని మాజీ మేయర్, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ అన్నారు. నూతనంగా ఎన్నికైన నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ లకు చెందిన మున్నూరు కాపు కార్పొరేటర్లు, కౌన్సిలర్లను జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సన్మానించారు.అయితే ఈ సన్మాన కార్యక్రమానికి బీజేపీ కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. దీనిపై సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులస్తులందరూ ఒక తాటిపైకి వచ్చి ఒకరినొకరు సహాయ సహకారాలు అందించుకోవడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అన్నారు. కానీ కొందరు బిజెపి నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఆ పార్టీ జెండా మోసిన మునురుకాపులకు తాను తలపెట్టిన ఈ కార్యక్రమానికి రావాలని ఉన్నప్పటికీ కూడా బిజెపి అగ్ర నాయకుల ఆదేశాల మేరకు రాలేకపోయారని ఆయన అన్నారు. వారిని ఆ పార్టీ అడ్డుకున్నప్పటికీ ఆ పార్టీలో ఉన్న మున్నూరు కాపు కులస్తులందరూ మా హృదయాల్లో చిరస్థాయిలో నిలిచిపోతారని అందుకే బిజెపి పార్టీ నుండి గెలిచిన కార్పొరేటర్లు కౌన్సిలర్లకు ఖాళీ కుర్చీలలో వారి పేరు రాసిపెట్టి సత్కరించినట్లు ఆయన అన్నారు. ఇకనైనా బిజెపి ...

కామారెడ్డిలో బీజేపీ శాసనసభ పక్షం కీలక భేటీ.. 7 నుంచి MLA ల పర్యటన

Image
బీజేపీ శాసనసభ పక్ష సమావేశనికి కామారెడ్డి వేదిక అయ్యింది. రానున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బిజెపి శాసనసభా పక్ష సమావేశం కామారెడ్డి ఎమ్మెల్యే, బిజెపి శాసనసభాపక్ష ఉపనేత కాటిపల్లి వెంకటరమణారెడ్డి నివాసంలో నిర్వహించారు.ఈ కీలక భేటీలో.. ఎమ్మెల్సీ సీ.అంజిరెడ్డి,బిజెపి శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి , శాసనసభాపక్ష ఉపనేత, అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు , ముధోల్ ఎమ్మెల్యే రామారావు పవార్ , నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడదానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కారణమని బీజేపీ శాసనసభ పక్ష సమావేశం ఆరోపించింది.రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ పక్షం అసెంబ్లీలో గొంతు విప్పుతుందని సమావేశం ప్రకటించింది. దీని కోసం మార్చి 7 తేదీన బీజేఎల్పీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ నుంచి పర్యటన ప్రారంభిస్తామని బీజేపీ పక్ష నేత యేలేటి మహేశ్వర రెడ్డి ప్రకటించారు.అన్ని జిల్లాల్లో పర్యటించిన తరువాత అసెంబ్లీ సమావేశాలలో అవలంభించ వలసిన వ్యూహాన్...

