Posts

తెలంగాణపై విద్వేషం చరిత్రను ఏమార్చే కుట్ర

Image
తెలంగాణ ఉనికిపై TDP వ్యాఖ్యలు.. చారిత్రక ఆధారాలతో తెలంగాణ వాదుల కౌంటర్ ఎప్పటిలాగే తెలంగాణ మీద విషం చిమ్మింది తెలుగుదేశం పార్టీ.TDP ఆవిర్భావ పండుగ వేళా ఆంధ్ర రాజధాని మంగళగిరి వేదికగా తెలంగాణను అవమానిస్తూ మాట్లాడారు పొలిట్బ్యూరో సభ్యుడు నర్సింహులు. తెలంగాణ ఉనికిని ప్రశ్నిస్తు డిక్షనరిలో తెలంగాణ లేనే లేదు అని అన్నారు. ఈ మాటలు నిమిషాల్లోనే సోషల్ మీడియాలో రాకెట్ స్పీడ్ లో వైరల్ అయ్యింది.తెలంగాణ వాదులు కౌంటర్లతో విరుచుకుపడ్డారు.. చరిత్రలో తెలంగాణ ఉనికికి సంబంధించిన సమాచారం మన నిజామాబాద్ పాఠకుల కోసం... *తెల్లాపూర్ శాసనం (క్రీ.శ. 1417). తెలంగాణ అనే పదం స్పష్టంగా చెక్కబడింది! *వెలిచర్ల శాసనం (క్రీ.శ. 1510) తెలంగాణ ముఖభూమి అని ప్రస్తావన ఉంది! * తిరుమల శాసనాల్లో శ్రీకృష్ణదేవరాయలు ‘తెలంగాణ దుర్గాలు’ జయించినట్లు రాయబడింది! *అమీర్ ఖుస్రో… క్రీ.శ. 1318లోనే “తిలంగి” అనే పదంతో తెలంగాణ భాషను ప్రస్తావించాడు! *పాల్కురికి సోమనాథుడు తన రచనల్లో తెలంగాణ నేల వైభవాన్ని పలికించాడు! * విద్యానాథుడి “ప్రతాపరుద్ర యశోభూషణం”లో… త్రిలింగ దేశ గౌరవం వెలుగొందింది! * అబుల్ ఫజల్ “అయి...

నక్సల్బరీ తొలి అమరులు మహిళలే..! చరిత్రలో నిలిచిన మే 25 ఘటన

Image
నక్సల్బరీ తొలి అమరులు మహిళలే..! (వ్యాసకర్త ;S A. డేవిడ్) ........ మే 25, 1967. మధ్యాహ్నం 2 గంటలు. నక్సల్బరీ సమీపంలోని బెంగాయ్ జోట్ గ్రామం. ధనేశ్వరి దేవి నాయకత్వంలో వందలాది మంది మహిళలు గుమిగూడి ఉన్నారు. స్ధానిక భూస్వామికి వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించడానికి మహిళలంతా గుమిగూడి వున్నారక్కడ. పరిస్థితి ఉద్రిక్తంగా వుంది. ఏ క్షణంతో ఏం జరుగుతోంది తెలియని స్థితి. అంతకు రెండు రోజుల నుండి ఆ ప్రాంతంలో స్థానిక రైతు కూలీలకూ,పోలీసులకూ మధ్య చెదురుమదుర సంఘటనలు జరుగుతూనే వున్నాయి. మే 24 వ తేదీన 'బిగుల్ కిషన్' అనే గిరిజన రైతు తాను సాగు చేసుకుంటున్న భూమిపై కోర్టు తీర్పు అతనికి అనుకూలంగా వచ్చింది. బిగుల్ కిసాన్ అప్పటికే సీపిఎం పార్టీ అనుబంధ రైతు సంఘమైన ’కృషక్ సభ‘లో సభ్యుడిగా ఉండేవాడు. ఆ సంవత్సరం మార్చిలో జరిగిన ఒక సమావేశంలో కృషక్ సభ కౌలు రైతులుగా వున్న వాళ్ళు తమ భూములను స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమైన తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని దృష్టిలో వుంచుకున్న కిషన్, తనకు అనుకూలంగా ఇచ్చిన కోర్టు తీర్పును చేతబట్టుకొని మే 21న కిసాన్ తన పంటను కోయడానికి వెళ్ళాడు. ఇదే అదునుగా భావించిన భూస్వామి ట...