నిజామాబాద్ వాసులే డీఎస్ వారసులు పీస్ ర్యాలీలో ధర్మపురి సంజయ్

Image
( ప్రీతం రెడ్డి) నిజామాబాద్; కులాలు, మతాలు అంటూ రెచ్చగొడుతూ కొందరు రాజకీయ లబ్ధి కోసం వారి ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తున్నారని అందుకే ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందని మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ పేర్కొన్నారు. శనివారం నిజామాబాద్ నగరంలో నిర్వహించిన పీస్ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ లో ఉండే ప్రజలు అందరూ తన తండ్రి డి శ్రీనివాస్ వారసులేనని, వారు తమకు జన్మనిచ్చినా... ప్రతి ఒక్కరి హృదయాల్లో వారు చిరస్థాయిలో ఉండిపోతారన్నారు. నిజామాబాద్ అంటేనే మినీ భారతదేశం అని అలాంటి ఈ జిల్లాలో కొందరు రాజకీయ పార్టీ నాయకులు మతవిద్వేషాలను రెచ్చగొడుతూ కులాలు మతాల మధ్య చిచ్చు రేపుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు. తన తండ్రి హయాంలో అన్ని కులాలు, మతాలను దగ్గరికి తీసుకొని ఎవరికి ఏ కష్టం వచ్చినా పరిష్కరించే దిశగా కృషి చేసేవారని ఆయన అన్నారు. కానీ ఈ మధ్యకాలంలో కొందరు రాజకీయాలకు ప్రయోజనాల కోసం హిందూ ముస్లింలు సోదరులుగా పిలుచుకునే అప్పటి సంస్కృతిని ఇప్పుడు ఉన్న ఓ రాజకీయ పార్టీ నాయకులు రెచ్చగొడుతూ అల్లర్లకు ప్రోత్సహిస్తున్నారని ఇకనైనా వారి పద్ధతి మానుకోవాలన్నారు. నిజామాబాద్ అంటేనే రాష్ట్రంలోనే కాదు దేశంలోన...

కెసిఆర్ కు పట్టిన గతే రేవంత్ ఉద్దీన్ కు పట్టడం ఖాయం

Image
ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్ పాల్ సూర్యనారాయ గతంలో సీఎం కేసీఆర్ హిందువులపై అవమానించే విధంగా హిందుగాళ్లు బొందు గాళ్లు అంటే తెలంగాణ ప్రజలు ఆయనను బొంద పెట్టారని ఆయనకు పట్టిన గతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పట్టడం ఖాయమని ఇందూరు అర్బన్ శాసనసభ్యులు శ్రీ ధన్ పాల్ సూర్యనారాయణ తీవ్రస్థాయిలో విమర్శించారు. శనివారం కామారెడ్డి నుండి బాన్సువాడకు వెళ్తున్న ఎమ్మెల్యేను గాంధారి క్రాస్ రోడ్ లో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో దేవి దేవతల మీద ప్రమాణం చేసి గెలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో హిందూ ఆలయాలపై, దేవతలపై, హిందూ మహిళలపై దాడులు జరగడం అరాచకమని ఇది కాంగ్రెస్ ప్రభుత్వం గుండాయిజానికి పరాకాష్ట అని విమర్శించారు. మన మున్సిపల్ ఎన్నికల తర్వాత కామారెడ్డిలో తమ ఎమ్మెల్యే పై దాడులు, బాన్సువాడ పట్టణంలో హిందూ మహిళపై దాడి ఘటన ,ఓల్డ్ సిటీలో హనుమాన్ ఆలయం పై దాడి ఘటన చూస్తుంటే హిందువులందరూ కాంగ్రెస్ పార్టీపై విసిగిపోతున్నారని ఎమ్మెల్యే అన్నారు. రేవంత్ రెడ్డి గా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ అంటే ముస్లిం ముస్లిం అంటే కాంగ్రెస్ అని చ...

దేశంలో తొలి సారి మావోయిస్టు మాజీ నేతలతో సీఎం చర్చలు

Image
మావోయిస్టు మాజీ అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన రాజకీయ చర్చలు సక్సెస్ అయినట్లు సమాచారం. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ప్రభుత్వం మావోయిస్టు పార్టీలో టాప్ లీడర్లుగా పనిచేసి లొంగిపోయిన అగ్ర నాయకులతో భేటీ కావడం రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసింది. సరికొత్త చర్చకు దారి తీసింది. దేశంలో మొదటిసారి మావోయిస్టు మాజీలతో అధికారిక భేటీగా సరికొత్త రికార్డు సృష్టించినది. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో హోంశాఖ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ భేటీలో మొవోయిస్టు పార్టీ టాప్ లీడర్ దేవీజీ,రాజారెడ్డి,చంద్రన్న,దామోదర్, నర్సింహారెడ్డి,సుజాతక్క సీఎం తో మాట్లాడారు. జైలల్లో ఉన్న మావోయిస్టు ఖైదీలను కలిసే అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం ను కోరినట్లు సమాచారం. వారితో కలిసి లొంగుబాట్ల మీద ప్రజలకు బహిరంగ లేఖ విడుదల చేస్తామని మాజీ అగ్ర నేతలు ప్రతిపాదించారు. సరెండర్ పాలసీ అమలులో ఉన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకు వెళ్లారు.సరెండర్ పాలసీ మీద అసెంబ్లీ లో ప్రకటన చేసి చర్చకు పెడతామని సీఎం హామీ ఇచ్చారు. ఈ కీలకమైన ప్రత్యేక సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీ...

🌾 నిజాంబాద్‌లో పసుపు రైతుల ఆందోళన 🔥 ఈ-నామ్ పని చేయక మార్కెట్‌లో ఉద్రిక్తత!

Image
పసుపు రైతులు ఆందోళన.. నిజాంబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా పసుపుకు మద్దతు ధర రాకపోవడం అలాగే ఈ నామ్ మార్కెట్ ఆన్లైన్ విధానం పనిచేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు మార్కెట్లోని కార్యాలయం ఆద్దాలను ధ్వంసం చేసి మరి నిరసన తెలియజేశారు మార్కెట్ కమిటీ చైర్మన్ ను గెరావ్ చేశారు. గత కొన్ని రోజులుగా నిజాంబాద్ వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు నిలిచిపోయాయి ఈనాం ఆన్లైన్ విధానం పనిచేయకపోవడంతో మార్కెట్ మొత్తం పసుపుతో నిండిపోయింది ఒకవైపు ధరలు లేక మరోవైపు ఆన్లైన్ విధానం పనిచేయక పసుపు రైతులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

Image
తెలంగాణ రాజకీయాల్లో బలమైన క్రేజీ లీడర్లు ఇద్దరు భేటీ కావడం రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించనుందా అంటే అవుననే సమాధానం వస్తోంది.. నిజామాబాద్ లో RTO గా పని చేసిన కోమటిరెడ్డి మోహన్రెడ్డి మనుమరాలి వివాహ కార్యక్రమం దీనికి వేదిక అయ్యింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధపడుతూ, దక్షిణ తెలంగాణలో బలమైన నేతగా ఎదిగిన మునుగోడు MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,BRS ట్రబుల్ షూటర్ హరీష్ రావు భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. ఫంక్షన్ లో ఈ ఇద్దరు నేతలు సిరియస్గా చర్చించుకుంటున్న వీడియో షోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. రాజగోపాల్ రెడ్డి సీరియస్ ప్రజెంటేషన్ ఇస్తుంటే..అంతే సీరియస్ గా వింటూ హరీష్ రావు ఏమి చేద్దాం అంటూ నెత్తి కొట్టుకుంటున్న వీడియో పొలిటికల్ పార్టీల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముందు ఇచ్చిన మాట ప్రకారం ఇస్తే మంత్రి పదవి ఇవ్వండి..లేకుంటే ముఖ్యమంత్రి సీటే టార్గెట్ అంటూ ఇటీవలి కాలంలో బహిరంగంగా ధమ్కీ ఇచ్చారు రాజ గోపాల్ రెడ్డి.. వీళ్ళు మాట తప్పితే మునుగోడును మీరు చూసుకోండి..తెలంగాణలో జెండా పాతే పనిలో నేనుంటా నంటూ కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి చేసిన ప...

చెవి ఆపరేషన్ తరువాత పేషేంట్ మృతి..