PCC చీఫ్ పై ' బిగ్' కుట్ర -- మహేష్ ఇమేజ్ డ్యామేజ్

Image
(జమాల్పూర్ గణేష్, మూల్పూరు రాజేంద్ర బాబు)✍︎ తెలంగాణ కాంగ్రెస్ లో ఎదిగి వచ్చిన బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ మీద 'బిగ్' కుట్ర జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడి నేతృత్వంలో నడుస్తున్న ఒక టీవీ చానల్ లో శుక్రవారం అన్ని బులెటిన్లలో మహేష్ గౌడ్ ను విఫల పీసీసీ చీఫ్ గా నమ్మించడానికి వార్తలను వండి వార్చారు. 20 ఏళ్లుగా ఇలాంటి కుక్డ్ బులెటిన్స్ ఏ పీసీసీ అధ్యక్షుడి మీద..ఏ ఛానల్ లోనూ ప్రసారం కాకపోవడం విశేషం. తెలంగాణ రాజకీయాల్లో బీసీ రాజ్యాధికారం కాంక్ష ఇటీవలి కాలంలో తారా స్థాయికి చేరుకుంది. సమీప భవిష్యత్తులో వచ్చే ఏ ఎన్నికల్లో అయినా బీసీ లకు రాజకీయ ప్రాధాన్యం పెంచక తప్పని సరి పరిస్థితిని అన్ని పార్టీలు ఎదుర్కోబోతున్నాయి.. ఈ నేపథ్యంలో మహేష్ గౌడ్ ను రేవంత్ కొలువులో చేర్చి..అవసరమైతే బీసీ కోటలో డిప్యూటీ సీఎం పదవిని అప్పచెబుతారని ఇటీవలి కాలంలో బలమైన ప్రచారం జరుగుతోంది. మహేష్ స్థానంలో మరో బీసీ కి పీసీసీ పగ్గాలు అప్పచెబుతారని... ఇలా బీసీ సంతుష్ట వైఖరితో తెలంగాణలో సోషల్ ఇంజనీరింగ్ చేయాలని జనపథ్ 10 వర్గాలు ఆలోచిస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాల్లో వినబడుతోంది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా మహేష్ ...

64 ట్రాన్స్ ఫార్మర్లను ధ్వంసం చేసిన అంతర్జిల్లా దొంగల ముఠా అరెస్ట్.. 80 కిలోల కాపర్ కాయిల్స్ స్వాధీనం

Image
జిల్లాల్లో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను ధ్వంసం చేస్తూ, వాటిలోని రాగి (కాపర్) కాయిల్స్ ను అపహరిస్తున్న ఐదుగురు సభ్యుల అంతర్జిల్లా దొంగల మురాను రెంజల్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. లక్షల విలువైన 80 కిలోల కాపర్ కాయిల్స్, దొంగతనాలకు ఉపయోగించిన 3 మోటార్ సైకిళ్లు, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా వెనుక ఉన్న నలుగురు స్క్రాప్ (పాత ఇనుప సామాను) వ్యాపారులపై కూడా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి సాయి చైతన్య వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. గురువారం (మే 21) సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రెంజల్ సట్- ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో కలిసి సాటాపూర్ బైపాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో మూడు మోటార్ సైకిళ్లపై అనుమానాస్పదంగా వస్తున్న ఐదుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది వారిని వెంబడించి పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న గన్నీ బ్యాగును తనిఖీ చేయగా, అందులో భారీ మొత్తంలో ట్రాన్స్ ఫార్మర్ కాపర్ కాయిల్స్ లభ్యమయ్యాయి. ప...