Image
చెవిలో చీము కారుతుందని ఆసుపత్రికి వస్తే యువకుడి ప్రాణం పోయింది. ఆసుపత్రి వైద్యుని నిర్వాకం వల్లే యువకుడు చనిపోయాడు బంధువులు ఆస్పత్రి ఎదుట మృతదేహంతో తో ఆందోళన చేపట్టారు. భీంగల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన గంగం అజయ్ (23) మంగళవారం ఉదయం 10 గంటలకు చెవిలో చీము కారడంతో జిల్లా కేంద్రంలోని ద్వారకా హాస్పిటల్లో చేరారు. అతనిని పరీక్షించిన వైద్యులు సర్జరీ చేసేందుకు నిర్ణయించారు. సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు అజయ్ కి శస్త్ర చికిత్స చేశారు. కానీ సర్జరీ జరిగిన తరువాత పెషేంట్ కు మెలుకువ రాలేదు. దీంతో డాక్టర్ హుటాహుటిన పేషెంట్ అజయ్ ని సమీపంలో ఉన్న హోప్ ఆస్పత్రికి తరలించారు.. అజయ్ ని పరీక్షించిన హోప్ ఆసుపత్రి వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు.ఒక్కసారిగా షాక్ గురైన కుటుంబ సభ్యుల రోధనలతో ఆసుపత్రి ప్రాంగణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.. సమాచారం అందుకున్న మృతుడి బంధువులు, స్నేహితులు, గ్రామస్థులు ద్వారక ఆసుపత్రి ఎదుట న్యాయం చేయాలంటూ మృతదేహంతో బైఠాయించారు.

కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ - బద్నాం షబ్బీర్ కు - KVR సేఫ్ సైడ్

Image
కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ బద్నాం షబ్బీర్ కు KVR సేఫ్ సైడ్ (జమాల్పూర్ గణేష్ ములుపురు రాజేంద్ర బాబు) కామారెడ్డి కాలేజీ భూముల వివాదంలో కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టారు MLA కాటిపల్లి వెంకట రమణ రెడ్డి.దూకుడు,దుందుడుకు స్వభావిగా ముద్ర పడిన రమణ రెడ్డి చాణక్య నీతితో తాపీగా బాల్ ను కాంగ్రెస్ గ్రౌండ్ లోకే తోసి తమాషా చూస్తున్నారు.. ఇక రమణ రెడ్డి మీద విమర్శలు,ఆరోపణలతో చీటికి మాటికి చికాకు కల్పిస్తున్న కాంగ్రెస్ పార్టీనే నిర్దిష్ట,రికార్డుల ప్రాతిపదికన తేల్చాల్సిన అనివార్య పరిస్థితుల్లోకి నెట్టివేయ బడింది. కాంగ్రెస్ పార్టీకి కామారెడ్డిలో పెద్ద దిక్కుగా ఉన్న రాజకీయ ప్రత్యర్థి షబ్బీర్ అలీ నోటికి తాళం వేసే వ్యూహంలో భాగంగానే రమణ రెడ్డి అనూహ్యంగా యూ టర్న్ తీసుకున్నారు. తన పైన కాలేజీ భూముల వ్యవహారంలో వస్తున్న విమర్శల నిగ్గు తేల్చాలని కలెక్టర్ను కలిసి లేఖ ఇవ్వడం సంచలనం అయ్యింది. ఇప్పుడు ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న కలెక్టరుకు కాలేజీ భూముల్లో  MLA ప్రమేయాన్ని గుర్తించడం,అక్రమాలను గుర్తించడం,దీనిలోనూ రమణ రెడ్డి జోక్యాన్ని నిర్దారించడం అనేది కత్తిమీద సామే. భూములను ఏయే సంస్థలకు ఎన్ని ఎకరాలు కేట...

CSI గ్రౌండ్లో చర్చకు రా.. MLA వెంకట రమణ రెడ్డికి - కాంగ్రెస్ సవాల్

Image
  కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి తీరుపై కాంగ్రెస్ నిప్పులు చెరిగింది. 'వీధి రౌడీలా మాట్లాడుతున్నావు.. నీ బండారం బయటపెడతాం!'అంటూ మండి పడింది. కాంగ్రెస్ సంధించిన ప్రశ్నలు; 1)​రిటైర్డ్ ఉద్యోగుల భూమి కబ్జా: తన విద్యాసంస్థ పక్కన ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల భూమిని కబ్జా చేసి ప్రహరీ గోడ కట్టింది నువ్వు కదా?కోర్టు ఆర్డర్లను సైతం లెక్కచేయకుండా 30 వేల గజాల భూమిని బెదిరించి 3 వేల గజాలకు తగ్గించలేదా? 2 )​కర్షక్ విద్యాసంస్థల కుంభకోణం: రైతుల బిడ్డల కోసం సేకరించిన 260 ఎకరాల భూమిని అరోరా ఇంజనీరింగ్ కాలేజీకి దారదత్తం చేసి, ఆ భూములను బ్యాంకులో కుదవపెట్టి రూ. 7 కోట్లు తీసుకున్నది వాస్తవం కాదా? 3)ఫోర్జరీ సంతకాలపై కోర్టు కేసులు ఉన్నవా లేవా? 4)"మూడు నెలల క్రితం జపాన్ పర్యటన వెనుక అసలు కథ ఏంటి? అక్కడ ఏం చేశావో సెకండ్ ఎపిసోడ్‌లో నీ బండారం బయటపెడతాం" అని హెచ్చరించారు. 5) ​రోడ్డు నిర్మాణం వెనుక కమీషన్లు: టేక్రియల్ నుండి లింగాపూర్ 100 ఫీట్ల రోడ్డును ఎమ్మెల్యే కాకముందు అడ్డుకున్న వ్యక్తివి, ఇప్పుడు ముందుండి ఎందుకు వేయిస్తున్నావు? అందులో నీకు ఎంత ముట్టింది? 6)​వరుస మోసాలు - బెదిరింపులు ​ఎమ్మెల్...

వంటపనిలోనూ తగ్గేదేలే.. -- కులాంతర ప్రేమ పెళ్లి -- మేయర్ ఉమ తండ్రి ప్రముఖ జర్నలిస్టు

Image
  (జమాల్పూర్ గణేష్, ప్రీతం రెడ్డి) ఆమె నగర ప్రథమ పౌరురాలు.తెలంగాణలోనే అతిపెద్ద మూడవ  మునిపల్ కొర్పొరేషన్ మేయర్గా ప్రమాణం చేశారు.ఆరోజు అంతా బిజీ బిజీగా గడిపారు.నిజామాబాద్ లో బుటిక్ నడుపుకునే అతి సాధారణ సగటు మహిళ.పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వల్ల ఊహించని ప్రోటోకాల్ పోస్టు సొంతమైంది కూడగాయల ఉమారాణికి..దీనితో ప్రమాణ స్వీకారం చేసిన రోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,మహేష్ కుమార్ గౌడ్ తదితర ఉద్దండులతో మర్యాద పూర్వక భేటీలు..కాంగ్రెస్ శ్రేణులతో సంబరాల్లో గడిచి పోయింది.మరుసటిరోజు యధావిధిగా ఇంటి పనులు,వంట పనుల్లో నిమగ్నం అయ్యారు నగర ప్రధమ పౌరురాలు..అదే సమయానికి మన నిజామాబాద్ వీడియో జార్నలిస్టు పొద్దుటూరు ప్రీతం రెడ్డి మేయర్ ఇంటి పనుల్లో బిజీ అయిన తీరును చిత్రీకరించారు..   గ్యాస్ స్టవ్ వెలిగించి పప్పుచారు కాస్తూనే.. మరో సైడ్ చాయ్ చేశారు..నడుమ కిచెన్ సర్దడం.పోపు డబ్బాలు,మసాలా దినుసులు క్రమంగా సర్దుకుని ఇల్లాలుగా భాద్యతలు పూర్తి చేసుకున్నరూ. మేయర్ కిచెన్ నుంచి హాల్ లో కొద్ది సేపు టీవీ చూసారు.ఆతరువాత భర్త కరాటే రమేష్ తో కలిసి బంధు మిత్రులతో కలిశారు మేయర్ ఉమారాణి. స్నేహితులు,హితులు వారిద...