గల్ఫ్ కార్మికుల ఓట్లు తొలగిస్తే ఊరుకోం.. ఉమ్మడి నిజామాబాద్ నేతలతో KTR

Image
గల్ఫ్ కార్మికుల ఓట్లు తొలగిస్తే ఊరుకోం --ఉమ్మడి నిజామాబాద్ నేతలతో KTR ........ జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళిన తెలంగాణ బిడ్డల ఓటు హక్కును కాపాడేందుకు పార్టీ తరఫున ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. త్వరలో రాష్ట్రంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఓటర్ల ఓట్ల జాబితా సవరణ కోసం ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న SIR కార్యక్రమానికి సంబంధించిన విషయంలో లక్షలాది మంది తెలంగాణ ఎన్ఆర్ఐల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నదని కేటీఆర్ అన్నారు. ఈ విషయంలో గల్ఫ్ బాట పట్టిన తెలంగాణ బిడ్డల ఓటు హక్కులు తొలగించకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని పార్టీ తరఫున కలుస్తామని తెలిపారు. శుక్రవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నివాసంలో జరిగిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జీల సమావేశంలో సీనియర్ నేతలతో కూడిన సమీక్షా సమావేశంలో కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఇప్పటికే వందలాది మంది ఎన్ఆర్ఐలు తమ స్థానిక శాసన సభ్యులకు, మాజీ శాసన సభ్యులకు ఫోన్లు చేసి ఆందోళన చెందుతున్న విషయాన్ని కేటీఆర...

సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు సత్కారం.. ప్రశంసా పత్రాలు అందజేసిన జిల్లా యంత్రాంగం

Image
*సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు సత్కారం ............ నిజామాబాద్, మే 22 : వివిధ వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు చేరేలా సామాజిక మాధ్యమాల ద్వారా కృషి చేసిన సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రశంసా పత్రాలు బహూకరించి సత్కరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం జరిగిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి వేడుకలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ భూపతి రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నగర మేయర్ ఉమారాణి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ తదితరుల చేతుల మీదుగా సామాజిక మాధ్యమ కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్డు భద్రతా చర్యల గురించి విశేషంగా కృషి చేసిన దృష్ట్యా సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లను సత్కరించడం జరిగిందని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతి...

తెలంగాణ జన సమితిలో చేరిన బాస రమేష్ యాదవ్.. కోదండరాం సమక్షంలో పార్టీలోకి ఆహ్వానం

Image
తెలంగాణ జన సమితిలో బాస రమేష్ యాదవ్ ............ హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు బాస రమేష్ యాదవ్ ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ జన సమితి పార్టీలో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు బాల్కొండ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కూడా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బాస రమేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రొఫెసర్ కోదండరాం గారి నాయకత్వంలో పనిచేయడం గర్వంగా భావిస్తున్నానన్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన, తెలంగాణ పునర్నిర్మాణం కోదండరాం గారి నాయకత్వంలోనే సాధ్యమనే నమ్మకంతో టి.జే.ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ విలువలతో కూడిన రాజకీయం, ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం తెలంగాణ జన సమితి ప్రధాన లక్ష్యాలని తెలిపారు. ప్రస్తుతం డబ్బు కేంద్రంగా సాగుతున్న రాజకీయాల మధ్య ప్రజల ఆకాంక్షలనే అజెండాగా చేసుకుని టి.జే.ఎస్ పనిచేస్తోందన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ జన...

తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ ఎలా ఉంది..? ప్రజలేమనుకుంటున్నారు..?

Image
*ప్రజలేమనుకుంటున్నారు..?* ......... (కొండల్ ,సీనియర్ జర్నలిస్టు) డేంజర్ బెల్స్ తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ ఎలా ఉంది.? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్న తరహాలో 2034 ఎన్నికల నాటికి ఆయన సేఫ్ గా జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టే పరిస్థితి ఉన్నదా..? నాయకులు, ప్రజాప్రతినిధులు భావిస్తున్నట్లు తెలంగాణలో “లోకమంతా పచ్చగా” ఉందా..? ఇది వందిమాగధుల అభిప్రాయం కాదు. ఆస్థాన విశ్లేషకుల చిట్టా అంతకంటే కాదు. కానీ జనబాహుళ్యం ప్రతిస్పందన కూడా ఒకసారి ప్రభువులకు చేరాల్సి ఉంది. వాళ్లు భావిస్తున్నట్లు ఇప్పుడు తెలంగాణలో అధికార పార్టీకి ఆశాజనకమైన ఫలితాలు వచ్చే పరిస్థితి లేదు. పలు అంశాల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వివాదాస్పద శైలి, నిరంకుశత్వాన్ని నిర్భీతిగా నిరసించిన తెలంగాణ ఓటర్లకు నచ్చడం లేదు. తెలంగాణ అంటేనే ధిక్కారం. ప్రజల అవసరాలకు భిన్నంగా వ్యవహరించే ప్రభువులను ధిక్కరించే సంస్కృతి ఇక్కడిది. రాష్ట్రాన్ని సాధించానని అభిప్రాయంతో తనకిష్టమొచ్చిన రీతిలో పరిపాలించవచ్చని భావించిన కేసీఆర్ కు పదేళ్ల తరువాత పరాభవం తప్పలేదు. ఆయన పరాభవం తమ ప్రతిభ వల్ల అని ఎవరైనా భావిస్తే వాళ్లకు కూడా శంకరగిరి మాన్యాలు తప్పవని ...