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

Image
(జమాల్పూర్ గణేష్, రాజేంద్ర బాబు) పీసీసీ చీ ఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రాంగం ఫలించింది. మజ్లీస్ పార్టీతో జతకట్టి మేయర్ పీఠాన్ని చేజిక్కించుకుంది.ఆ పీఠంపై అతి సాధారణ మహిళ కూరగాయల ఉమా రాణిని కూర్చోబెట్టింది కాంగ్రెస్ పార్టీ.నలభై ఏళ్లుగ మహేష్ కుమార్ గౌడ్ కు అత్యంత నమ్మిన బంటుగా కొనసాగుతూ వస్తున్న కసాబ్ గల్లీ కరాటే రమేష్ సతీమణిని అసాధారణ రాజకీయ సమీకరణాలు మేయర్ పదవికి  దరిచేర్చింది. మహేష్ కుమార్ గౌడ్ కు ఆత్మగా వ్యాపార దిగ్గజంగా ఉన్న కాటిపల్లి నరేందర్ రెడ్డి సతీమణి ని మేయర్ పీఠంపై కూర్చోబెట్టేందుకు పడరాని పాట్లు పడ్డారు.. అయితే ఆమె కార్పొరేటర్ గా గెలవలేక పోయింది.20 కోట్లు ఖర్చు చేసిన ఫలితం లేకపోవడంతో సాధారణ మహిళ కార్పొరేటర్లు ఉమారాణి,పంచ రెడ్డి లలిత, పూజిత గౌడ్ మేయర్ పదవి కోసం పోటీపడ్డారు.  NSUI,యూత్ కాంగ్రెస్ లో చురుకైన పాత్ర పోషించడంతో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పంచ రెడ్డి చరణ్ సతీమణి లలిత కు దాదాపుగా పదవి ఖాయం అయ్యిందని ప్రచారం జరిగింది.. వరుసగా మేయర్ పదవిని మూడు సార్లు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే అనుభవించడం లలిత అవకాశాలను నీరు గార్చింది.. ...

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

Image
జమాల్పూర్ గణేష్...✍️  ఎంపీ అర్వింద్ ఏది మాట్లాడినా ట్రిండింగే..మౌనంగా ఉన్నా రాజకీయ ప్రత్యర్థులకు తొండను మింగిన అనుమానమే అంటే అతిశయోక్తి కాదేమో... మన ఇందూరు-మన మేయర్ ట్యాగ్ లైన్ తో పాటు హిందూత్వ ఎజెండాను గల్లీ గల్లీల్లో విస్తృతంగా ప్రచారం చేసి సింగిల్ హ్యాండ్ తో 28 సీట్లను సంపాదించిన అర్వింద్ నడవడిక ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది..  నిజామాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఫలితాల మరుసటిరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేస్తారని ఎదురు చూశాయి అనేక వర్గాలు.. ఈ అంచనకు భిన్నంగా గంభీరంగా, రెండు మూడు అంశాలకే పరిమితము అయ్యారు.28 సీట్లు తక్కువేమీ కాదంటూనే ప్రతిపక్షంలో కూర్చుంటామని సాదా సీదాగా చెప్పి ,మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక వ్యవహారంపై ప్రస్తావనకే పరిమితం అవ్వడంపై కూడా చర్చ సాగుతోంది. సహజమైన నైజానికి భిన్నంగా అర్వింద్ కూల్ గా ,గుంభనంగా, శాంతంగా కనబడడం కూడా ప్రత్యర్థి పార్టీల్లో చర్చకు తావిచ్చినట్లు స్పష్టమైతోంది.ఇది ఎంతదాక పోయిందంటే ఆయనతో తిరిగే కమలం ముఖ్య కార్యకర్తలు సైతం సోమవారంనాడు మేయర్ ఎన్నికలో ఏమి జారుగుతాదో చూడండి అనేదాక పోయింది అర్వింద్ ...