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తొలి సమావేశం.. నాలుగు కేటగిరీల ప్రతిపాదనలు

Image
నాలుగు కెటగిరీల్లో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు.. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేశవరావు నేతృత్వంలో ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తొలి సమావేశం హైదరాబాద్ లో ఆదివారం జరిగింది. సమావేశంలో కమిటీ సభ్యులు ఎమ్మెల్సీలు ఫ్రొ,, కోదండరాం, అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి పాల్గొన్నారు.. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు ప్రభుత్వం నుండి అధికారికంగా కమిటీ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమావేశంలో ధన్యవాదాలు తెలిపారు.. అమరవీరుల జ్యోతి కింద ఉన్న ఆఫీస్ లో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ కార్యాలయం ఏర్పాటు చేసేలా కమిటీ లో నిర్ణయం తీసుకున్నారు. అమరవీరుల గుర్తింపు కోసం త్వరలో ఆల్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి వారి దగ్గర ప్రతిపాదనలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది.. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ,1969 ఉద్యమకారులు , ఉద్యోగ సంఘాలు, కళాకారుల జెఎసి, సబ్బండ వర్గాల జెఏసీ , కుల సంఘాల ,న్యాయవాదులు జేఏసీ,వివిధ జిల్లాలో ఏర్పడిన ఉద్యమ సంఘాలు వారి నుండి ప్రతిపాదనలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఉద్యమకారుల కమిటీ జిల్లా పర్యటనలు చేసి విసృతంగా ప్రజల అభిప...

అంటరానివాడ నుంచి అమెరికా వరకు.. వరంగల్ యువకుడి ప్రేమ, పోరాటం, విజయం

Image
--- అంటరానివాడ to అమెరికా--- వయా వరంగల్. ఎక్కడికి పోతన్నవు ? ఊళ్లెకు పోతన్న. ఇప్పడికీ కూడా దళిత వాడల్లో ఈ మాట తరచుగా వినబడుతూ ఉంటది చెప్పుకోడానికి ఊరు పేరున్నా కూడా ఊర్లో జానెడు జాగ మాత్రం ఉండదు, అలాంటి ఒక అంటరానివాడలో పుట్టి పెరిగిన పిలగాడు సురేష్ అమ్మానాన్న చనిపోయారు,చేతిలో డిగ్రీ మాత్రమే ఉంది ప్రాణంగా ప్రేమించిన వైష్ణవి ఇంట్లో గొడవలు ఏమిలేని అతన్ని పెళ్లి చేసుకొని ఏం సుఖపడుతావు అనే మాటలు,కానీ ఏ మభ్యపూరిత మాటలు వైష్ణవిని సురేష్ చేయి వదిలిపెట్టేలా చేయలేకపోయాయి, పెళ్లి చేసుకున్నారు, అనేక సమస్యలకు,సవాళ్లకు ఎదురునిలిచారు తన కంటే తన భార్య ఎదుగుదల ముఖ్యమని ఆలోచించిన సురేష్, ఎంతో ధైర్యంచేసి వైష్ణవిని 2023 ఆగస్టులో ఉన్నత చదువుల కోసం అమెరికా పంపించాడు. కొన్నాళ్లకి... తను కూడా అమెరికా వెళ్లి, అక్కడే ఒక సూపర్ మార్కెట్‌లో సామాన్యమైన ఉద్యోగం చేస్తూ.. పగలు రాత్రులు కష్టపడి భార్యను చదివించాడు. ఒక భర్తగా తన బాధ్యతను నెరవేరుస్తూనే, వైష్ణవి కన్న కలలకి రెక్కలిచ్చాడు. ఈరోజు ఆ కష్టానికి ఆ ధైర్యానికి ఆ సాహసానికి దక్కిన గౌరవం Christian Brothers University నుండి MBA (Healthcare A...

Information Commission, Nizamabad News, Right to Information, RTI Act, RTI Seminar, Telangana Government, సమాచార హక్కు చట్టం

Image
*సమాచార హక్కు చట్టంతో జవాబుదారీతనం* నిజామాబాద్, మే 15 : ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజలకు విశ్వాసాన్ని కల్పిస్తూ, పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడమే సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశ్యమని రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ డాక్టర్ జి.చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం సమాచార హక్కు చట్టం - 2005 పై పీఐఓలకు, ఏపీఐఓలకు, అన్ని శాఖల అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయగా, సమాచార కమిషనర్లు పీ.వీ.శ్రీనివాస్ రావు, దేశాల భూపాల్ లు హాజరయ్యారు. జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీఫ్ కమిషనర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో సమాచారం అందుబాటులో ఉంటేనే ప్రజలకు ఉపయోగమని, ప్రజలు కోరిన సమాచారాన్ని వారికి తెలియజేసే బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును సమాచార హక్కు చట్టం ద్వారా కల్పించబడిందని గుర్తు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలల...

Dilip Kumar,Encroachment,Government Lands,Nizamabad Municipal,nizamabad news,Sanitation,మున్సిపల్ జాగాలు,

Image
గురువారం నగరంలోని నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ పలు డివిజన్లో ఆకస్మికంగా పర్యటించారు. డివిజన్ నంబర్ 41 డివిజన్ నంబర్ 12లో తనిఖీలు నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా శానిటేషన్ కార్యక్రమాలు తాగునీటి సరఫరాపై పరిశీలన చేశారు. అదేవిధంగా మున్సిపల్ ప్రభుత్వ భూముల రక్షణలో భాగంగా ప్రభుత్వ ఖాళీ స్థలాలను కూడా పరిశీలించారు. మున్సిపల్ ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా చూడాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై సంబంధిత అధికారులపై ఉందని ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ, డీ డీ ఈ...

మేయర్ ఉమారాణి పార్కుల బాట.. - వినాయక్ నగర్ వాకర్స్ తో భేటీ

Image
నిజామాబాద్ నగరం వినాయక్ నగర్ లో కల తెలంగాణ అమర వీరుల పార్క్ ను నగర మేయర్ ఉమారాణి రమేష్ సందర్శించచారు .అమర వీరుల పార్క్ లో సమస్యలను వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడారు .అమర వీరుల స్తూపం లో వర్షాకాలంలో నీరు నిలిసి లీకేజీ అవుతుందని, వాకర్స్ కు టాయిలెట్ సౌకర్యం కల్పించాలని, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని, వర్ష కాలం లో నీరు నిలవకుండా డ్రైనేజ్ నిర్మించాలని, త్రాగునీటి వసతి కల్పించాలని, దోమలు రాకుండా ప్రతి రోజు ఫ్యాగింగ్ చేయాలని, ఎక్సర్సైజ్ చేసే మిషన్ లను రిపేర్ చేయించాలని, ప్రతి రోజు చెత్త ను ఎత్తివేయాలని కోరారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం సుమారు 500 మంది సీనియర్ సిటిజన్స్ , పెద్దలు , మహిళలు, యువకులు , చిన్న పిల్లలు వస్తున్నారని ... అమర వీరుల పార్క్ పై ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని సమస్యలను పరిష్కరించాలని వాకర్స్ సబ్యులు వినోద్ కుమార్, ఆయుష్ పురు షో తం, రాజేందర్, రమేష్, దయానంద్, సాయగౌడ్, సంపత్, శ్రీనివాస్ గౌడ్, సామల ఒడ్డేన్న, చిన్నారెడ్డి కోరారు. పార్క్ కు మొదటిసారి వచ్చి సందర్శించినందుకు మేయర్ మేడమ్ కు వాకర్స్ శాలువాతో సత్కరించారు. పార్క్ లో అందరికీ అన్ని సౌకర్యాలు కల్...