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

Image
జమాల్పూర్ గణేష్.... ✍︎ పదేళ్ల తర్వాత మరోసారి కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పాలనా పగ్గాలు చేపట్టబోతోంది. దీనికోసం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. ఫలితాలు వెలువడిన తరువాత శుక్రవారం రాత్రి జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు నగేష్ రెడ్డి నివాసంలో ముఖ్య నాయకులు,కార్పిరేటర్లతో భేటీ అయి సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. గత పదేళ్లు BRS అనుసరించిన పొలిటికల్ ఫార్ములనే అనుసరించి MIM తో జాతకట్టాలని సూత్ర ప్రాయంగా నిర్ణయానికి వచ్చారు.. ఇంతకు మించి వేరే ప్రత్యామ్నాయ మార్గమేమి లేదనే అంచనాకు వచ్చారు మహేష్ గౌడ్. మజ్లీస్ తో జతకటితే మేయర్ పీఠాన్ని హస్తగతం చేసుకునేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 31ను చేరుకునే తప్పని పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ మునిసిపల్ లో గతంలో కంటే 15 సీట్లు ఎక్కువగా సాధించింది.17 సీట్లు చేజిక్కించుకున్న కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ ను పొందాలంటే ఇంకా 14 మంది సంఖ్యా బలం అవసరముంది. కరెక్టుగా..కాకతాలియంగా MIM ఈ సారి 14 సీట్లు గెలుచుకోవడం కాంగ్రెస్ కు కలిసి వచ్చింది..ఇక ఎక్సఫీపియో ఓట్లతో పనిలేకుండా MIM తో జతకట్టి మేయర్ పదవిని సొంతం చేసుకోబోతోంది కాంగ్ర...

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

Image
జమాల్పూర్ గణేష్.... ✍︎ తెలంగాణ రాజకీయాల్లో ఇద్దరు ఉద్దండుల మధ్య జరిగిన బల్దియా పోరు టగ్ ఆఫ్ వార్ ను తలపించింది. అభ్యర్థులు ,పార్టీల బలాబలాలు పక్కకు జరిగిపోయాయి.. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,MP అర్వింద్ ల మధ్య ఆధిపత్య పోరు గా నిలిచింది నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నిక.. ఈ ఇద్దరు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు.. నరేందర్ రెడ్డి సతీమణిని శమంత ను మేయర్ పీఠం పై కూర్చోపెట్టడానికి మహేష్ గౌడ్... స్రవంతికి పట్టాభిషేకం చేయడానికి అర్వింద్ పట్టు బిగించి పనిచేశారు.. అంతటితో ఆగలేదు ఈ ఇద్దరి ఫైట్.. మేయర్ అభ్యర్థులను ఓడించేందుకు ఆరో డివిజన్లో మహేష్ గౌడ్,19 వ డివిజన్ లో అర్వింద్ ప్రత్యర్థి అభ్యర్థులను    ఓడించేందుకు  అనేక పాచికలు వేశారు.. ఈ రాజకీయ ఆధిపత్య పోరు పోలింగ్ ప్రక్రియను సైతం ప్రభావితం చేసింది.. ఫైనల్గా కాంగ్రెస్,బీజేపీ మధ్య ఓట్ల యుద్ధం సైతం గంభీర్యంగా నిలిచింది.. కమలం పార్టీని,అర్వింద్ కు ముగుతాడు వేసేందుకు మహేష్ గౌడ్ మంత్రాంగం చేసినా ఫలితం కనపడే పరిస్థితి లేదనే అంశం పోలింగ్ ప్రక్రియతో తేటతెల్లమైంది.. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లోనూ కమల వికాసం స్పష్టంగా ...