నిజామాబాద్‌లో హనీ ట్రాప్ గుట్టురట్టు.. కిలాడి దంపతుల అరెస్టు

Image
హనీ ట్రాప్ సంఘటన నిజామాబాద్ లో వెలుగు చూసింది.పురుషుల బలహీనతను అలుసుగా చేసుకుని వలపు వల విసిరి హనీట్రాప్ కు పాల్పడుతున్న మహిళను పోలీసులు వల పట్టుకున్నారు. ఒంటరిగా ఉన్న మగ వారిని ముగ్గులోకి దించుతూ.. డబ్బులు ఇవ్వ కుంటే కేసులో ఇరికిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్న భార్యభర్తలను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ రూరల్ పీఎస్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముథ్కేడ్ తాలూ కా ముక్రంబాద్ గ్రామానికి చెందిన మంగేశ్ గైక్వాడ్, ఉజ్వల గైక్వాడ్ దంపతులు. వీరు రెండు నెలల క్రితం మాధవనగర్ గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే నివాసం ఉంటున్నారు. ఉజ్వల గైక్వాడ్ కంఠేశ్వర్ బైపాస్, ఆర్మూర్ రోడ్డు ప్రాంతంలో రోడ్డు పక్కన నిల బడి ఒంటరిగా వెళ్తున్న మగవారికి సైగలు చేసే ది. ఆమెను చూసి ఆమె దగ్గరకు వచ్చిన మగ వారిని తాను వ్యభిచారం చేస్తానని డబ్బులు ఒంటరిగా ఉన్న మగవారిని ముగ్గులోకి దించుతూ అక్రమ వసూళ్లు చేసి మాట్లాడుకొని అతని బైక్ పై కూర్చుని నిర్మా నుష్య ప్రదేశానికి తీసుకువెళ్లేది. అప్పటికే వీరు వెళ్తున్న బైక్ను వెనకాల నుంచి ఆమె భర్త మంగేశ్ గైక్వాడ్ ఫాలో చేసేవాడు. ...

ట్రాన్స్ జెండర్ల బహిష్కరణ.. ఇందూరు గడ్డపై VDCల ఆగడాలు

Image
నగరంలోని కలెక్టరేట్​ ఎదుట ట్రాన్స్​జెండర్లు ధర్నాకు దిగారు. తమను గ్రామాల్లోకి రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రజావాణి లో అధికారులకు ఫిర్యాదు చేశారు. ట్రాన్స్​జెండర్స్ సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఓరుగంటి గంగ, జరీనా బేగం మాట్లాడుతూ.. గ్రామాల్లోకి ట్రాన్స్​జెండర్లు వీడీసీలు ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నాయని ఆరోపించారు. ఇటీవల సిరికొండ మండలం మైలారం గ్రామంలో చిన్న పిల్లల్ని అపహరిస్తున్నారంటూ భౌతికదారులకు దిగారన్నారు. అలాగే నందిపేట మండలం హుస్నాపూర్​లో హిజ్రాలను గ్రామపంచాయతీలో అక్రమంగా నిర్బంధించారని పేర్కొన్నారు. మోపాల్ మండలంలో హిజ్రాలు రావొద్దంటూ పోస్టర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్నారు. తమను పూర్తిగా సామాజిక బహిష్కరణ చేయడం ఎంతవరకు సబబని ట్రాన్స్​జెండర్లు ప్రశ్నించారు. ఎక్కడైనా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరిగితే వెళ్లి వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వారి జీవితం, వారి వ్యాపార లావాదేవాలు సుభిక్షంగా ఉండాలని తాము నిండు మనసుతో ఆశీర్వదిస్తామే తప్ప తమలో ఎలాంటి కల్మషం ఉండదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఇచ్చినంత తీసుకొని వస్తామని.. అలాంటి తమపై దుష్ప్రచారం చేయ...

మాక్లూర్ IKP కేంద్రంలో రైతుల అవస్థలు.. 20 రోజులైనా వడ్లు కొనని అధికారులు

Image
వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతుల గోస అంతా ఇంతా కాదు.. పండిన ప్రతీ గింజను కొంటున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటల డొల్లతనం బయట పడింది..20 రోజులుగా వడ్లు తెచ్చిన రైతులు IKP కొనుగోలు కేంద్రంలో నిరీక్షిస్తున్నా కొనే దిక్కు లేకుండా పోయింది. ఈ దుస్థిపై మన నిజామాబాద్ ప్రతినిధి ప్రీతం రెడ్డి నిర్వహించిన గ్రౌండ్ రిపోర్ట్ లో కండ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగు చూశాయి.. వివరాల్లోకి వెళితే... మాక్లూర్ ప్రాథమిక సహకార కేంద్రం ఇష్టారాజ్యంగా తయారయింది. వడ్ల కొనుగోలు సీజన్ కావడంతో రైతుల నుండి వడ్లను కొనుగోలు సెంటర్ల ద్వారా కొనుగోలు చేసి రైస్ మిల్లకు తరలించాల్సిన అధికారులు బాధ్యత మరిచి సంబంధిత మాక్లూర్ సొసైటీ కార్యదర్శి కార్యాలయంలో అందుబాటులో లేకపోవడం తో రైతులు తమ పండించిన ధాన్యాన్ని ఎవరికి విక్రయించాలో తెలియని అయోమయ పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. గంగారాం అనే రైతుతో పాటు 20 మంది తెచ్చిన వడ్లను కొనకుండా IKP సిబ్బంది సతాయిస్తున్నారు. ఇక చైర్మన్ సంగతి సరే ఆయన ఎప్పుడు వస్తాడు ..ఎప్పుడు వెళ్తాడో స్థానిక రైతులకే తెలియని పరిస్థితి ఏర్పడిందని రైతులు లబోదిబోమంటున్నారు. తాము వరి కోతలు కోసి 20 రోజులు కావస...

51 కులాల పేర్ల మార్పుకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం.. పర్యాయ పదాల చేర్పు

Image
కుల పేరు మార్పు.... పర్యాయ పదం చేర్పు... కులం.. స్థాయికి మరో రూపం. దేశ రాష్ట్ర స్థాయిలో కొన్ని కులాల పేర్లు వాటి తోకలు ప్రతిష్టాకరంగా ఉంటాయన్న భ్రమలో సమాజం ఉంట్టుంది. దానికి తగ్గట్టే వారికీ హోదా కూడా లభిస్తుంది, కానీ కొన్ని సంచార, అర్ధ సంచార, విముక్త జాతులు కుల పదాలు అభ్యన్తరకరముగా అనిపిస్తాయి. ఈమేరకు ఆయా కుల సంఘాలు తమ పేరును మార్చాలని సంవత్సరాల తరబడి విజ్ఞప్తులు పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం BC కమిషన్ ని ఏర్పాటు చేస్తూ నియమావళి రూపొందించి ఆయా కులాల పేర్లు మార్పుల చేర్పుల పై మార్గదర్శకాలను ఖరారు చేసింది. దీంతో కమిషన్ సూక్ష్మ స్థాయిలో పర్యటనలు నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక అందచేసింది. తుదకు కమిషన్ సిఫారసుల మేరకు 51 కులాల పేర్లు మారుస్తూ పర్యాయ పదాలు చేర్చి మంత్రి మండలి ఆమోదం పొందింది. BC - A లో 49 BC - E లో 2 కులాలకు DNT చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. * BC - A లో నెంబరు 4 గా ఉన్న బుడబుక్కల కులానికి శివ క్షత్రియ పేరును ప్రాయ పదంగా మార్చింది. * BC - A లో నెంబరు 5 క్రింద ఉన్న వన్నారు పదాన్ని తొలగించి దోబీ పేరుగా మార్చింది . దీని కింద చాకలి,...

హీరో విజయ్ కిరూట్ క్లియర్. తమిళనాడులో సంబరాలు

Image
తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మలుపులు చోటు చేసుకుంటున్నాయి. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళనాడు వెట్రి కళగం, ప్రభుత్వ ఏర్పాటు దిశగా కీలక అడుగులు వేస్తోంది. తాజా పరిణామాల ప్రకారం, లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ మద్దతు తెలపడంతో విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి మార్గం సుగమమైంది. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సీపీఐ ఎం,వర్కింగ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. విజయ్ పార్టీకి పూర్తి మద్దతు ఇవ్వాలని నిర్ణయించి నట్లు సమాచారం. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర కమిటీ అధికారికంగా ఆమోదించాల్సి ఉంది. సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలకు కలిపి మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు ఉండగా, వీరంతా టీవీకేకు మద్దతు తెలపడం విజయ్ బలాన్ని పెంచింది. తమిళనాడు అసెంబ్లీ లో మెజారిటీ మార్కు ను అందుకోవడానికి ఈ మద్దతు ఎంతో కీలకంగా మారింది. మరోవైపు, భారతీయ జనతా పార్టీ,ఈ రాజకీ య చదరంగంలో తటస్థంగా ఉండాలని నిర్ణయించుకుంది. తాము ఏ పార్టీకి ఓటు వేయమని, ప్రభుత్వ ఏర్పాటులో ప్రత్యక్షంగా పాల్గొనే ఉద్దేశ్యం లేదని బీజేపీ రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ జారీ చేసిన ఈ ప్రకటనలో, తమిళనాడు ప్రజల సం...

భద్రాచల తలంబ్రాలకు కోటగల్లిలో ఘన స్వాగతం.. కోలాటాలతో భక్తుల ర్యాలీ

Image
భద్రాచల రామయ్య కల్యాణ తలంబ్రాలు గురువారం నాడు నిజామాబాద్ జిల్లా కోటగల్లికి చేరుకున్నాయి. ఈ సందర్బంగా కన్నుల పండుగగా మహిళలు కోలాటలతో శోభాయాత్ర కోటగల్లి లోని మల్లికార్జున దేవాలయం నుండి జైర్కోట్ హనుమాన్ దేవాలయానికి భక్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. తలంబ్రాల విశిష్టత వాటి పవిత్రత తెలియజేసి భక్తులచే భజన చేయించి అందజేశారు శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. అనంతరం మాట్లాడుతూ భద్రాచల రామయ్య కల్యానానికి తెలంగాణ రాష్ట్రం నుండి 300కిలోల గోటి తలంబ్రాలు ఓలిపించి అందించామన్నారు. అందులో కోటగల్లి నుండి పెద్ద ఎత్తున గోటి తలంబ్రాలు అందించారని తెలిపారు. భద్రాచలం నుండి 100కిలోల ముత్యాల తలంబ్రాలు భక్తుల కోసం తీసుకొచ్చానన్నారు. తలంబ్రాలు అందుకోవడం ఆనందంగా ఉందని రామకోటి రామరాజు కృషి, పట్టుదల గొప్పదని కొనియాడి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున భజన మండలి, విజయ గణపతి భజన మండలి, జేర్కోట్ భజన మండలి, మైసమ్మగుడి భజన మండలి, మార్కండేయగుడి భజన మండలి, పరమేశ్వర భజన మండలి, అభయాంజనేయ భజన మండలిలు పాల్గొన్నాయి. మీ Whatsapp లోకి మన నిజామాబ...

నిజామాబాద్ జాబ్ మేళాలో 2 వేల మందికి ప్రైవేటు ఉద్యోగాలు

Image
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా టాస్క్ సౌజన్యంతో జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని శ్రీరామ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. నిజామాబాద్, కామారెడ్డి లతో కూడిన ఉమ్మడి జిల్లా నుండి పెద్ద సంఖ్యలో యువత జాబ్ మేళాకు తరలివచ్చారు. 71 కంపెనీల ద్వారా సుమారు 2000 మందికి ఉద్యోగాలు కల్పించబడ్డాయని నిర్వాహకులు ప్రకటించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి తదితరులు విచ్చేసి, జాబ్ మేళాను లాంఛనంగా ప్రారంభించారు. వివిధ కంపెనీలలో ఉద్యోగాల కోసం ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందని అన్నారు. సుమారు రెండు వేల మందికి నేరుగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని, మరికొందరికి అప్రెంటిస్ షిప్ ద్వారా శిక్షణ కోసం ఎంపిక చేశారని అన్నారు. ఈ తరహా అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రూరల్ ఎమ్మెల్యే...